July 28, 2009

హేతువాదము - కాకిరెట్ట!!

హేతువాదం అంటే ఏమిటి? హేతువాదులేవరు?
నాస్తికులనా? విఙ్నాన సంపన్నులనా? లేక వితండవాదులా?
నాస్తికత్వం లేదా ఈ నాస్తికులు అనేవాళ్ళు ఆస్తికత్వం ఆరంభం నుండే ఉన్నారు.
ఆస్తికత్వం ఎప్పటినుండి ఉంది? వేదకాలం నుండి ఉంది.
మరి వేదాలు ఎప్పుటినుండి ఉన్నాయి? ఎవరు రాసేరు?
దీనిపై అనేక అధ్యయనాలు జరిగాయి.
దీనిపై నాస్తికులు కూడా కొంత అధ్యయనాలు చేసారు.
19వ శతాబ్దంలో సర్ విలియం జొన్స్ చేసిన అధ్యయనంలో వేదాలు క్రీ.పూ. 1500లో రాయబడ్డాయి అని తీర్మానించాడు. కానీ దానికి తగ్గ అధారాలు చూపించలేక పొయాడు.
బాలగంగాధర్ తిలక్ చేసిన అధ్యనంలో క్రీ.పూ.4500కు పూర్వమే ఈ వేదాలు రాయబడ్డాయని అనడానికి కొని రుజువులు దొరికాయి. మరి అప్పుడు ఎవరు రాసి ఉంటారు?
ఙ్నాన వంతులైన ఋషులు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం,అధర్వణవేదం.
ఈ నాలుగు వేదాలు హిందూ మతానికి పునాదులు.
హిందూ మతం యొక్క మూల సుత్రం "మానవుడిలోనే మాధవుడున్నాడు".
అంటే సాటి మనిషిలోనే భగవంతుడిని దర్శించడం.
ఆ విధంగా హిందూ మతం యొక్క ఆదిని కనుగొనడం ఎవరివల్ల కాలేదు.
మనువు నాస్తికుడు అంటే వేదాలు నమ్మనివాడు అని అర్ధం చెప్పాడు.
అంటే అప్పటినుందే ఈ నాస్తికులున్నరన్నమాట.
ఒక ఉదాత్తామైన లక్ష్యంతో మరెంతో ఘనమైన చరిత్రతో ఆది అంతాలు లేని ఏకైక మతం
హిందూ మతం.
కాలగతిన కొంతమంది దానిని వక్రీకరించి తమ స్వార్ధానికి వాడుకున్నంత మాత్రాన
దాని మూలాలను తప్పుబట్టడం సరియైనది కాదు.
తప్పు జరిగినప్పుడు దానిని ఖండిచడానికి ఏ మతమూ అడ్డు రాదు.
హిమవత్ పర్వతాల కీర్తికి అసూయ చెందిన ఒక కాకి ఆ పర్వతంపై రెట్ట వేసి
"ఆహ నేను హిమాలయాల తెల్లదనాన్ని పోగెట్టేను" అనుకున్నదట.
అలా ఉంటాయి ఈ హేతువాదుల చేష్టలు.
హేతువాదులమనుకొనే ఓ వితండవాదులారా
మనిషియొక్క నడవడికను తప్పుబట్టండి, మతాన్ని కాదు.

July 25, 2009

తిక్క వేషాలు!!

మా బాసు ఆఫీసులో నాకు ఒక అసైన్మెంట్ ఇచ్చాడు. నిజానికి అది పూర్తిచేయడానికి రెండు మూడు రోజులు పడుతుంది. కానీ దానిని మరుసటి రోజుకు పూర్తి చేసి హెడ్ ఆఫీసుకు పంపాలి. ఆ బాధ్యత నామీద పెట్టాడు. ఆ రోజు ఉదయాన్నే ఏడు గంటలకు ఆఫీసుకు చేరుకున్నాను. చేరుకున్నదే తడవుగా పని ప్రారంభించాను. ఒక అర్ధగంట గడిచిందో లేదో ఫోన్ మ్రోగింది. ఇంత పొద్దున్నే ఎవరబ్బా అనుకుంటూ ఫోన్ తీశాను. హల్లో అని పలకరిస్తే అవతలివాళ్ళు
"సెప్టిక్ టాంక్ క్లీనరా?" అని అడిగాడు. నాకు మొదట అర్ధం కాలేదు.
మరోసారి "ఏమిటి?' అని ప్రశ్నించాను.
అవతలి వ్యక్తి "ఏమయ్యా ఇది సెప్టిక్ టాంకు క్లీను చేసే టాంకర్ లా రీయేనా?" అని అడిగాడు.
నాకు భలే తిక్క పుట్టింది. ఒళ్ళు తెలియకుండా పొద్దున్నే మా నంబరుకి ఫోన్ చేసి నా పని చెడగొట్టడమే కాకుండా సెప్టిక్ టాంక్ క్లీన్ చేసే అఫ్ఫీసా అని అడుగుతున్నాడు. కాస్త కోపన్ని అదుపులో ఉంచుకొని నెమ్మదిగా
"అవును" అని సమాహానం చెప్పాను.
"మా సెప్టిక్ టాంక్ నిండిపోయింది. అది క్లీన్ చేయాలి" అన్నాడు
"మీరు ఉండేది ప్రదేశం ఎక్కడో?" అన్నాను అతడు వివరాలు చెప్పాడు.
"మీ ఇంటిలో ఎంతమంది ఉంటారు?" నేను
"నలుగురు" అతడు
"అందరూ పెద్దవాళ్ళేనా?" నేను
"ఆ..అందరూ పెద్దోళ్ళే" అతడు.
"టాంక్ వెడల్పు లోతు ఎంత?" నేను
"ఉంటాది లోతు పది అడుగులు వెడల్పు ఎనిమిది"
"మీ ఇంటిలో అందరూ బలంగానే ఉంటారా?" నేను
"ఆటి ఇవరాలెందుకు?" అతను
"నే చెపుతాగా...మీ ఇంటిలో నాలు బక్కెట్లు ఉన్నాయా?" నేను
"ఆ ఉండాయి" అతను
"నాలుగు తాళ్ళు ఉన్నాయా?" నేను
"తాళ్ళు ఉండాయి" అతడు
"ఆ తాళ్ళు బక్కెట్లకి కట్టి మీరు నలుగురూ కలిసి తోడి పక్కింట్లొ పోసేయ్యండి" అన్నాను నేను
"అదేంటి మేము తోడటమేంటి?" అతడు
"ఏం మీరు పెట్టిన చెత్త మీకే అసహ్యం వేస్తే ఎలా? దానికి మేము రావాలా? ఇంకోసారి టాంకర్ కావాలని ఫోన్ చేస్తే టాంకర్లో ఉండే చెత్త తీసుకొచ్చి మీ ఇంట్లో పొయిస్తా. ఫోన్ పెట్టు" అని అరిచాను.
అప్పటిగ్గాని నా కోపం తీరలేదు. ఇది జరిగి వారం రోజులైయింది. ఈ సంఘటన మా ఫ్రెండ్స్‌కి చెప్పి పడి పడి నవ్వుకున్నాము ఆ సమయంలో ఫోన్ చేసిన వ్యక్తి మొహం ఎలా ఉండి ఉంటుందో తలుచుకొని. ఇది నిజంగా తిక్క వేషమే కదా?

July 20, 2009

కె.బ్లా.స. పై కోర్టులో కేసేస్తా..!!

అవును మిరు విన్నది నిజమే. కె.బ్లా.స.పై కోర్ట్‌లో కేసేద్దమని నిర్నయించుకున్నాను. లేకపొతే ఒక పార్టీలో గానీ ఒక సంఘంలో గానీ అద్యక్షుడు ప్రజాస్వామ్యయుతంగా ఎన్నిక కావాలిగానీ ఫ్రెండ్షిప్‌కొద్దీ పదవులూ ఇచ్చేసుకుంటే ఎలా? తె.రా.స లో పరిస్తితి చూసికూడా ఇలా ఒంటెద్దు పోకడలకు పొతే ఎలా? కె.బ్లా.స లో అలా జరగడానికి వీలు లేదు. ఎన్నికలు జరగాల్సిందే. లేదా నాదో కోరిక తీర్చాలి. అదేమిటంటే ఒక్క రోజైనా ఆ అద్యక్ష పదవి నాకు ఇవ్వలి. అదీ ఒప్పందం. ఎందుకంటే కె.బ్లా.స అద్యక్ష హోదాలో బ్లాగర్లకు ఒక విన్నపం /నోటీస్/ సూచన ఎదైనా గానీండి ఒకటి చేయాలి. అదేమిటంటే నోటీస్ సారాంశం ఇది. తెలుగు బ్లాగర్లకు విన్నపం. బ్లాగంటే ఒక ఙ్నాపికలా ఉండాలి. చూడగానే మనసులోని సంఘటన ఎప్పటిదో తట్టి లేపేదిగా ఉండాలి. మదుర స్మృతిగా ఉండాలి. చూడగానే అబ్బ అనిపించాలి. ఎవ్వరూ గమనించని విషయాన్ని తట్టి లేపాలి. విఙ్నానాన్ని ఇవ్వాలి. వినోదాన్ని ఇవ్వాలి.మనసుకు ఉల్లసాన్ని, ఉత్సాహాన్ని ఇవ్వాలి. ఆలోచన కలిగించాలి, ఆశ్త్చర్యాని కలిగించాలి. టపా చదవగానే వేళ్ళు అసంకల్పితంగా కామెంట్ బాక్స్‌వైపు కదలాలి. పైన చెప్పిన విధంగా ఒక్క లక్షణం లేకపోయిన పర్వాలేదు, కానీ కొందరిని కించపరచేదిగా ఉండకూడదు. కొందరి మనో భావాలు గాయ పరచేదిగా ఉండకూడదు. వర్గ బేధాలు, కుల బేధాలు కలిగించేదిగా ఉండకూడదు. ఈ మధ్య బ్లాగుల్లో సున్నితమైన అంశం మత భావాలపై వస్తున్న టపాలు చూడగానే కొందరి మనసులు ఖచ్చితంగా గాయ పడి ఉంటాయి. మరీ ముఖ్యంగా హిందూ దేవుళ్ళపై వస్తున్న టపాలు, వారి వెక్కిరిస్తూ రాస్తున్న రాతలు నిజంగా శోచనీయం. ఎవరి విశ్వాశం వారిది. ఒకరి విశ్వాశాన్ని గౌరవించకపోయినా అగౌరవ పరచడం అమనుషం. ఇటువంటి టపాలకు బ్లాగు లోకంలో గౌరవ సభ్యులుగా (నేను) భావిస్తున్న పెద్దలు కూడా వంత పడడం మరింత క్లేశాన్ని కలిగిస్తోంది. మతపరంగా జరిగే అన్యాయాన్ని అడ్డగించు, మతాన్ని కాదు. మతం ఒక నమ్మకం. మతం ఒక విశ్వాశం. బ్లాగుల్లో హిట్లే పరమావధిగా, కామెంట్లే కొలతలుగా రాతలు రాసే వితండవాదులు ఉన్నారు. వారిని నిరుత్సాహపరచవలసిన బాధ్యత కూడా అందరిపైనా ఉంది. ఒకరు చీ కొట్టినప్పుడు నడవడిక మారితే అతడు మనిషి, లేకపొతే అతడు మహిషి. ఇట్లు కాబోయే అద్యక్షుడు, కె.బ్లా.స. అదండీ మాటర్. మరి నాకు ఒక్కరోజు అద్యక్ష పదవి ఇచ్చినా లేక నా నోటీస్ మీరు ఇచ్చినా నాకు అభ్యంతరం లేదు. విషయం తేల్చగలరు.

July 19, 2009

మీ బ్లాగులో ఒకే టపాకు వంద కామెంట్లు కావాలాంటే..

తెలుగులో బ్లాగడమంటే దురదగుంటాకు ఒంటికి రాసుకోవడమే.
దురదగుంటాకు ఒంటికి రాసినకొద్దీ దురదలు పెరుగుతాయి.
అలాగె బ్లాగులో హిట్లు వచ్చేకొద్దీ బ్లాగడం పెరుగుతుంది.
మీరు కష్టపడి ఒక విషయం రాస్తే అదెవ్వరూ చదవలేదనుకోండి మీరు ఫీలవుతారా లేదా?
మరి మీరు రాసిన ప్రతీ విషయం ప్రతీ ఒక్కరిని చదివేలా చేయాలంటే కొన్ని సూత్రాలున్నాయి.
బ్లాగు సుత్రాల్లో మొదటిది మీరు ఎవ్వరూ వాడని పదాలు వాడాలి, వాటికి అర్ధం మీకు తెలియక పోయినా పరవాలేదు. దాని అర్ధం తెలుసుకోవడం కోసం కొందరు కామెంటుతారు కదా!
ఒకవేళ ఎవరైనా దానికి అర్ధం అడిగితే మీకు నచ్చినట్టు చెప్పవచ్చు.
రెండోది మీరు వినమృడివై ఉన్నట్టు రాయాలి కానీ ప్రతీ విషయంలోనూ ఎవరో ఒకరిని గిల్లుతూ ఉండాలి.
దానివల్ల బ్లాగుకు హిట్లు పెరుగుతాయి. ఎవరైనా ప్రశ్నిస్తే పుస్తకాలు చదవడం నేర్చుకో అని చెప్పాలి.
నువ్వు రాసింది తప్పు అని ఎవరైనా అంటే, సరిగా అర్ధం చేసుకోవడంలో ఉంది, రంధ్రాన్వేషణ వద్దు అని హెచ్చరించాలి. చివరిది ఎవరైనా మరీ విసిగిస్తే నీ కామెంట్లు ఇకముందు నా బ్లాగులో కనబడవు అనాలి.
ఈ సూత్రాలు వంటబట్టించుకున్న తరువాత మీరు తెలుగు బ్లాగు ప్రారంచించాలి.
ఉదాహరణకి నా మరో బ్లాగు "చెరసాల". చెరసాలలో మొదటి టపా ఇలా రాయడం ప్రారంభించాను.


టపా హెడ్డింగ్ : సూరిగాడి అనుభూతులు
ఆ రోజు పొద్దుగాలే సూరిగాడు లేచిండు. ఆడితోబాటు ఆడయ్య లేచిండు. ఆడయ్యతోబాటు ఆడమ్మ లేచింది.
ఆళ్ళతో్‌బాటే ఆళ్ళ కోడి లేచింది.ఒక్కసారిగా ఊరికి బ్రాహ్మనీకం వచ్చింది. (ఇక్కడ బ్రాహ్మనీకం అంటే తెలుగుదనం అని అర్ధం). ఊళ్ళోని ప్రజలందరూ అస్తిత్వాన్ని వదలి అభిజాత్యంతో తమ పనులకు బయలు దేరుతున్నారు.
ప్రతి వారూ సాంప్రదాయకంగా కట్టిన గోసీలను బిగించి పశువులను ప్రతిఘటిస్తూ కొందరూ, వర్గ సాంప్రదాయకంగా పొలాల్లోకి కొందరూ, సహేతుకంగా ఎడ్ల బండి తోలుతూ కొందరూ, సిద్ధంతాలు అలోచిస్తూ ఏమి చేయాలా అని కొందరు బయలు దేరారు. సూరిగాడికి చిన్న శంక కలిగింది. సమాజికంగా వెనుకబడిన మన ఊరోళ్ళకు ప్రభుత్వం సత్వర న్యాయం చేస్తోందా అని. వామ పక్ష చరిత్ర కలిగిన ప్రభుత్వం పోరాట పటిమ చూపితెనేగానీ న్యాయ ఫలాలు దొరకవని తెలుసుకున్న సూరిగాడు భోరున విలపించాడు.
దీనికి కారణం అగ్ర వర్నాల అభిజాత్యం అని భావించాడు. ఈ న్యాయం వారికి అందకుండా "పండితులు" కూడా అడ్డుపడుతున్నారు. సాహిత్యం, సారస్వతం అంటూ అరిచే ఈ పండితులకు తమ ఆకలి బాధలు తెలియవు.
వీరినుండి సామాజిక ప్రయోజనం ఆసించడం కన్న ఆత్మాశ్రయం ఒక్కటే మార్గం. సూరిగాడిలో ఒక సమాజోద్ధరణ భావం పైకి లేచింది. ఈ ధోరిణికి కారణం బ్రాహ్మలే ఐనా ఈ జాడ్యం తమ వారికి సోకకుండా మమేకం కావాలి అనుకున్నాడు.
అనుకున్నదే తడవు దక్షిణం వైపు పయనించాడు, కాల కృత్యాలు తీర్చుకోవడానికి.

నా ఈ మొదటి టపాకి మీరు నమ్మరు, నూట పన్నెండు కామెంట్లు వచ్చాయి.
మెచ్చుకుంటూ కాదనుకోండి. ఐనా మొత్తం మీద హిట్లు వచ్చాయా లేదా? అదీ విషయం.
కాబట్టి మీరు మొదలు ఈ సూత్రాలు పాటించండి.

July 15, 2009

దుఖ్ఖించువారు ధన్యులు వారు ఓదార్చబడుదురు !!

ఈ రోజు ఉదయాన్నే, దేశంలో మనకు తెలియకుండా రాత్రి ఏమి జరిగిపోయిందో అని టివి చానల్ స్కాన్ చేశాను. న్యూస్ చానల్స్ అన్ని కూడా అత్యంత డబ్బుప్రపక్తులతో ఒకే తరహ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్నాయి. ఏ చాన్నల్స్ చూసినా ఒక్కటే మాట పాపులను రక్షిస్తామని. పాపులను రక్షిస్తే మరి పుణ్యాత్ముల సంగతేమిటో? ఒక రకంగా భగవత్‌గీత చెప్పేదానికి ఖురాన్ చెప్పేదానికి కొంత సారూప్యం ఉంది. రెండూ కూడా తప్పులు చేయద్దనీ చేసినవారు శిక్షించబడతారనీ చెబుతాయి.ఇదివరకు విజయవాడ రేడియో కేంద్రం నుండి ఉదయం పూట నాతియాకలాం ప్రసారమయ్యేది. అది వింటు ఉంటే భగవత్‌గీత వింటున్నామా లేక ఖురానా అనే సందేహం వచ్చేది. మంచి అనేది మతంతో సంభందం లేకుండా ఎవరు చెప్పినా వినాలి. హేతుబద్ధంగా భగవంతుడితో సంబంధం లేకుండా మంచి ప్రవర్తన ఉన్నా కూడా మంచిదే. కానీ పాపాలు చేసినా నిన్ను దేముడి చేత రక్షణ కల్పిస్తానని అనడం ఎంతవరకూ సబబో నాకు అర్ధం కాలేదు.పాపాలు కడిగివేయబడతాయిట. ఇదేదో నాకు రాస్ట్ర ప్రభుత్వం చేసున్న బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీంలా అనిపించింది. ముందు తప్పుడు తడకలతో అప్రూవల్ లేకుండా నిర్మించడం, తరువాత తప్పులకు జరిమానా చెల్లించడం. నన్ను ఇంకా ఆశ్చర్య పరచింది, కుంటి వాళ్ళు, గుడ్డివాళ్ళు క్షణంలో వారి అంగ వైకల్యాన్ని పోగొట్టుకోవడం. ఒక వ్యక్తిని స్టేజ్ పైకి వీల్ చైర్‌లో తీసుకొచ్చారు. మతపెద్ద చేతితో అతనిని తాకగానే ఆ వ్యక్తి కరెంట్ షాక్ తగిలినట్టు కింద పడి వెంఠనే లేచి నిలబడి " నా రెండు కాళ్ళూ ఇప్పుడు పనిచేస్తున్నాయి" అని అరుస్తూ స్టేజ్ అంతా పరిగెత్తాడు. ఇది నిజంగా నమ్మశక్యమా? ఇది ప్రజలను వంచించడం కాదా? హేతువాదులకు ఇది కనిపించదా? హిందువుల మూఢ భక్తిని తప్పుబట్టే రాడికల్స్ ఈ విషయంపై ఎప్పుడైనా చర్చించారా?

July 13, 2009

కడుపు మంట - రకాలు

మనుషులకు వచ్చే కడుపు మంటలో రెండు రకాలున్నాయి. మొదటిది టీలు ఎక్కువ తాగడం, సిగరెట్లు కాల్చడం, సమయ పాలన లేని భొజనాలవల్ల ఎసిడిటీ పెరిగి వచ్చే కడుపు మంట. ఈ వ్యాధిని డాక్టర్ నయం చెయగలడు. రెండోది మనవల్ల ఇతరులకు వచ్చే కడుపు మంట.అంటే ఆఫీసులో బాసుకు మన పని నచ్చి ప్రమోషన్ ఇచ్చాడనుకోండి. మన కొలీగ్స్‌కు కడుపు మండవచ్చు. అలాగే అద్దె ఇటిలో ఉండే మనం ఒక సొంత ఫ్లాట్ కొనుక్కొని మారి పోతున్నామనుకోండి, ఆ అద్దె ఇంటి ఓనరుకి కడుపు మండవచ్చు. రోజూ డొక్కు స్కూటర్‌మీద తిరిగే మనం కొత్త బైక్‌గానీ కొత్త కారుగానీ కొన్నామనుకోండి, మన పక్క ఫ్లాట్లోని వాళ్ళకి కడుపు మండవచ్చు. పెళ్ళికాని మనకు, మనకు తెలిసిన పెళ్ళైనవాళ్ళందరూ రోజూ "ఇంకా ఎన్నాళ్ళు? ఇంకా లేటైపొతే పెళ్ళి చేసుకుందమాన్న దొరకరు" అని సలహాలిచ్చే సమయంలో ఒక అందమైన పెళ్ళాం దొరికిందనుకోండి, సలహాలిచ్చినవాళ్ళందరికి కడుపు మండవచ్చు. మా అబ్బాయి క్లాసులో జెం, ఎప్పుడూ ఫస్టు రాంకే అని ఫోజు కొట్టే పక్కింటి అంకుల్, ఈ సారి వాళ్ళబ్బాయికి పదవ రాంక్ వచ్చి మనవాడికి ఫస్ట్ రాంక్ వచ్చిందనుకోండి, అంకుల్‌కి కడుపు మండవచ్చు. మనింటిలో లేని వస్తువుగురించి పక్కింటి ఆంటీ రోజూ గొప్పగా చెపుతున్న సమయంలో మనంకూడా ఆ వస్తువు కొనేసామనుకోండి, ఆంటీకి కడుపు మండవచ్చు. నేను వాడే వస్తువులన్నీ ఇంపోర్టెడే, లొకల్ వస్తువులు నేను వాడను అని ఫోజ్‌కొట్టే అంకుల్‌కి, నాక్కూడా మా అబ్బాయి అమెరికానుండీ సెల్‌ఫోన్ పంపించాడని చూపించామనుకోండి, అప్పుడా అంకుల్‌కి కడుపు మండవచ్చు. ఇన్ని రకాల కడుపు మంటలున్నాయన్నమాట! ఈ మంట చాలా మందికి లేకపోయినా ఒక్కొక్క సందర్భంలో బైట పడుతుంది. దీనిని ఏ డాక్టరూ నయం చేయలేడు.ఈ రకం కడుపు మంట వచ్చినప్పుడు ఆ వ్యక్తులు విచిత్రంగా ప్రవర్తిస్తారు. కారు కొన్నామని పక్కింటి అంకుల్‌కి చెప్పేమనుకోండి, వెధవది రెండు లక్షలు పెడితే కారు. ఈ ట్రాఫిక్‌లో కారునడపడం అంత చిరాకు మరేది లేదు. నేనైతే ఎప్పుడైనా కావాలంటే టాక్సీని పిలుచుకొనె దర్జాగా వెళ్ళి వస్తాను అంటాడు. మనవాడికి ఫస్ట్ రాంక్ వచ్చిందని చెపితే, ఏమి చదువులో ఏమి స్కూళ్ళో, పిల్లలనందరిని కూర్చోబెట్టి రుబ్బించేస్తున్నారు.మా కాలంలో ఇలా కాదు అంటాడు. నాకు పెళ్ళి కుదిరింది అంటూ పెళ్ళికూతురు ఫొటో చూపించామనుకోండి, అందం కొరుక్కుతింటామా ఏమిటి, అమ్మాయి నెమ్మదిస్తురాలో కాదో కనుక్కున్నావా అంటారు. ఇది చాలామందికి ఉండే కడుపు మంట. ఇలాంటివాళ్ళని సంతృప్తి పరచడానికి మార్గాలు వెదకాలి. ఉదాహరణకి కారుగాని, బైక్ గాని కొన్నాక, పక్కింటాయనకి కారు కొని అలా తీసుకొస్తున్నానో లేదొ ఆటోవాడు వచ్చి గీత పెట్టేసాడని చెపితే ఆయన కారుకు లేద బైక్‌కి పడ్డ గీతని చూడటానికి ఆనందంగా వస్తాడు. మనం చేసిన పనుల్లో మైనస్ పాయింట్లు ముందుగా వీళ్ళకి చెప్పేస్తే వాళ్ళు ఆనందపడతారన్నమాట. వీళ్ళ కడుపు మంటకి అదే మందు.
సూచన: కడుపులో ఎటువంటి మంటలు లేనివారు స్థితప్రఙ్నులని భగవత్‌గీతలో చెప్పబడింది.

గోపి గోపిక గోదావరి & తలనొప్పి

వంశీ సినిమాలంటే నాకో ప్రత్యేక అభిమానం ఉంది. చక్కని సెంటిమెంట్‌తో మలుపులు తిరిగే కధ, హాస్యం మంచి చిత్రీకరణ వంశీ సొంతం. అదే అభిప్రాయంతో గోపి గోపిక గోదావరి సినీమాకి వెళ్ళాను. నాకు చాలా గందరగోళంగా అనిపించింది. టూకీగా కధ ఏమిటంటే గోపీ(వేణు) హైదరబాదులో ఒక ఆర్కెస్ట్రా సింగర్. గోపిక (కమలిని ముఖర్జీ) గోదావరి ఒడ్డున ఉన్న పోలవరంలో ఒక డాక్టర్. గోదావరిలో తిరిగే ఒక లాంచిలో మొబైల్ హాస్పిటల్ నడుపుతూ చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజలకి వైద్యం చేస్తూ ఉంటుంది. ఒక రోజు గోపికి ఒక మొబైల్ ఫోన్ దొరుకుతుంది. ఆ ఫోన్‌కి గోపిక ఫోన్ చేస్తుంది. ఆ ఫోన్ తనకి దొరికిందని గోపి చెపుతాడు.ఆ ఫోన్ హైదరాబాదులో ఉన్న తన స్నేహితురాలిది అని ఆ ఫోన్‌ను ఆమెకి అందచేయాలని గోపీని గోపిక కోరుతుంది. గోపీ ఆ ఫోన్‌ను తీసుకొని ఆమె వద్దకు వెడితే ఆ ఫోన్ పోవడం మూలాన ఆమెకు ఆమె బాయ్ ఫ్రెండ్‌కు జరిగిన గొడవలవల్ల ఆమె ఆత్మహత్య చేసుకున్నదని తెలుస్తుంది. అదే విషయాన్ని గోపి గోపికకు తెలియ చేస్తాడు. తరువాత స్నేహితురాలి తండ్రి గోపికను కలిసి తన కూతురు ఆత్మహత్య చేసుకున్నప్పుడు గోపి చాలా సహాయం చేసాడని చెపుతాడు. దానితో గోపిక గోపీ ఫోన్ మిత్రులవ్వడం వారిద్దరూ ఫోన్లోనే ప్రేమిచుకోవడం జరుగుతుంది. ఒకసారి హైదరాబదులో కలుసుకోవాలనే వారి ప్రయత్నం ఫలించదు. గోపి తల్లికి విషయం తెలిసి వారి పెళ్ళికి ఒప్పుకోక్పోవడంతో గోపిక గోపీని వచ్చి తన తల్లిని ఒప్పించమని చెపుతుంది. పోలవరం బయలుదేరిన గోపీ మరో గొడవలో ఇరుక్కొని తలమీద గాయంతో గోదావరిలోకి తోసేస్తారు దుడగులు. అతనిని గోపిక చూసి రక్షించి వైద్యం చేస్తుంది. కాని అతనికి తలమీద తగిలిన గాయంవల్ల ఙ్ణాపక శక్తి పోతుంది. అతనని తన హాస్పిటల్‌లోనే ఉంచుతుంది కానీ అతనే తన గోపీ అని తెలియదు. తరువాత అతనికి ఙ్నాపక శక్తి తిరిగి వచ్చినా తనే గోపీని అని చెప్పడు. ఇంతలోఅ గోపీ చనిపోయడని అనుకొని మరో పెళ్ళికి సిద్దపడుతుంది గోపిక. ఆ సమయంలో గోపీ తల్లి అసలు విషయం బయటపెడుతుంది. చివరికి వాళ్ళిద్దరూ పెళ్ళి చేసుకుటారు. మధ్యలో కొన్ని ట్విస్టులు ఉన్నా కధ అంతా చాలా బోరుగా సాగింది.ఇరవై సంవత్సారల క్రితం తీయాల్సిన సినిమ. వంశీ సినీమల్లో సంభాషణల్లో శృంగారం ఉంటుంది. కానీ దీనిలో కాస్త శృతి మించింది . ఫొటోగ్రఫీ కూడా ఏమాత్రం బాగాలేదు. టోటల్‌గా రెండున్నర గంటల సినిమా రెండున్నర యుగాలుగా గడిచింది.

July 9, 2009

హేతువాదులూ మీరు ఆస్తికులా లేక నాస్తికులా?

ఈ మధ్యకాలంలో హేతువాదులమని చెప్పుకోవడం ఒక గొప్ప క్వాలిఫికేషన్ అని జనాలు అనుకుంటున్నారు. హేతువాదమంటే సైంటిఫిక్‌గా నిరూపించబడితేనే వారు ఏ విషయాన్నైనా నమ్ముతారన్నమాట. హేతువాదమనేది ముఖ్యంగా నమ్మకాలతొ ముడిపడి ఉంటుంది. ఆస్తికత్వం పుట్టినప్పుడే నాస్తికత్వం పుట్టి ఉంటుంది.దేముడు ఉన్నాడా లేదా అనే విషయంపై అనాదిగా చర్చలు జరుగూతూనే ఉన్నాయి. బ్లాగుల్లో కూడా ఈ విషయం పై అనేక చర్చలు జరిగే ఉంటాయి. కానీ నాస్తికులకన్నా ఆస్తికులకు కొన్ని అడ్వాంటేజీలు ఉన్నాయి. పొద్దున్నే లేవగానే అద్దంలో చెత్త మొహం చూడకుండా చక్కగా దేముడి మొహం చూసుకోవచ్చు. ఏదైన కష్టం వచ్చినప్పుడు ఓరి దేముడో నేనేమి పాపం చేసేనురో అని దీర్ఘంగా ఏడవచ్చు. మన చేతుల్లో లేని పని ఏదైనా ఉంటే దేముడిపై భారం వేయవచ్చు. గుళ్ళు గోపురాలంటూ చక్కగా ఊళ్ళు తిరగొచ్చు. మరిన్ని అడ్వాంటేజీలు వదులుకొని నాస్తికులు ఏమి సాధిస్తారో నాకు తెలియదు. భూమిమీద గాలి నీరు తిండి ఆవకాయి, మాగాయి అన్నీ ఉన్నాయి.మరే ఇతర గ్రహాలమీద లేవు. ఆస్తికులు ఇవన్ని భగవంతుడి సృష్టి అని తృప్తిగా చెప్పుకుంటారు. కాని నాస్తికులు ఇవన్ని అనుభవిస్తూ కూడా ఇదంతా ఎవరు సృష్టించారో తెలియని సైన్స్ అంటారు. భూమిపై హాయిగా నడుస్తున్నాము, డాన్స్ చేస్తున్నాము. భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంది కాబట్టే నడవగలుగుతున్నమని అంటే మరి ఇతర గ్రహాలకు ఎందుకు లేదు? సూన్యంలో గ్రహాల్న్ని వలయాకారంలో తిరగడానికి శక్తినిచ్చినదెవరు? చంద్రుడికి లేని గురుత్వాకర్షణ భూమికి ఎలా వచ్చింది? చంద్రుడిలొని చల్లదనం సూర్యుడికి ఎందుకు లేదు? వీటిలోని మంచి లక్షణాలు భూమి ఎలా అందుకోగలుగుతోంది? మనం మురిసిపోయే తొలకరి జల్లులు భూమికే ఎందుకు? ఇవన్నీ మన కళ్ళ ఎదుటి సాక్ష్యాలు. గ్రహ మండలాల గురించి సైన్స్ చెప్పేది చాలావరకు ఊహాగానాలు మాత్రమే. జీవిత కాలం అంతా కనుగొని చెప్పింది పిసరంత. ఇంకా బొలేడు మిగిలి ఉంది. కనిపించేదానికి కారణం చెప్పడానికే ఇంతకాలం పడితే అది సృష్టించబడడానికి ఇంకెంత శక్తి కావాలి? ఆ తెలియని శక్తే భగవంతుడని అనుకుంటున్నారు. అతని రూపం ఊహాజనితం కావచ్చు, కదలికలు ఊహజనితం కావచ్చుగాక ఆడ మగా అనేది కూడా ఊహా జనితం కావచ్చు.అది ఏదైనా ఎవరైనా ఒక శక్తికి ప్రతిరూపం. ఇంకో చిన్న విషయం ఆస్తికుడు చచ్చిపోతూ నేను అందరికి మంచి చేసాను భగవంతుడు మరుజన్మలో నాకు మంచి చేస్తాడు అనే తృప్తితో మరణిస్తాడు. కాని మరుజన్మ లేదనుకొనే నాస్తికుడు నా శరీరంలోని కదలికలు ఇక ఆగిపొతాయి, ఇక నేను చెయగలిగేది ఏమిలేదు అనుకుటూ మరణిస్తాడు. ఇదే ఆస్తికత్వానికి నాస్తికత్వానికి ముగింపులోని తేడా. మీరేమంటారో?

July 7, 2009

తెలుగు బ్లాగరు పారిపోతున్నాడు పట్టుకోండి!!

నేనా రోజు బజారుకు వెళ్ళాను. అంతా చాలా రద్దీగా ఉంది. ఫ్రూట్స్ కొందామని చూస్తూంటే కొందరు వ్యక్తులు ఒక యువకుడిని వెంటపడి తరుముతున్నారు. ఆ యువకుడు ఆ వ్యక్తులనుండి తప్పించుకోవాడినికి వేగంగా పరిగెడుతున్నాడు. ఆ గుంపులో వివిధ వయస్సుల వాళ్ళు ఉన్నారు. కొందరు అరుస్తున్నారు
"ఎలాగైన పట్టుకోండి..మళ్ళీ బ్లాగులో రాయకుండా చితక్కొంట్టండి" అంటున్నారు. మరికొందరు
"పారిపోతే దేశంలో ఎక్కడినుండైనా బ్లాగింగ్ చెశేస్తాడు. చేతులు విరగ్గొట్టండి" అంటున్నారు.
నేను పరిగెడుతున్న గుంపులో ఒక వ్యక్తిని పట్టి ఆపి "ఎందుకు అలా తరుముతున్నారు?" అని అడిగేను.
దానికి అతను " ఏమి చెప్పమంటారు! మేమంతా ఒక మంచి మాట చెప్పుకుందామని, చిన్న నాటి విషయాలు గుర్తుకు తెచ్చుకొని మురవాలని, ఒకరికి తెలిసిన విషయం మరొకరు పౌచుకోవాలెన ఉద్దేశ్యంతో తెలుగు బ్లాగులు ఏర్పాటు చేసుకున్నాము. వీడు మధ్యలో దూరిందే కాకుండా ఎవ్వరికీ ఇష్టం లేని విషయాలు పదే పదే రోజుకు పదిసార్లు రాస్తూ కొన్ని నెలలుగా విసిగించేస్తున్నాడు.విసిగించకురా అని చెప్పినా వినట్లేదు. మా అందరికీ వీడిబానుండీ ఎలా తప్పించుకూవాలో తెలియట్లేదు. అనుకోకుండా ఇప్పుడు దొరికేడు.మరోసారి రాయకుండా చెసేస్తేగానీ వాడికి బుద్ధి రాదు" అన్నాడు ఒగురుస్తూ.
గుంపు ముందుకు సాగిపొయింది.
కొద్దిసేపటికి నా పనులు చక్కబెట్టుకొని తిరిగి వస్తూ ఉంటే ఆ యువకుడు జేబులో చేతులు పెట్టుకొని ఈల వెసుకుంటూ నెమ్మదిగా విలాసంగా ఎదురు వస్తున్నాడు. నేను అతనికి ఎదురు వెళ్ళి అతనిని అడిగాను
" వాళ్ళు నిన్నెందుకు తరుముతున్నారు?" అని.
అతడు చిద్విలాసంగా "నేను దొరకలేదుగా" అన్నాడు.
" సరేగాని విషయం ఏమిటో చెప్పు" అన్నాను.
"నేను కూడా ఒక బ్లాగు రాస్తున్నాను. దాని పేరు 'అ టు అహా కలలు'. దానిలో నాకిష్టమైన హీరో చరణ్‌జీవి గురుంచి రాస్తూ ఉంటాను"
" దానినికి వారికెందుకు అంత కోపం? ఏం రాసేవాడివి" అన్నాను.
" నా హీరో గురించి అన్ని విషయాలు. ఉదయం లేచి నప్పటినుంది పడుకొనే వరకు, సినీ హీరో గా, పార్టీ పెట్టిన హీరోగా, కాబోయే ముఖ్య మంత్రిగా,వివిధ దశలుగా వర్ణించేవాడిని"
"నువ్వేమి చేస్తూవుంటావు?" అడిగాను
"బ్లాగులు రాస్తూ ఉంటాను" అన్నాడు
"రాయడం అయ్యకా ఏమి చేస్తావు?" మళ్ళీ అడిగాను
"మళ్ళా రాస్తాను" అన్నాడు
"రోజూ ఎన్ని సార్లు రాస్తావు?" అడిగాను
"నిద్రొచ్చేదాకా ఒక పది పదిహేను రాస్తాను" అన్నాడు
"మరికాస్త విపులంగా చెపుతావా?" అని అడిగాను.
"నా హీరో చరణ్‌జీవి పార్టీ పెట్టినప్పుడు అతని సిద్ధంతాలు విపులంగా ఊహించి వివరించాను. అతనికి అభిమానులు జైకొడుతున్నప్పుడు అతని పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అని చెప్పాను.మీటింగులకి జనం భారీగా వస్తే రెండువందల నలభై సీట్లు వస్తాయని ధీమగా చెప్పాను. ఎవరైనా జోకులేస్తే నాకు చిరాకని రాసేను. కాబోయే ముఖ్య మంత్రి అని చెప్పాను.సీట్లు అమ్ముకొంటున్నారని ఎవరైనా విమర్శిస్తే అంతా భూటకం అని అన్నాను."
"మరి నువ్వు చెప్పినట్ట్లు మీ హీరో పార్టీకి రెండువందల నలభై సీట్లు వచ్చాయా?" నేను
"నలభై కూడా రాలేదు" అన్నాడు
"మరి మీ హీరో ముఖ్యమంత్రి అయ్యాడా?" అని అడిగేను
"ముఖ్య మంత్రి కాదు పోటీ చేసిన స్థానల్లో ఒకచోట ఓడిపొయాడు కూడా" అన్నాడు
"మీ పార్టీ స్థాపకులలో సత్రా కూడా ఒకరు కదా?" అని అడిగాను
"అవును" అన్నాడు
"మరి ఆయనే పార్టీని వదిలి పెట్టి పొతే నువ్వేమి పాముతున్నావు" చిరాగ్గా అడిగాను
"అందుకే ఆయన కొడుకు గురించి రాస్తున్నాను" అన్నాడు
"ఆయన కొడుకు గురించి ఏమి రాస్తున్నావు?" ఆశ్త్చర్యంగా అడిగాను
"కొత్తగా మగవీర సినిమా తీస్తున్నారుగా దానిగురించి" అన్నాడు
"రిలీజ్ కాని సినీమా గురించి నువ్వేమి రాస్తావు?" నేను
"సినీమా చాలా బాగుంటుందని, పాటలు బాగా వస్తాయని" అన్నాడు
అప్పుడు నాకు కాలింది చాలా చాలా...
వెంఠనే నా మొబైల్ తీశాను.
"ఎవరికి ఫోన్ చేస్తున్నారు?" అడిగాడతడు
"తెలుగు బ్లాగర్లకి, నువ్విక్కడ ఉన్నావని చెప్పడానికి" అన్నాను కసిగా
ఒక్క ఉదుటున పారిపోబోయాడు.
నేను పట్టుకున్నాను.
ఐనా విదుల్చుకొని పారిపోయాడు.
మీకుగనక ఎక్కడైనా కనిపిస్తే కాస్త నాక్కూడా చెప్పండి.ప్లీజ్!!

గమనిక: ఈ టపా ఎవరినీ నొప్పించడానికి కాదు. పాత్రలన్ని కల్పితాలు. నవ్వొస్తే నవ్వుకోండి.

July 6, 2009

టెన్షన్..టెన్షన్..టెన్షన్..!!

అప్పుడే తొలకరి మొదలు. ఇంటి అరుగు మీద కూర్చొని చేతులు చాస్తే చేతి పడే చినుకులు బలే అహ్లాదంగా ఉండేది. వెనువెంఠనే వచ్చే మట్టి వాసన కూడా గమంత్తుగా ఉండేది. కొత్తగా బడులు తెరిచేరు. మా క్లాసులోకి మాష్టారు వచ్చి ఒక్కక్క పేరు చదువుతున్నారు. పేరు చదివినవారంతా పాస్ ఐనట్ట్లు. మష్టారు పేరు చెప్పిన వాళ్ళు ఒక్కరూ లేచి వెళ్ళి మరో తరగతి గదిలో కూర్చోవాలి. పేరు చదివే వరకు ప్రతీ ఒక్కరికీ టెన్షనే. క్లాసులో చాలా మంది లేచి వెళ్ళిపొయేరు. నేను చాలా కొద్ది మంది ఉండిపోయేము. మష్టారు మిగిలిన పిల్లలకి వార్నింగులు ఇచ్చారు. వెధవల్లారా రోజూ స్కూలుకి రాకపొతే వచ్చే సంవత్సరం కూడా ఇక్కడే కూర్చోపెడతాను అంటున్నారు. అదేమిటీ నేను రోజూ స్కూలుకి వస్తాను కదా! నన్ను ఫెయిల్ చేయడమేమిటె? నా మొహం అవమానంతో ఎర్రబడింది.కాళ్ళు వణుకుతున్న భావన.కళ్ళలోంచి నీళ్ళు పొంగడానికి సిద్ధంగా ఉన్నాయి. నా ఇంద్రియాలు పనిచేయడం మనేశాయి. మష్టారు పిల్లలని తిట్టే తిట్ట్లు ఎక్కడో దూరం నుంది వస్తున్నట్ట్లు అనిపిస్తోంది. చివరిగా వాళ్ళని ఉద్దేశించి ఈ సంవత్సరమైనా బుద్ధిగా స్కూలుకి రండి అంటూ ముగించి నా వైపు తిరిగేరు. నాతో రా అన్నట్ట్లు తల ఊపి ముందుకి కదిలేరు. నేను ఈ ప్రపంచంలో లేను. చెక్క బొమ్మలా అలాగే నిలబడి ఉన్నాను. అక్కడ ఏమి జరుగుతోందో నాకు స్పృహలో లేదు. ఆయనే మళ్ళీ వెనకు వచ్చి నా చేయి పట్టుకొని ముందుకు కదిలేరు. నేను ఆయన వెంట కదిలేను - ఒక రకంగా లాక్కువెళ్ళేరు. అందరూ వెళ్ళి కూర్చున్న క్లాసుకు కాదు. మరో తరగతికి - ఆ తరువాతి తరగతికి. అక్కడి మేష్టారికి నన్ను అప్పచెప్పి అన్నారు, వీడు తెలివైన వాడు. నా క్లాసులొనే హైయ్యర్ క్లాసు పుస్తకాలు కూడ చదివేశేవాడు. ఒక సంవత్సరం వృధా చేయడం నాకు ఇష్టం లేదు. ఒక సంవత్సరం ముందుకు పంపుదాము. నేను వాళ్ళ నన్నతో మాట్లడతాను. మీరు వీణ్ణీ మీ క్లాసులో కూర్చొబెట్టుకోండి అన్నకగాని నాకు అర్ధం కాలేదు. నాకు డబల్ పాస్ ఇచ్చేరని.

July 3, 2009

మా(టీవి) తుఝే సలాం!

గురువారం రాత్రి తొమ్మిది గంటలకు మా టీవీ చూసిన ప్రేక్షకులందరూ తప్పకుండా భావోద్వేగానికి గురై ఉంటారని భావిస్తున్నాను.రేలారే కార్యక్రమం చూసేక ఇది నాకు కలిగిన భావన. " పల్లే కన్నీరూ పెడుతూందో కనిపించని కుట్రల" అంటూ ప్రముఖ జానపద గాయకుడు వెంకన్న చిందేస్తూ పాడిన పాట ప్రేక్షకుల గుండెను గొంతులోకి తెచ్చింది. నరాల్లో రక్త ప్రవాహం పెరిగి ఒక ఉద్వేగానికి గురై ఉంటారు. గ్లోబలైజైషన్ వల్ల కుల వృత్తులు చేసుకునెవాళ్ళు ఏవిధంగా జీవనం కోల్పోయి ఎలా అనాధలయ్యరో, పల్లెలు ఏవిధంగా బోసిపోయాయో పాడి వినిపిస్తూ ఉంటే ప్రముఖ పాటల రచయితలు సుద్దాల అశోక్ తేజ, చంద్ర బోసులు కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. జానపద గీతాలంటే ప్రజలలో మరోసారి క్రేజ్ కలిగించిన ఈ కార్యక్రమం నిజంగా ఒక ఆణిముత్యం. ప్రైవేట్ చానల్స్ మధ్య ఉన్న ఇంత పోటిలో కూడా కొన్ని విలువలకు కట్టుబడి సంస్కృతికి సంభంధించిన కార్యక్రమాలను విజయవంథంగా ప్రజల మధ్యకు తీసుకు వెడుతున్న మా తుఝే సలాం!!

July 2, 2009

గిన్నిరొట్టె కధా కమామిషు!!

మా పెద్ద పరీక్షలు ఐపొయాక వేసంగి శెలవలు ఇచ్చేవారు. అప్పటికే ఎండలు మొదలయ్యేవి.నేను కాస్త సుకుమారుణ్ణే. కొద్దిగా ఎండ తగిలితే చాలు ఒళ్ళంతా పేలి ఎర్రగా ఐపోయేది. అందుకు మా అమ్మ ఇల్లు కదలనిచ్చేది కాదు. పదకొండు కాగానే నేను ఎక్కడ ఉన్నా వెదికి పట్టుకొని ఇంటికి లాక్కు పోయేది. మాది పెంకుటిల్లే. ఎండలు ఎక్కువ ఉన్నా ఇంత బాధించేవి కావు. పెంకుటిల్లు మూలాన వేడి తెలిసేది కాదు. మరీ ఎక్కువ ఉక్కగా అనిపిస్తే పెరట్లో చెట్లకింద చేరే వాళ్ళం. పెరట్లో వేప అరటి నందివర్ధనం చెట్లు నిండుగా ఉండేవి.వేప చెట్టుకింద మడత మంచం వేసుకొని పడుకొనేవాళ్ళం. పైనుండి వేప ఆకులు, చిలుకలు ఉడతలు కొరికి పారేసే గింజలు మీద పడుతూఉంటే వాటిని చేత్తో తీసివేస్తూ పడుకొనేవాళ్ళం. మధ్య మధ్యలో కాకులు కొన్ని చిలిపి పనులు కూడా చేస్తూ ఉండేవి.ఎండ వేడికి నాకు ఒళ్ళు పేలిపోయి మరీ చిట చిటలాడుతోందని గొడవ చేస్తే మధ్యాహ్నం పన్నెండు గంటలకి భొజనాలు అయ్యేక గంధం అరగదీసి ఒంటికి రాసేది. ఆ చల్లదనానినికి హాయిగా నిద్ర పట్టేది. మళ్ళీ ఏ మూడు లేక నాలుగు గంటలకో మెలుకవ వచ్చేది. లేచేటప్పటికి మా అమ్మ నాకిష్టమైన గిన్ని రొట్టె సిద్ధంగా ఉంచేది.గిన్నె రొట్టె అంటే దాదాపు ఇడ్లీ పిండిని చేసినట్టే ముందురోజు చేసి ఉంచేది. దానిని ఉదయం పదకొండు గంటలకి కుంపట్లో బొగ్గులు వేసి దానిపై ఒక ఇత్తడిగిన్నె ఉంచి దానిలో కొంచం నూనె వేసి ఈ పిండి పొసేది. దానిపై మరో ఇత్తడి మూత ఉంచి దానిపైకూడా నిప్పులు పోసి ఉంచేది. రెండువైపుల ఆ నిప్పుల సెగకి నెమ్మదిగా కాలుతూ మధ్యాన్నానికి ఆ రొట్టె ఎర్రగా కాలి కమ్మని వాసనలొతో తయారయ్యేది. అప్పుడు దానిని బైటికి తీసి ముక్కలుగా చేసి దానిపై నేయి వేసి కొత్త ఆవకాయతో నంచుకు తింటే ఆ మజానే వేరుగా ఉండేది. ఇప్పటి పిజ్జాలుగానీ బ్లాక్ ఫారెస్టులుగాని ఎందుకూ పనికి రావు. మధ్య మధ్యలో మా అమ్మకు దొరకకుండా నేను పారిపొయేవాడిని. చింత చెట్లకింద పిల్లలం అందరూ చేరేవాళ్ళం. నెమ్మదిగా చింత చిగురు కోసి దానిని ఒక నాపరాయి మీద ఉంచి మరో రాయి తో మెత్తగా చితకగొట్టి పిల్లలు ఇంటినుండి దొంగచాటుగా తెచ్చిన ఉప్పు కారాలు కూడా దానిలో కలిపి ఆ చాట్‌ను అందరం ఎంతో అప్యాయంగా తినేవాళ్లం. నాపరాయి మీద వేసి కొట్టేటప్పుడు దానిలో కలిసిన ఇసుక పళ్ళమధ్య పడి ఒళ్ళు గగుర్పొడుస్తున్నా ఒదిలిపెట్టేవాళ్ళం కాదు. సాయంత్రం ఐతే మా పడక ఇంటిముండు రోడ్డుమిదే మంచాలు వేసుకొని పడుకొనేవాళ్ళం. పైన చంద్రుడు, కొబ్బరి ఆకుల గలగలలు, కిందనుంది కొద్ది కొద్దిగా మట్టివాసనలు. ఒక్కప్పుడు అర్ధరాత్రి హఠాత్తుగా చినుకులు పదితే మంచాలు ఎత్తి ఇంటి అరుగుమీదకి మార్చుకొనేవాళ్లం. ఏమిటో ఉద్యోగం పేరు చెప్పి ఇక్కడికి వచ్చేశాకా గిన్నిరొట్టెగాని చింత చిగురు చాట్‌గాని మళ్ళి తినడం కుదరలేదు. మళ్ళీ మా వూరు వెళ్ళి మా అమ్మ చేతి గిన్ని రొట్టె, చింత చిగురు చాట్ తినాలని ఉంది. మీరూ వస్తారా?

July 1, 2009

ప్రత్యేక దళిత చట్టాలు చేయాలేమో!

భారత దేశంలో ఇప్పటికే ముస్లింలకు ప్రత్యేక చట్టాలు ఉన్నాయి. అలాగే దళితులకు కూడా ప్రత్యేక చట్టలు చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. ఉదయాన్నే టీవిలో వార్తలు చూస్తూంటే యంపి జగన్నాధంగారు స్వయంగా బాంక్ మేనేజర్ను యస్సి యస్టీ లకు లోన్లు మంజూరులో జాప్యం చేస్తున్నారని దాడి చేయడం చాల జుగుప్స కలిగించింది. ఒక అధికారిపై ఒక యంపి స్వయంగా దాడి చేయడం అనేది నిజంగా భారత రాజ్యాంగాన్ని, వ్యస్తను అవమాన పరచడమే. ఇది వారి మూర్ఖత్వాన్ని బరితెగించడాన్ని తెలియచేస్తోంది. యస్సి, యస్టిల పేరుమీద ఏమి చేసినా చెల్లుతుందనే వారి నమ్మకానికి ఇది పరాకాష్ట.నేను చూసిన ఆఫీసుల్లో ఈ పద్దతి ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలో ఉంది. నిబంధనలు విధిగా పాటించాలనే అధికారులపై అట్రాసిటీ కేసులు పెట్టడం సర్వసాధారణం. దళితుల రక్షణకు చేసిన చట్టాలు చాలా విధాలుగా దుర్వీనియోగం చేస్తున్నారు. ఆఫీసుల్లో పనిచేయమంటే అట్రాసిటీ కేసులు పెట్టడం, కావలసిన సీటు ఇవ్వకపోతే అట్రాసిటీ కేసు పెడతామనడం ఇవిగాక యస్సి, యస్టీ సంఘాలు ఆఫీసుల్లో చేసే హడవిడి అంతా ఇంతా కాదు. అంబేద్కర్ దేశ నాయకుడు. ఆయనకు వర్గ నాయకత్వం అంటగట్టి ఆఫీసుల్లో వీరు చేసే చేష్టలు ఆయనను అవమాన పరిచేవిగా ఉంటాయి. ఎక్కడో కొన్ని దురదృష్ట సంఘటనలు మినహా వీరు చెపుతున్న విభేదాలు లేనేలేవు. న్యూనతా భావాన్ని వీరు విడిచి పెట్టి మనసులో ఉన్న విభేదాలు మరచిపోవాల్సిన అవసరం ఉంది. అగ్ర వర్నాల దురహంకారం అంటూ ఎలుగెత్తే వీరికి ప్రస్తుతం జగుతున్న ప్రేమ వివాహాల్లో ఎంతమంది యస్సి, యస్టీ వర్గాలకు చెందిన అమ్మాయిలను అబ్బాయిలను ఇతర కులస్తులు చెసుకోవట్లేదు! చట్టాల మాటున వీరు దాడులు చేయడం గర్హినీయం. ఈ ఉపేక్ష ఇలాగే కొనసాగితే కొన్నాళ్ళకు వీరికి ఓటు వేయని వాళ్ళమీద అట్రాసిటీ కేసు, పదవి ఇవ్వకపోతే ప్రధాని మీద ఒక అట్రాసిటీ కేసు పెడతారేమో! కబట్టి ఇకపై వీరు ఎలాంటి దాడి చేసినా శిక్షలు ఉండని విధంగా చట్టాలు చేయాల్సిన అవసరం ఉంది.