November 28, 2010

ఖరీదైన కూలీ !!

మా అపార్ట్‌మెంట్లో సెక్రటరీ ఒక నిర్నయం తీసుకున్నాడు. ఫ్లాట్లలో ఉండే కార్లను ఇకనుండీ వాచ్‌మెన్ తుడవడని. ఎందుకంటే కార్లు తుడవడంవల్ల ఎక్కువ సమయం దానికే పోతే అసలు పనులు చేయడానికి వాచ్‌మెన్ కి సమయం చాలట్లేదని. ఏమి చేస్తాము? ఎవరినైన మరొకరిని వెతికిపెట్టమని వాచ్‌మెన్‌కె అప్పచెప్పాను. ఒకరోజు ఉదయాన్నే వాచ్‌మెన్ ఒక వ్యక్తిని వెంటబెట్టుకొచ్చాడు. సార్ ఇయన కార్లు శుబ్రం చేస్తాడుట. కార్లు ఉదయాన్నే శుబ్రం కూడా చేశాడు. అన్నాడు. అతనితో అన్నాను "సరే నెలకు ఎంత ఇమ్మాంటావు?" అని. "నెలకు కాదు, ఈ ఒక్కరోజే తుడుస్తాను. ఇవ్వాళ తుదిచినందుకు పది లక్షలు ఇవ్వాలి" అన్నాడు మెడలోని కండువా సర్దుకుంటూ. నా చెవులను నమ్మలేక "ఎంత అన్నావు?" అన్నాను. "అక్షరాల పది లక్షలు" అన్నాడు. నా కారు విలువే ఐదు లక్షలు ఉండదు. దానిని ఒకసారి తుడిచినందుకు పది లక్షలా? మా వాచ్‌మెన్ కేసి అయోమయంగా చూశేను. వాచ్‌మెన్ అన్నాడు" అవును సారు ఆయన గొప్పనాయకుడు. అదేదొ పనికోసం చందాలు వసూలు చేస్తున్నడంట". "ఐతే మాత్రం కారు తుడిస్తే పదిలక్షలా? కావాలంటే వంద రూపాయలిస్తాను" అన్నాను. దానికి అతను కొపంగా" ఇక్కడ తిరగాలంటే పది లక్షలు ఇవ్వాల్సిందే" అంటూ వెనుతిరగబోయేడు. ఈ సంభాణ వెనకనుండీ వింటున్న మా ఆవిడ ఖంగారుగా నాతో" ఆయనతో గొడవెందుకండీ మీరు అప్పుచేసి ఇవ్వగలిగినంత ఇస్తానని చెప్పండి" అన్నది. నేను ఆయన వెంట నడుస్తూ నా బాంక్ బాలెన్స్ క్రెడిట్ కార్డులు అన్నీ చూపించి నా తాహతు ఆయను తెలియచెప్పి ఒక అంకె చెప్పాను. ఆయన అన్యమనస్కంగా ఒప్పుకొని నేని ఇచ్చిన చెక్కు తీసుకొని వెళ్ళాడు. కాబట్టి మిత్రులెవరైనా కొత్త పనివారిని పెట్టుకొనేముందు కాస్త తెలుసుకొనె మసలుకోండి. వచ్చింది మరెవరో కాదు..తెలంగాణా పులకేశి!!

August 31, 2010

ఆయన వీసినా? వీళ్ళు లెక్చరర్లా?

ఉస్మానియా యూనివర్సిటీలో వాల్యూయెషన్ కి వచ్చిన లెక్చరర్లను విద్యార్ధులు చెప్పులతో కొట్టడం చానల్స్‌లో అందరూ చూసే ఉంటారు. ఇంగిత జ్గ్యానం ఉన్నవాళ్ళెవరైనా దీనిని ఖండిస్తారు. వాళ్ళ దుశ్చర్య టివీలో స్పష్టంగా కనిపిస్తోంది. విద్యార్ధ్యులు దాడి చేయలేదని కేవలం బెదిరించారని తెలంగాణా పులకేసి చెప్పుకొచ్చాడు. వారికి కనీస ఇంగిత జ్గ్యానం లేదని అందరికీ తెలిసిందే. కానీ సదరు వీసీకి కూడా మెదడు అరికాలినుండీ మోకాలుకు చేరిపోయిందదని అనిపిస్తోంది. ఎందుకంటే జరిగిన దానిని తప్పు అని చెప్పే దమ్ము లేకపోయినా, వారిపై చర్య తీసుకునెందుకు మనసు రాకపోయినా పర్వాలేదు, కానీ దీనిని మీడియా దుశ్చర్య అని మీడియా అనవసర ప్రచారం చేసిందని చెప్పడం సిగ్గుమాలిన తనం. తెలంగాణా గొడవల్లో కూడా మీడియా అదే పాత్రను పోషించింది. సదరు వీసీని ఎవరైనా చెప్పులతో సత్కరించి ఉంటే వీరికి అభిమానం అంటే ఏమిటో తెలిసి ఉండేది. పైగా విద్యార్ధులకు నష్టం జరగకుండా వీరు చూస్తారుట. అంటే దీని అర్ధం ఆంధ్రా ప్రాంతం నుండీ వచ్చిన లెక్చరర్లు వీరికి నష్టం కలుగ చేశారనా వీరి ఉద్దేశ్యం? తోటి లెక్చరర్లను చెప్పులతో కొడితే సానుభూతి తెలపవల్సింది పోయి విద్యార్ధులపై కేసులనెత్తి వేయాలని అక్కడి లెక్చరర్లు ఆందోళన చేశారట. వీళ్ళు లెక్చరర్లా? వీళ్ళ బతుకులు చెడ! వీసి పదవికి, లెక్చరర్ మాటకి తలవంపులు తీసుకు వచ్చారు. ఇంతకన్న వెధవలు ఉండరేమో? చదువుకున్నవాళ్ళే ఇలా చస్తే, చదువు లేనివాళ్ళు మరింత మూర్ఖంగా ప్రవర్తించడం పెద్దవిషయం కాదేమో? ఇది కేవలం కాష్టాని రగిలించడానికి చేసిన ప్రయత్నమేగానీ మరోటి కాదని అనిపిస్తోంది. దానిలో కిరాయి విద్యార్ధులతోబాటు లెక్చరర్లు చేరడమే మారుతున్న విలువలకు నిదర్శనం.

August 26, 2010

బ్లాగర్లూ జర జాగ్రత్త !!

తెలుగు భాషాభివృద్ధికోసం బ్లాగర్లంతా "తెలుగు బాట" కార్యక్రమం చేబట్టడం నిజంగా అభినందించాల్సిన విషయం. గిడుగు రామ్మూర్తిగారి జన్మదినం నాడు ఈ కార్యక్రమాన్ని చేబట్టడం మరింత ఆనందించాల్సిన విషయం. నాక్కూడా ఆరోజు బ్లాగర్లందరితోనూ పాల్గొని నేనేగాకుండా మరింతమందిని తీసుకురావాలని ఉంది. కానీ కొంతమంది వక్రదృష్టి దీనిమీద పడుతుందేమో అనే సందేహం కలుగుతోంది. మొదటిది తెలుగుభాష అంటే "తెలంగాణా తెలుగా?" లేక "ఆంధ్రా తెలుగా?" అనేది మొదటి సందేహం. మరి ఏ తెలుగుభాషో తెలియకుండా నేనెలా పాల్గొనేది? రెండూ ఒక్కటే అని మీరంటే నాకేమాత్రం అభ్యంతరం లేదుసుమండీ! కానీ అంతా ఒక్కటే అంటే మరి మా తెలంగాణా పులకేసి ఒప్పుకుంటాడా? కార్యక్రమాన్ని సజావుగా సాగనిస్తాడా? పైగా కార్యక్రమం మొదలుపెట్టేది తెలుగు తల్లి విగ్రహం నుండి. అదే తెలంగాణా తల్లి విగ్రహంనుండి ఐతే మా పులకేసికి అభ్యంతరం ఉండదేమో బ్లాగర్లంతా ఆలోచించాలి. దీనికి ఒక రాజకీయ రంగు పులిమి ఇదికూడా సమైక్యవాదుల కుట్ర, తెలుగు భాష ముసుగులో వీరంతా తెలంగాణా వ్యతిరేకంగా ఉద్యమం చేబడుతున్నారంటూ దాడిచేస్తేమాత్రం నా భాద్యత లేదు. కాబట్టి బ్లాగర్లంతా తగుజాగ్రత్తలతో "తెలుగు బాట"లో పాలొనాలని నా విన్నపం.

June 9, 2010

మీడియా, జర్నలిస్టులు వేరు వేరుట !!


దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకోవడం అనేది ఒకప్పటి మాట. చానల్స్ చానల్స్ ఊళ్ళు పంచుకోవడం అనేది ఇప్పటి మాట. దొంగల ఆగడాలు కొంతవరకు పోలీసులు అరికడతారు. ప్రభుత్వ ఆగడాలను ప్రతిపక్షాలు అరిచి అడ్డుకుంటాయి. కాని మీడియా ఆగడాలను ఆపడం ఎవరి తరము కాలేదు. కానీ ప్రజల అదృష్టం కొద్దీ వారి ఆగడాలు వారే బైట పెడుతున్నారు. ఆ మధ్య రెండు చానల్స్ ఒకరిపై ఒకరు ప్రత్యక్ష వాదోపవాదనలు చేసుకుంటూ ఒకరు చేసిన ఆగడాలను మరొకరు బైటపెడుతూ మీడియా ముసుగు తొలగించి ప్రజలముందు నగ్నంగా ఆవిష్కరించారు. మీడియా అంటే ప్రజలలో ఉన్న భ్రమలు తొలగేటట్టు చేసారు. కాని ఇలాటి సంఘటనలు కొంతమంది మీడియా మితృలకు బ్లాగు మిత్రులకు కూడా మింగుడు పడలేదు. తరువాత జర్నలిస్టుల మధ్య జరిగిన వాదనలు కూడా దొంగలు దొంగలు ఒకరినొకరు బైటపెట్టుకుంటే ఎలా, ఇది మంచి విధానం కాదు అన్న పద్ధతిలో జరిగాయి. ఇప్పుడు బ్లాగుల్లో మీడియా అంటే ఒకటి కాదన్నట్టు ఉంటున్న వారి వాదనలు ఆశ్చర్యం కలగ చేస్తోంది. జర్నలిజంలో యాజమాన్యం ఒక వర్గముట. వాళ్ళు పెట్టుబడిదారులుట. పేపర్లు నడిపేది డబ్బున్న మారాజులేగానీ ధర్మరాజులు కాదని ఇప్పటివరకు వీరికి తెలియదా? ఒక్కక్క జర్నలిస్టుకు అక్షారాలా ముప్ఫైవేలనుండీ యాభైవేలవరకూ జీతభత్యాలు చెల్లించాలంటే అది డబ్బున్నా మారాజులవల్లే అవుతుంది. ఇక జర్నలిస్టులలో రెండో వర్గం యాజమాన్యం కొమ్ము కాసే వర్గమట. వీరు కూడా అసలైన జర్నలిస్టులు కాదుట. పెట్టుబడి పెట్టే యజమాన్యం తమకనుకూలమైనవారికే పగ్గాలు అప్పచెపుతుందని తెలియని అమాయకులా వీరు? తమను ఎండకడుతూ తమకు వ్యతిరేకంగా పనిచేసే ఏ వ్యక్తినీ ఏ సంస్థా భరించదని వీరికి తెలియదా? మీడియా అనేది ఒక వ్యాపార సంస్థే అని ఎప్పుడో నిర్నయించబడింది. దానికి ప్రత్యేక హోదా అవసరం లేదు. అటువంటప్పుడు ఈ నీతి సూత్రాలెందుకు? ఉద్యోగం కావాలంటే యాజమాన్యం చెప్పింది చేయాలి. అది మీడియా అయినా మరేదైనా ఒక్కటే. జీవితం అంటే ఏమిటో పూర్తిగా తెలియని దశలో ఒకరు తమ బ్లాగుల్లో రాసుకున్న రాతలను గొప్ప స్వేచ్చా భావాలు అంటూ అకాశానికెత్తి పొగిడితే జరిగే మేలు ఏమీ ఉండదు. ఆమెకు మరికొంత నష్టమే తప్ప. వీరు రాసే ప్రతీ రాతల్లోనూ జర్నలిస్టుల తప్పు ఏమి లేదనడం, దానికి బాధ్యత యాజమాన్యానిదో, లేక వారి కొమ్ము కాసే భజనపరులదో అనడం హాస్యాస్పదం. మీరంతా ఒకే తానులో గుడ్డలే అనడంలో ఎవ్వరికీ ఏమాత్రం సందేహం ఉండదు. మనం రాసే రాతలను జనం పూర్తిగా విశ్వశిస్తారు అనుకోవడం కూడా ఒక భ్రమే. అన్యాయం ఎక్కడ జరిగినా ఖండించాలి. దానికి వారు వీరు అనే తారతమ్యాలు ఉండకూడదు. వాళ్ళు జర్నలిస్టులైనా మరెవరైనా. స్వచ్చత అనేది మనుషుల్లో ఉండాలి, అది కేవలం వృత్తిలోనే వస్తుంది అనుకోవడం గొప్ప పొరబాటు. జనం దృష్టిలో మీడియా అంటే మీడియానే. యాజమాన్యం, భజనపరులు, స్వేచ్చాభావాలుగల జర్నలిస్టులు అంటూ ఉండరు. ఇలాటి వర్గాలు అన్ని సంస్థల్లోను ఉంటాయి. కాబట్టి తప్పును తప్పుగా చెప్పాలి, పక్కవారిపైనెట్టి నేను స్వచ్చమైనవాడిని అంటే జనం ఒక్కసారే నమ్ముతారు.

ఇక స్వామీజీల విషయానికి వస్తే ప్రజల నమ్మకాన్ని కొంతమంది స్వాములు సొమ్ము చేసుకుంటున్నారన్నది నిర్వివాదాంశం. కొంత ధర్మ ప్రచారం జరిగినా సంపాదనే వారి లక్ష్యం. వారి సాంపాదనలో రాజకీయ నాయకులు,మీడియా కూడా వాటాలు పొందుతారన్నది కొంత నిజం. నాకు తెలిసి ఒక పెద్ద స్వామిజీ తాను అవతారమెత్తిన కొత్తల్లో ప్రచారం కోసం, కవరేజీకి వెళ్ళిన జర్నలిస్టులకు బంగారపు గొలుసులు, ఉంగారాలు ఇచ్చేవాడని ఒక పెద్దాయన చెప్పేడు. నేను కలిసిన ఒక డబ్బున్న భక్తురాలు (ఆమె లెక్చరర్) తనకు నెల నెలా వచ్చే ఇంటి అద్దెల ఆదాయమంతా తన భర్తకు కూడా తెలియకుండా సదరు స్వామీజీకి పంపుతానని చెప్పారు.ఆదాయా మర్గాలు పెరిగేచోట మీడియా దృష్టి పెట్టడం సహజమే కదా. ఏంతైనా మీడియా స్వామీజీలకంటే పవర్‌ఫుల్ కదా!!



May 29, 2010

రెచ్చగొడితే రెచ్చిపోయి చచ్చిపోయే పిచ్చి జనం!


రాష్ట్ర ప్రజలు అన్నీ మరచి కొద్దిగా ప్రశాంతంగా జీవిస్తున్న తరుణంలో, టీవీ చానల్స్ కేవలం ఎండవేడి, వడగాడ్పుల విశేషాలు మాత్రమే ప్రసారం చేస్తున్నవేళ రాష్ట్రంలో మరో సంఘటన. కులాల కుంపటి నెత్తినపెట్టుకొని గ్రూపు రాజకీయాలతో ఒకరు, ఆ ప్రాంతంలో తమ ప్రాభవానికి గండిపడుతుందేమోనని మరొకరు పోటిపడి అసలే ఎండలతో మండుతున్న రాష్ట్రాన్ని మరింత వేడెక్కించడం సాధారణ ప్రజలను ఉక్కిరుబిక్కిరి చేస్తోంది. ఒకరిని ఒక ప్రాంతంలో తిరగొద్దని అనడానికి ఇది ఎవడబ్బా జాగీరు కాదు. భారత ప్రజలు దేశంలో ఎప్పుడైనా ఎక్కడైనా తిరగొచ్చు. పిచ్చి ప్రేలాపనలు చేసేవాళ్ళని కట్టడి చేసే శక్తి ప్రభుత్వానికి లేకుండా పోయింది.ప్రచారం అనేది లేకుండా ఏ రాజకీయ నాకుడు ప్రజలకి సాయం చెయ్యడని అందరికీ తెలిసిన విషయమే. తమ గ్రూపును బలోపేతం చేసుకోవాడానికి యాత్రలు చేస్తూ చనిపోయిన కుటుంబ సభ్యులకు కొంత సాయడం చేయడం రాజకీయ నాయకులకు ప్రచారం అయినా నష్టపోయిన కుటుంబానికి ఆ చిన్న మొత్తం పెన్నిధే అవుతుంది. ఆ విధంగా జగన్ యాత్ర ఆగిపోవడం చనిపోయిన కుటుంబ సభ్యులకు నష్టమే. యాత్రవల్ల అతడు బలపడి తద్వారా తెలంగాణా ఉద్యమం నీరుగారిపోతుందేమోనని సదరు కేసీఅర్‌కు ఇతర కాంగ్రెస్ నాయకులకు కూడా భయమే. ఆ భయమే పిచ్చి ప్రజలను రెచ్చగొట్టేలా చేసింది. జగన్ తెలంగాణాలో అడుగు పెడితే ప్రజలు ఊరుకోరు, తెలంగాణా అగ్నిగుండం అవుతుంది అంటూ నాయకులు పేలితే (కొంతమంది) ప్రజలు "అహ ఊరుకోకూడదుగాబోలు" అనుకుంటూ రోడ్డునపడ్డారు. వారికి తోడు కిరాయి కార్యకర్తలు సాగించిన విద్వంసం రాష్ట్రాన్ని మరోసారి ఉద్రేకంలోకి నెట్టింది. సాధారణ ప్రజలెవ్వరూ రైలు పట్టాలని పీకి జనాన్ని చంపుదామని అనుకోరు. దానికిసైతం తెగించారంటే దీని రాష్ట్రాన్ని అస్థిరపరచే రాజకీయ కుట్ర దీనివెనుక జరిగింది. రైలులో ప్రయాణిస్తున్న ఇద్దరు అమాయకుల శరీరాల్లోకి బుల్లెట్ట్లు దూసుకువెళ్ళాయి. మరి ఈ పాపం ఎవరిది? ప్రజాహక్కులను రక్షించలేని ప్రభుత్వానిదా లేక సొంత జాగీరులను ఏర్పాటు చేసుకుంటూ నా ప్రాంతానికి మరొకరు రావద్దని శాశించే మూర్ఖ నాయకులదా? లేక పదిరూపాయల ఖర్చుతో రూపాయి పంచిపెట్టీ ప్రజా సేవకులమని భ్రమించే నాయకులదా?

April 15, 2010

మీడియా చేసేది వ్యాపారమే...!!


ఈ మద్యకాలంలో చర్చలకు వేదిక కల్పించాల్సిన మీడియానే చర్చనీయాశమైంది. ముఖ్యంగా బ్లాగుల్లో మీడియా ముఖ్యవిషయమైంది. మీడియాపైన ఎక్కువమంది వ్యతిరేకతనే వ్యక్తం చేస్తున్నారు అన్నది సత్యం. వీరికీ వ్యతిరేకంగా ఏ ఒక్క నిర్నయం వచ్చినా పత్రికా స్వాతంత్ర్యం మంటగలిసిపోతోంది అని పెడబొబ్బలు పెట్టే వ్యక్తులు దానికి కారణాలు శొధించాల్సినప్పుడు ఆ బాధ్యతను యాజమాన్యంపై నెట్టివేస్తూ అందులో తమ బాధ్యత లేదంటూ కప్పదాటుధోరిణి ప్రదర్శించడం నిజంగా ఆశ్చర్యకరం. ప్రజా పక్షాన నిలబడవలసిన పత్రికలు లేద చానల్స్ ప్రభుత్వ పక్షమో లేక ప్రతిపక్షంవైపో ఉంటున్నాయన్నది జగమెరిగిన సత్యం. ఇలాటి సమయంలో పత్రికా విలువలు అంటూ అంటూ సూక్తులు చెప్పడం ప్రజల్ని వెర్రివాళ్లని చేయడమే. మీడియా అనేది ఒక సేవాసంస్థ కాదు అందులో పనిచేసేవాళ్ళు ప్రజా సేవకులు కాదు. మీడియాలో అన్నీ వ్యాపార సంస్థలే అనడంలో ఏమాత్రం సంశయం లేదు. ఇదికూడా ఒక రియల్ ఎస్టేట్ లాంటిదే. ఒక పత్రిక బలపరిచే పార్టీ అధికారంలో ఉంటే ఆ పత్రికకు మంచి బూం ఉంటుంది. ప్రభుత్వ ప్రకటనలలో సింహభాగం ఆ పత్రికకే వస్తాయి. అందులో పనిచేవాళ్ళంత కేవలం ఉద్యోగస్తులు. కేవలం ఉద్యోగస్తులు. తమ పత్రికకు చదువరులు ఎక్కువ ఉంటే ప్రకటనలు ఎక్కువ వస్తాయి. కాబట్టి అందులో పనిచేవాళ్లంత చదువరులను పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. దీనిలో సేవాతత్పరత, విలువలు అనేవి ప్రస్తుతం లేవు. ఇది కాదని ఏ ఒక్కరైనా చెప్పగలరా? మరి అటువంటప్పుడు జర్నలిస్టులంటూ వీరికి ప్రత్యేక హోదాగానీ ప్రత్యేక సదుపాయాలు గానీ ఎందుకు? మీడియా అనేది నిజానికి ఒక "వాచ్ డాగ్" (తెలుగులో చెపితే కొంతమంది బాధ పడతారెమోనని)లాగ పనిచేయాలి. మీడియా నిజంగా ఆపని చేస్తోందా? దానిలో ఎన్నో స్వలాభాలు ఉంటాయి. ఆ లాభాన్ని పంచుకోవడం జర్నలిస్టుతో మొదలై యాజమాన్యంతో ముగుస్తుంది. ఆ లాభాన్ని పొందుతున్నప్పుడు కష్టాన్ని కూడా భరించాలి. ఆ కష్టం నిజంగా ప్రజలకోసం పడితే ప్రజలు హర్షిస్తారు. ప్రజలు మీడియా వెంట ఉంటారు. కానీ జర్నలిస్టులంతా ప్రజలకోసం పనిచేస్తున్నారు, ప్రజలకోసం కష్టపడుతున్నారు అంటే నమ్మే స్థితిలో ప్రజలు లేరు. మీరు మాకు దూరంగా ఉంటేనే మేము ప్రశాంతంగా ఉంటాము అనేది ప్రస్తుత పరిస్తితి.
ఒక మిత్రుడు మద్యపానం చేసి రాత్రి బైక్‌మీద ఇంటికి వెడుతూ ఉంటే ఒక పోలీసు అతడిని అపేడు. నేను జర్నలిస్టును నన్ను ఆపడానికి నీకెంత దమ్ము అని ప్రస్నిస్తే తిక్కపుట్టిన పోలిసులు అతగాడిని స్టేషన్‌కు తీసుకుపోయారు. అతడు మరో సీనియన్ జర్నలిస్టుకు ఫోన్ చేసి విడిపించమని చెపితే నేను సర్కిల్ ఇన్స్పెక్టర్‌తొ మాట్లాడటమేమిటి? నాది ఎస్పీ లెవెల్..రేపు ఎస్పీతో మాట్లాడతాను అని చెప్పేడు. అది సంగతి!!

జర్నలిస్టులు వేరు పత్రికా యాజమాన్యం వేరు అంటూ జరుగుతున్న తతంగంలో మా బాధ్యత లేదు మేము నిమిత్త మాత్రులమంటే కూడా నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరు.

విలువలను పాటిస్తూ ప్రజాభిప్రాయాన్ని మన్నించే, ప్రజాహితం కోసం పాటుబడే నిజమైన జర్నలిస్టులు ఒక శాతమైనా ఉండిఉంటే వారికి నా వందనాలు.


April 1, 2010

మీడియా ట్రెండ్ మారుతోందా?


గత కొన్నిరోజులుగా హైదరాబాదులో జరుగుతున్న అల్లర్లకు ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే కొంతమంది ప్రజలు బాధను వ్యక్తం చేస్తున్నారు. చెప్పకపోయినా పండగ చేసుకొనేది మాత్రం మీడియానే. ఈ అల్లర్లలో కేవలం ఇద్దరే చనిపోయారు. పోలీసులకు పూర్తి స్వేచ్చ ఇవ్వడం వల్లనైతేనేమి ప్రభుత్వ కృతనిత్చ్యయం వల్లనైతెనేమి బాగానే అదుపులోకి తేసుకొచ్చారు. కానీ జరిగిన అల్లర్లు మీడియాకు తగినంత వార్తలను అందించలేకపోయింది. అందువల్ల జరుగుతున్న అల్లర్లలో మషలా సరిపోక ఎప్పుడెప్పుడో జరిగిన విషయాలు తవ్వి ఆ క్లిప్పింగులను ఇప్పుడు జరుగుతున్న సంఘటనలకు కలిపి బంపర్లు చేసి చూపిస్తున్నారు. ఇది ముమ్మాటికీ బాధ్యతా రాహిత్యమే. కాని వీటికి భిన్నంగా "జీ-24 గంటలు" స్పందించడం కొంత సంతోషకరం. "NO EXCLUSIVE, NO SENSATION" అంటూ మీడియా బాధ్యతను అందరికీ గుర్తు చేస్తోంది. సందులో సడేమియాలా దీనికి తెలంగాణా రంగు పులమడానికి అరాచకీయ నేతలు ప్రయత్నాలు నిజంగా సిగ్గుచేటు. కోదండరాం, గద్దర్ " ఇది సమైక్యవాదుల కుట్ర" అని ప్రకటించి వారి కుటిల రాజకీయాన్ని బయటపెట్టుకున్నారు. ఇలాటి సందర్భాలలో ప్రజలకు బాసటగా నిలబడి ధైర్యం చెప్పాల్సిన తరుణంలో ఇలాటి పేలాపనలు పరిస్తితులను మరింత దిగజారుస్తాయని తెలియని ఈయన ప్రజా గాయకుడెలా అయ్యాడో? ఏది ఏమైనా ఇలాటి సంఘటనలు జరిగినప్పుడు మీడియా ఎంతో సంయమనం పాటించాలి. దానిలో తొలి అడుగు జీ-24 గంటలుదైతే అది శుభ పరిణామమే.

February 19, 2010

మనిషివా....జర్నలిస్టువా..??


ఒక మనిషి రోడ్డుమీద ప్రమాదవశాత్తూ గానీ దాడికి గురైగానీ నెత్తురోడుతూ కనిపిస్తే మీరేమి చేస్తారు? అతన్ని సేదదీర్చడానికి సురక్షిత ప్రదేశానికి మార్చి వెంఠనే ఆంబులెన్స్‌కో లేక పోలీసులకో కబురంపుతారు. కానీ ఇవేమి చేయకుండా అతని బాధను ఏవిధంగా అనుభవిస్తున్నాడో తెలుసుకుంటూ అతను చెప్పలేని స్తితిలో ఉన్నాకూడా సహాయం చేయడం మానేసి అతన్ని ప్రశ్నలతో విసిగిస్తూ కారుతున్న రక్త ధారల్ని చిత్రీకరిస్తూ అతని ప్రాణాలు గాలిలో కలిసిపోయేవరకు వేచి చూసేవాడే జర్నలిస్టు. ఇలాటి సంఘటనలు మనం అనేక చానల్స్ లో చూసిఉన్నాము కూడా. ఇటీవలికాలంలో జర్నలిస్టులు ప్రజల అభిప్రాయాలు చెప్పవలసింది పోయి స్టూడియోలో కూర్చొని తమ సొంత పైత్యాన్ని ప్రజలపై రుద్దుతూ ఇదే ప్రజల అభిప్రాయం అనుకోమంటూ, అనామకుల నోటిముందు మైకులుంచి వారు వాగే అవాకులు చవాకులూ ప్రసారం చేస్తూ చంకలు గుద్దుకునేవాడే జర్నలిస్టు. ఒకప్పుడు జర్నలిస్టులపై దాడి అంటే ప్రజలు కూడా మహాపరాధం జరిగిపోయిందనే భావనలో ఉండేవారు. ప్రభుత్వం కూడా అలాటి సంఘటనలకు వెంఠనే స్పందించేది. కానీ ఇప్పుడు పరిస్తితులు మారిపోయాయి. మీడియా స్వేచ్చ పేరుతో ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని కూడా వ్యక్తిగతంగా ప్రజాభిప్రాయం పేరుతో దాడిచేయడం చాలా మామూలు విషయంగా మారిపోయింది.ఉస్మానియాలో పోలీసుల చర్యలను సమర్ధించకపోయినా దానికి కారణాలను ఏమాత్రం చూపకుండా పూర్తి బాధ్యతను పోలీసులపైకి నెట్టివేస్తే పోలిసులకు మండుకొచ్చి ఒక చాకిరేవు మీడియా ప్రతినిధులకు కూడా పెట్టారు. దానికి ప్రతిగా రేపటి బడ్జెట్ వార్తల ప్రసారాలను నిలిపివేసి తమ నిరసనను తెలియచేయాలని నిర్నయించారుట. ఒక్క విషయం చెప్పాలి!! వీళ్ళు చెప్పే వార్తలకోసం ఎవ్వరూ పడిగాపులుపడి ఎదురు చేడట్లేదు. ఇంకా చెప్పాలంటే వార్తా చానల్స్ లేని రోజుకోసమే ప్రజలు ఎదురు చూస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం వీరి డిమాండ్లు ఎవైనా ఉంటే తక్షణమే......స్పందించకుండా ఒక నెల రోజులు వేచి చూడాలని మనస్పూర్తిగా కోరుకుంటూ....!!

February 12, 2010

తెలంగాణా పులకేసి మళ్ళీ తెరపైకి...



ఈ మద్య లోకమంతా అప్రశాంతంగా, ఏదో కోల్పోయినట్టు, టీవీలన్నీ బోసిపోయినట్టు, విలేకరులంతా తెగులుపట్టిన కోళ్ళలా మెడలు వంగిపోయి, ముఖ్యంగా తెలుగు న్యూస్ చానల్స్ అన్నీ దివాళా తీసిన వ్యాపారుల్లా దీనంగా ఉండడం మీరు గమనించే ఉంటారు. కారణం మీకు తెలిసి ఉండదు! అదే మా తెలంగాణా పులకేసి అస్సలు పేపరోళ్ళవైపు, చానల్స్‌వైపు చూడడం మానివేయడంవల్లే. ఇదిగో నిన్నటినుండీ విలేకరులకు కాస్త ముద్ద గొంతు దిగుతోంది. ఎందుకంటే నిన్ననే మా తెలంగాణా పులకేసి మళ్ళీ టీవీలో కనిపించాడు. కనిపించడమేకాదు బోలెడు విషయాలు చెప్పాడు. వస్తూనే అతడన్నది ఆంధ్రోళ్ళు అంటే పెట్టుబడిదార్లు ఆంధ్రాలో చేసింది అస్సలు ఉద్యమమేకాదుట. ఉద్యమమంటే తెలంగాణాలో జరుగుతున్నదేట. ఇంకా శ్రీకృష్ణ కమీషన్‌పై అతడి అభిప్రాయలు కొన్ని చెప్పాడు. అసలు తెలంగాణా ఇవ్వాలా వద్దా అని రాష్ట్రంలో ఎవ్వరినీ అడక్కూడదట. ఆంధ్రోళ్ళనిగానీ, సీమోళ్ళనిగానీ, హైదరాబదీలనిగానీ. మరి ఎవరిని అడగాలి? పులకేసిని అడగొచ్చంట, ఇంకా వాళ్ళ అల్లుడిని అడగొచ్చుంట, ఇంకా పులకేసి కూతురునికూడా అడగొచ్చంట. తెలంగాణా ఇవ్వాలని తేల్చడానికి పదినెలలెందుకు అని తెలివిగా అడిగాడు. కేవలం పది సెకన్లు చాలుట. లేదంటే ఒక వారమో పదిరోజుల్లోనో సరిపెట్టుకోవాలిట. అసలు తెలంగాణా ఇవ్వడంకోసమే కమిటీ వెయ్యాలిగనీ ఇంకా అడిగేదేంటని అన్నాడు మా పులకేసి. ఇక తాము త్యాగాలు చేయక తప్పదని కూడా చెప్పాడు. అంటే ఆయన ఇంతకుముందు ప్రకటించినట్టు తల నరుక్కుంటాడేమోన్ని ఆశగా ఎదురు చూసేరు... అదేమికాదు. పదవులకు మరోసారి రాజీనామాలు చేసి, వాటిని నిజ్జంగా ఆమోదింపచేసుకుంటాడుట. అదీ సంగతి!! ఇకనుండీ మళ్ళీ కొన్ని రోజులు అందరికీ ముఖ్యంగా నక్సలైట్ చానల్స్‌కి, పోరంబోకు చానల్స్‌కి పండగే పండుగ. మనం కుడా చూసి సరదా పడదాం. ఏమంటారు?

February 2, 2010

మృగ్యమౌతున్న మానవ బంధాలు


చిన్నారి వైష్ణవి చనిపోయింది. కాదు చంపబడింది. అందుకు పురిగొల్పింది స్వయానా ఆ చిన్నారి మేనమామట. ఆ వార్త విని తట్టుకోలేక ఆమె తండ్రి ప్రభాకర్ చనిపోయాడు. ఇలాటి సంఘటనలు మనం ఇరవై నాలుగు ఘంటలు ప్రసారమయ్యే టీవీ సీరియళ్ళలో మాత్రమే చూసి ఉంటాము. సీరియళ్ళలో ఆడవిలన్లు కోపంగా రెండుకోట్లు ఖర్చైనా వాడి అంతు చూడాలి అనడం మనం చాలసార్లు చూసి ఉన్నాము. ఇవి అంతరిస్తున్న మానవ బంధాలు తెలియచేస్తాయి. పాత సినీమాల్లో అయితే భార్య గయ్యాళిదైతే త్యాగం చేసి ఉన్న ఆస్తిని వదులుకొనె హేరో ఊరొదిలి వెళ్ళిపోతాడు. చివరకి హీరో భార్య అతని మంచితనం తెలుసుకొని అతడిదగ్గిరకు చేరుకుంటుంది.లేదా వైస్-వెర్సా. కాని ఇప్పటి సీరియళ్ళు అలా కాదు. భార్య భర్తల మధ్య మనస్పర్ధలు వస్తే భర్త్యను చంపించడానికి రెండు బ్రీఫ్‌కేసులనిండా డబ్బును విలన్‌కీచ్చి భర్తను చంపమంటుంది. లేదా భర్తే భార్యను చంపించడానికి ప్లాన్లు వేస్తాడు. ఈ రెండూ కాకుండా తన పూర్వపు భార్య ఎదురుగా మరో స్త్రీతో కాపురం పెట్టడం. ఇది అవతలివారికి ఎంత కడుపుమంటను కలిగిస్తుందో హావభావాలతో సీరియళ్ళలోనే మనం చూసి ఉన్నాము. తన అక్కకు, అక్క పిల్లలకు జరిగిన అన్యాయానికి తమ్ముడు ఏ విధంగా మండిపడతాడో కూడా మనకు తెలుసు. మరి మనుషులని చూసి సీరియల్స్ తయారు చేస్తారో లేక సీరియల్స్ ను చూసి మనుషులు అలా తయారవుతారో? పెద్దలు చేసిన పాపాలు పిల్లలకు తగులుతాయని మన పూర్వీకులు ఉత్తినే అనలేదు. కానీ పిల్లలు చేసిన పాపమేమిటో? ఏమైనా ఇవి అంతరించి పోతున్న బంధాలకు ఒక తార్కాణం. ఇలాటి విషయాలలో పోలీసులు నిమిత్తమాత్రులే!!

డబ్బూ డబ్బూ నువ్వేమి చేస్తావూ అంటే... ఆప్తులమధ్య వైరాన్ని సృష్టిస్తానూ అందిట!!

February 1, 2010

వైష్ణవిని చంపేశారు దుర్మార్గులు!!


చినారి చిట్టితల్లి, టీవీలో చిత్రాలలో చిరునవ్వులు ఒలకబోస్తూ అమాయకమైన కళ్ళు గోళీల్లా తిప్పుకుంటూ పుట్టినరోజుగాబోలు జరుపుకున్న కన్నతల్లి, నిండా పదేళ్ళనా లేని పసిమొగ్గ దుర్మార్గుల కర్కశత్వానికి బలైపోయింది. కిడ్నేపైన ఆ చిన్నారి గుంటూరులో నిర్జీవంగా దొరికింది. ఆమె మృతదేహాన్ని కునుగొన్నారని టీవీలో చూసినప్పుడు కళ్ళు చెమ్మగిల్లాయి. దారికాచి కారు డ్రైవర్‌ను హత్యచేసినప్పుడే కిడ్నాపర్ల రాక్షసత్వం తెలిసింది. అటువంటి రాక్షసులను ఎంతో సున్నితంగా ఎదుర్కోవాలి. ఎందుకంటే చిన్నారి వారి చేతుల్లో ఉందికాబట్టి. ఆ చిన్నారి ప్రాణాలతో బైటకు వచ్చేదాకా ఓపికబట్టి తరువాత దోషులను దొరకబుచ్చుకోవాలి. మీడియా చేస్తున్నది మంచో చెడో తెలియని పరిస్తితి. మీడియా చూపిన అత్యుత్సాహంకూడా ఆమె ప్రాణాలమీదకు తెచ్చిందేమో అనిపిస్తోంది. ఆమె ఫొటోను చూపిస్తూ గంటలు లెక్కిస్తూ పోలిసులు చేస్తున్న గూఢచర్యాన్ని ఎప్పటికప్పుడు బట్టబయలు చేస్తూ ఆ సంఘటనను ఒక పెద్ద వివాదంగా మార్చకుండా ఉంటే ఆమె తండ్రివద్దనుండీ కొంత సొమ్ము దొరకబుచ్చుకొని ఆమెను వదిలేశేవారేమో? అప్పుడా చిన్నారి ప్రాణాలతో బైటపడి ఉండేదేమో. కానీ పోలీసుల చేతలు ఎప్పటికప్పుడు చెప్పివేస్తూ వారి ఆచూకీ దొరికే అవకాశం ఏర్పడిందన్న సందర్భములో తప్పించుకోవీలులేక దుర్మార్గులు ఆ చిన్నారిని చంపివేసి ఉంటారు. వారు క్షమార్హులు కారు. ముమ్మాటికి వారిని పట్టి ఉరికంబం ఎక్కించాలి. ఇప్పుడు మీడియావాళ్ళు ఆ చిన్నారి తల్లిదండ్రుల రోదనలు క్లోజప్‌లో బంధించడానికి ఆపసోపాలు పడుతూ ఉంటారు. మీడియాకు ఎప్పుడూ ఒక విషయం కావాలి. వైష్ణవి తల్లిదండ్రులకు మన సానుభూతిని తెలియచేయడంతప్ప మనమేమి చేయగలం?

January 25, 2010

తలలు బోడులైన తలపులు బోడులౌనా?


తెలంగాణా ఉద్యమంలో ఒకవ్యక్తి ముగ్గుబుట్టలంటి జుట్టుతో వేదికలను అలంకరిస్తూ ఉండేవారు. నెమ్మదిగా ఏకు మేకైనట్టు, తొండ ఊసరవెల్లిగా మారినట్లుగా ఆయన తన స్వరూపాన్ని మర్చుకుంటూ ఒక కరడుగట్టిన రాజకీయవేత్తగా మారుతూ కాకలు తీరిన రాజకీయవేత్తలనే హెచ్చరించే స్థాయికి చేరాడు. ఆయన మరెవ్వరో కాదు కోదండరాం. ప్రొఫెసర్ కోదండరాం. మేధావిగా తెలంగాణా ఉద్యమంలో అడుగుపెట్టి రాజకీయ జేఏసీలో కన్వీనర్ స్థానాన్ని ఆక్రమించిన ఈయన తాను ఒక ప్రభుత్వ ఉద్యోగి అని మరచిపోయి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజాప్రతినిధులను విమర్శిస్తూ వారిని రాజీనామాలను సమర్పించాలని డిమాండ్ చేయడమే కాకుండా ఈయన కోరే గొంతెమ్మ కోరికలు, వ్యాఖ్యానాలూ కూడా ఏ రాజకీయవేత్త చేయలేడు. గౌరవప్రదమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ తెలంగాణా విద్యార్దుల పరీక్షా పత్రాలు మార్కుల కొలమానానికి ఆంధ్రా ఉపాధ్యాయులకు పంపకూడదని వీరి మొదటి కోరిక. ఆవిధంగా పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిని అపవిత్రం చేయాలనుకున్న సదరు ఈ వ్యక్తి ఒక రాజకీయ జేఏసికి కన్వీనర్ ఎలా కాగలిగాడో? తెలంగాణా పౌరుడిగా ఆయన తన అభిప్రాయాన్ని చెప్పడంలో తప్పులేదుగానీ ఒక రాజకీయ కూటమికి కన్వీనర్‌గా ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉండడానికి వీలులేదు. పైగా అతడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మద్దతును కూడగడుతున్నదుకు ఆయనను సత్వరమే సస్పెండ్ చేసి ప్రభుత్వ వ్యతిరేక కుట్రలు పన్నుతున్నందుకు ఆయనను ప్రాసిక్యూట్ చేయాలి. ఈయననే కాదు, ప్రభుత్వ జీత భత్యాలు తీసుకుంటూ ఉద్యమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరినీ సస్పెండ్ చేయాలి. గత కొంతకాలం క్రితం తమిళనాడులో జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకే రాజపత్రంతో రెండు లక్షలమంది ప్రభుత్వ ఉద్యోగులను సస్పెండ్ చేసిన సంఘటనను న్యాయస్థానం కూడా సమర్ధించింది. ప్రభుత్వం చూపుతున్న ఈ ఉదాసీనతను చేతగానితనంగా భావిస్తున్న అందరినీ ఒక దారికి తీసుకురావలసిన భాద్యత ప్రభుత్వానిదే.


January 20, 2010

ఎవరికోసం ఈ త్యాగాలు?




వరంగల్ జిల్లాలో రెండేళ్ళ పిల్లవాడు బోరుబావిలో పడి ప్రాణలకోసం కొట్టుమిట్టాడుతున్నప్పుడు ఆంధ్రదేశమంతా ప్రార్ధనలు చేసింది, ఆ బిడ్డ ప్రాణాలు కాపాడమని. ఆ బిడ్డ ప్రాణాలు పోయాయని తెలిసినప్పుడు అందరూ ఒక్కలా కన్నిరుమున్నీరై విలపించారు. అది మానవత్వం. కానీ రాష్ట్రాన్ని విభజించండీ అంటూ తనకుమాలిన కోరికలతో ఆత్మత్యాగాలు పేరిట ప్రాణాలు తీసుకుంటున్న యువకులపట్ల అందరూ అలా స్పందిస్తున్నారా? కొంతమందైతే కావచ్చుగానీ ఖచ్చితంగా అందరూ కాదు. వారి ప్రాణాలు కోల్పోయినందుకు బాధపడ్డా ప్రజలు శాపనార్ధాలు పెట్టేది మాత్రం దిక్కుమాలిన రాజకీయనాయకులనే. ఇరవై ఏళ్ళ వయసులొ సమైక్య ఆంధ్రలో వ్యక్తిగతంగా వీళ్ళు పడ్డ కష్టమేమిటో, ప్రత్యేక రాష్ట్రంలో వీరు అనుభవించబోయే భోగ భాగ్యాలేమిటో వీరికి తెలుసా? నువ్వు నష్టపోయావు అంటే కాబోలు అనుకునే ప్రజలున్నంత వరకూ ఈ మృత్యుహేల కొనసాగుతూనే ఉంటుంది. చనిపోయినవాడు చేసినది పిచ్చి పని అని అందరూ ముక్త కంఠంతో ఖండించాల్సింది పోయి, నీది మహోన్నత త్యాగం, నువ్వు అమరుడవు, నీ త్యాగాన్ని తెలంగాణా ప్రజలు మరచిపోలేరు అంటూ మరింతమందిని ఆత్మహత్యలకు పురిగొల్పే వీళ్ళు నాయకులా? వీళ్ళు ఉద్యమకారులా? రాజకీయ జేఏసీలో ఎవరైనా ఒక్కరు ఆత్మాహుతి చేసుకొని తమ అమరత్వాన్ని చాటుకోవచ్చుగా. వాళ్ళ పదవులు వదులుకోవడానికే మల్లగుల్లాలు పడే వీళ్ళు ప్రాణాలు పణంగా పెడతారా?

తెలంగాణా ఉద్యమంలో ఎన్నో దృక్కోణాలు. ఎవరి స్వార్ధం వారిది. ఉద్యమాన్ని అడ్డుపెట్టుకొనె కోట్లకు పడగలెత్తినవాళ్ళూ లేకపోలేదు. ఓయూ విద్యార్దుల జేఏసీకి అక్షరాలా మూడు కోట్ల రూపాయలు అందాయని సమాచారం. వాటి పంపకంలో విద్యార్ధుల మధ్య ఎన్నో లుకలుకలు నడుస్తున్నాయన్నది మీడియాలో ప్రస్తుత కధనం. కానీ ఎవరికీ బైటపెట్టే దమ్ములేదు. ఇవేమీ తెలియని అమాయక విద్యార్ధులు తమవంతు త్యాగాలను చేస్తునే ఉన్నారు. ఇంతవరకూ పదండి ముందుకు అంటూ జనాన్ని ఎగదోసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి పదవులకు రాజీనామా అనేసరికి, ప్రభుత్వం పడిపొతే (తనకు) తెలంగాణాకు నష్టం అంటూ మరో పల్లవి అందుకున్నారు.

ఏదిఏమైనా అన్నీ సద్దుమణగాలంటే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలి. రెచ్చగొట్టే నాయకులను నోరు మూయించి లోపల వెయ్యాలి. ముఖ్యంగా న్యూస్ చానల్స్‌ను కూడా కొంతకాలం ప్రసారాలు నిలుపు చేయించాలి. ప్రశాంత వాతావరణం ఏర్పడ్డాక ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి సరియైన నిర్నయం తీసుకోవాలి. బహుశా జరుగబోయేది అదే కావచ్చు!!

January 18, 2010

రంపపు కోతలాంటి రాతలెందుకో?




బ్లాగుల్లో కొన్ని టపాలు చదువుతూ ఉంటే చిన్న చిరునవ్వు అలా మెరిసి చటుక్కున మాయమౌతుంది. అలా అనిపిస్తే ఆ టపాకు ఒక సార్ధకత చేకూరినట్టే. టపా బాగున్నప్పుడు కామెంటడానికి బాగుంది అని చెప్పడం రోటీన్ అనిపించినప్పుడు నేనైతే చిన్న చిరునవ్వు :) వదిలిపెడతాను. నేను చదివాను మీ టపా నాకు నచ్చింది అని చెప్పడానికి. కానీ కొన్ని బ్లాగరుల రూటే వేరు. వారు ఏది చేసినా ఒక సంచలనం కోరుకుంటారు. అది వ్యతిరేకతతో కూడినదైనా సరే. వారి రాతలలో ఎన్నో నికృష్ట భావాలు కనబడుతూ ఉంటాయి. మనుషులలో నిబద్దత వీరికి నచ్చదు, సమాజమంటే ఏవగింపు, మనుషులపై అకారణ ద్వేషం వీరి రాతల్లో కనబడతాయి. సమాజంలో ఒక్క మంచి సంఘటన కూడా వీరి కంటికి కనబడదు. పదిమంది మెచ్చినది వీరు మెచ్చరు. పదిమంది చీ అంటే వీరు అద్భుతం అంటారు. అదేమి మిత్రమా అని అడిగితే కొన్ని పడికట్టుపదాలతో వీరు అర్ధం కాని భావాలెన్నొ చెప్పగలరు. పైగా ఇది నా బ్లాగు, నా ఇష్టం అంటారు. మరింత ముదిరితే మిమ్మలని నా భావాలతో ఏకీభవించమని నేను అడగలేదు, అసలు నా బ్లాగు చూడమని కూడా చెప్పలేదు అంటారు. కొన్ని టపాలు చదివినప్పుడు కొందరికి కలిగే భావాలు ఎలా ఉంటాయొ చిన్న ఉదాహరణ ఇస్తున్నాను.

"అయితే మీ శ్రేయోభిలాషిగా మీకోమాట చెబుదామనుకుంటున్నాను. లౌకికవాది అనే ముసుగు వేసుకున్నాను గదా నేనేంటో అసలెవరికీ తెలియదులే అని మీరు ఇంకా అనుకుంటూనే ఉన్నారు గదా! కాని అది తప్పు సార్.. ఆ ముసుగు చాలా పల్చగా ఉంది. ముసుగులోంచి మీ వంటిమీది చారలు స్పష్టంగా కనబడిపోతున్నాయి. క్రూరమైన కోరలు (కరాళ దంష్ట్రలవి :) ) నోట్లోంచి కారుతున్న చొంగా కనిపిస్తూనే ఉన్నాయి. అసహనం కారణంగా మీ గొంతులోంచి వచ్చే గురక వినిపిస్తూనే ఉంది. ఇక దాచలేరు సార్, ఆ ముసుగు తీసెయ్యండి. అసలు రూపును బయటపెట్టండి"

మనం రాసిన రాతలకు అవతలివారికి ఎంత ఒళ్ళు మండితే ఇలాటి కామెంట్లు వస్తాయి చెప్పండి. మన టపా చదివిన అందరికీ నచ్చాలని లేదు కానీ, చాలా మంది అసహనాన్ని వెళ్ళగక్కితే దానిలో కొంత లోపమున్నట్టే. మీరేమంటారో?

January 15, 2010

యార్లగడ్డ "ద్రౌపది" నవలపై బ్లాగుల్లో రాతలు....కామెంట్లు ....


హిందూ సంస్కృతి పరిరక్షణకు నేనేమి నడుము కట్టుకోలేదు. కానీ కొందరు హిందూ సాంప్రదాయాలపై దాడి అంటే మాత్రం ముందు వరుసలో నిలుస్తారు. అలాటివారిలో మన బ్లాగరు కత్తి మహేష్ కుమార్ గారు ఒకరు . యార్లగడ్డ రాసిన పుస్తకాన్ని వీరు చదువలేదు. అయినా ఆపుస్తకంపై ఒక టపా రాస్తూ ఆపుస్తకాన్ని విమర్శించిన వ్యక్తులపై వీరు విమర్శల వర్షం కురిపించారు. ఎందుకంటే ఆ పుస్తకంలో విమర్శకుల విమర్శలప్రకారం హిందూ సాంప్రదాయలపై దాడి జరిగిందికాబట్టి అది ఎలాటిదాడో తెలియకపోయినా అది వీరికి ఇష్టంకాబట్టి ఆ దాడిని వీరు సమర్ధిస్తారు. మహాభారతం యదార్ధమో కాదోనన్న విషయం పక్కనబెడితే ఆ కధలో ద్రౌపదికి ఐదుగు భర్తలున్న స్త్రీ అయినా ఒక ఉత్తమ స్త్రీగా చిత్రికరిస్తూ స్త్రీయెడల ఉన్నత భావాలు కలిగించారు. అయిదుగు భర్తలు గలిగిన స్త్రీ అంటే మిగిలిన విషయాలు విడమరచి చెప్పవలసిన అగత్యం లేదు. కానీ సోమవారం ఒకరితో సుఖించినది, మంగళవారం ఒకరితో సుఖించినది బుధవారమం మరొకరితో సుఖించినది అని చెప్పడంలోనే రచయిత ఉద్దేశ్యం బయట పడుతుంది. కొంతమందికి కొన్ని సమయాలలో కీర్తికోసం వెంపర్లాట మొదలౌతుంది. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారు పండితులు వారికి అన్ని గ్రంధాలు కరతలామలకం. కానీ ఎంతటివారైనా కొన్ని క్షణాలలో కీర్తి ప్రతిష్టలు కోరుకొవడం మానవ లక్షణం. కానీ ఆ పుస్తకం చదవకపోయినా మహేష్ గారి అత్యుత్సాహం కూడా ఇలాటిదే. ఆ పుస్తకాన్ని నేను చదవలేదు. తెలుగు సాహిత్యానికి గుర్తింపు రాలేదేనని మహేష్ బాధ పడుతున్నారుట. పురాణా ఇతిహాసాలని అపహాస్యం చేస్తూ కీర్తిని గడించాలని కోరుకోవడం సరియైనదేనా? ఆ బ్లాగులో వచ్చిన కామెంట్లు కూడా ఆశ్చర్యం కలిగించాయి. ద్రౌపదికి అయిదుగురు భర్తలను ఎలా కట్టబెట్టారు అని రచయిత అడిగిఉంటే బాగుండేదిగానీ అయిదుగురితో ఎలా సుఖించినదో తెలియచేయడంలోని ఔచిత్యం ఏమిటో మహేష్ రచయిత తరపున తెలియచేస్తారా?


ఏది సంస్కృతో చెప్పి మాకళ్ళు తెరిపించండి !!


బ్లాగుల్లో సంక్రాంతి సంబరాలగురించి కొంతమంది చక్కగా చెప్పారు. పదిమందీ కలిసి చేసుకొనే పండుగల్లో సంక్రాంతి ఒకటి. రైతులకు పంట చేతికొచ్చాక ఇంటిల్లిపాదీ ఆనందంగా గడుపుకొనే సంతోషకరమైన రోజులు. వాటిని మరింత శోభాయమానంగా చేసుకోవడానికి ఇంటికి కొత్త సున్నాలు, ఇంటిముందు ముగ్గులు, గొబ్బెమ్మలు, భొగి మంటలు ఒక అదనపు ఆకర్షణలు. రైతులు అహ్లాదకరంగా గడపడానికి కోళ్ళ పందేలు. ఆంధ్ర దేశంలో ఎంతోమంది ఎన్నో దశాబ్దాలుగా చేసుకుంటున్న పండుగ. ఇదా సంస్కృతి అంటూ కొంతమంది వెక్కిరించడానికి నాకేమి కారణాలు కనబడడటం లేదు. సంస్కృతి అంటే ఏమిటో? అందరూ ఒక విధానాన్ని సంవత్సరాలుగా చేస్తూపొతే తరువాతి కాలంలో అదే సంస్కృతి అవుతుందని నా మట్టి బుర్రకు తోచింది. మరి ఇంతకుమించి సంస్కృతి అంటే ఏమొటో వెక్కిరించేవాళ్ళు చెపితే మా కళ్ళు తెరుచుకుంటాయి. హిందూ సంస్కృతి అంటే కొంతమందికి చులకన బావన ఎందుకో అర్ధం కాదు. ఆ వెక్కింతను సహేతుకంగా వివరిస్తే కొంత తెలుసుకొనే ప్రయత్నమైనా చేస్తాము. ముగ్గులూ, గొబ్బెమ్మలూ,భోగిమంటలూ, గంగిరెద్దులూ సంస్కృతా అంటే? అది కాకపోవచ్చు అనిపిస్తే మరేదో చెప్పాలి. కేవలం ఒక ప్రశ్నను వేసి గేలి చేయడం సరికాదేమో! ముఖ్యంగా ఇటువంటి టపాలు ఆకతాయీలు రాస్తే అస్సలు పట్టించుకోనక్కర్లేదు. కానీ అన్నీ తెలిసినవాళ్ళే ఆకతాయీల్లా రాస్తున్నప్పుడు స్పందించక తప్పదు. వారి రాతలను మరింత సహేతుకంగా రాయాలిగానీ, కేవలం ఇదా సంస్కృతి అని ప్రశ్నించి వదిలివేయడం మంచిది కాదు.

January 13, 2010

కేసీఅర్ మౌనానికి కారణం?


కేసీఅర్ పేపర్‌లోగానీ చానల్స్‌లో గానీ మాట్లాడి పదిరోజులు కావస్తోంది. ఆయన మాండలికాలు, హెచ్చరికలు లేక పత్రికలు బోసిపోతున్నాయి. విలేకరులు నీరసపడిపోతున్నారు. ఆయన కనీసం కేమేరాలవంకైనా చూడటంలేదు. విలేకరులతో పెదవి విప్పి మాటైనా మాట్లాడటం లేదు. ఈ మౌనానికి కారణం ఏమిటో మరి? ఢిల్లీలో పార్టీల మీటింగు అయినతరువాత వ్యూహాత్మక మౌనం అని పేపర్లు అన్నాయి. కేంద్రం తన నిర్నయాన్ని ప్రకటించిన తరువాత ప్రతిస్పందిస్తామని టీఅరెస్ ప్రకటించింది. కేంద్రం కేవలం శాంతి మంత్రం తప్ప మరో మాట లేదు. తెలంగాణా జేఏసీ మీటింగు కూడా పెట్టుకుంది. అది అయినతరువాత కూడా కేసీఅర్ మాట లేదు. మరోపక్క తెలంగాణా జేఏసీ మరోమారు ఉద్యమానికి సంసిద్ధమౌతోంది. ఇన్ని జరుగుతున్నా కేసీఅర్ ప్రేక్షకుడిగానే ఉన్నారుగానీ పెదవి విప్పలేదు.

ఇది ఇలా ఉండగా మీడియాలో అనధికార వార్తల ప్రకారం గృహమంత్రి చిదంబరంగారు రాష్ట్రంలోని కొంతమంది నాయకుల సంపాదనలపైనా వారి బినామీ లావదేవీలపైనా ఒక నివేదికని సిద్ధం చేయించారని వినికిడి. దానిపై జాతీయ రక్షణ చట్టంకింద కేంద్రం తగు చర్యలు తీసుకునే అవకాశాలను తోసిపుచ్చలేమని ఈ సందర్భంలో చెప్పారట. మరి ఢిల్లీలో పార్టీల సమావేశం అయినతరువాత అందరూ శాంతి మంత్రం జపించిడంవెనుక మర్మం ఇదేనా? మరి ఇది కాకపొతే ఆ చిదంబర రహస్యమేమిటో?

గమనిక: ఈ వార్తని పట్టుకొని ఏదైనా చానల్ మరో చర్చా కార్యక్రమం చేపడితే జరిగే పరిణామాలకు ఈ బ్లాగు బాధ్యత వహించదని చానల్స్‌కు తెలియచేస్తున్నాము. :)

January 9, 2010

ఏ'కాకిలా టీవీ-5'చానల్



మనం అనుకున్నట్టుగానే టీవీ-5 లో అరెస్టులను పత్రికా స్వేచ్చపై దాడి అని, కలానికి సంకెళ్ళు అంటూ కొందరు ఆక్రోసిస్తున్నారు. కానీ ఇక్కడ దాడి చేసింది టీవీ-5 నా లేక ప్రభుత్వమా? ఉల్టా చోర్ కొత్వాల్‌కొ మారా" అన్నట్టుగా పోలీసులు టీవీ-5 పై దాడిచేయడంగా వర్నించడం వారి గడుచుదనానికి పరాకాష్ట. ప్రజలని (ప్రస్తుతం జర్నలిస్టులని)రెచ్చగొట్టడం లో చానల్స్ చాలా నేర్పును గడించాయి. మరి మీ తదుపరి కార్యక్రమం ఏమిటి అంటూ ప్రతీ వాళ్ళని శాయ శక్తులా రోడ్డుమీదకి లాగ చూస్తున్నారు. జర్నలిస్టులకు ప్రభుత్వం గానీ నాయకులు గానీ ఎప్పుడూ పెద్దపీట వేస్తారు. కానీ గత కొంతకాలంగా వారి మితిమీరిన చేష్టలు ప్రతీవారిని విసిగించాయి. దీనికి ఉదాహరణ రోశయ్య గారిని జర్నలిస్టులు రాత్రి కలవడానికి వెడితే ఉదయం ఆఫీసులో వచ్చి కలవండి అని చెప్పారుట. జర్నిస్టులనుండీ వచ్చే కోరికలని సాధ్యమైనంత వరకూ తీర్చడం ఏలినవార్లకు పరిపాటే అయినా వారిని కలవడానికిగానీ వారికి సంఘీభావాన్ని గానీ తెలిపే నాయకులే కరువయ్యారు. మేధావుల ప్రజల మద్దతును కూడా వారు కోల్పోయారు. ఈనాడు ఏకాకాకిగా మిగలడానికి కారణం వారి స్వయంకృతమే. కానీ కార్యక్రమ నిర్వాహకులతోబాటు యాజమాన్యాన్ని కూడా దీనికి బాధ్యుల్ని చేయాలి. వారికి కూడా ఈ పాపంలో భాగం ఉంది. టీవీ-5 లో జరిగే చర్చాకార్యక్రమంలో ఎవరో తెలియని మేధావులు పాల్గొంటున్నారు. ఒక మేధావి రష్యా నుండీ వెలువడే వెబ్‌సైట్‌లో రిలయన్స్ అధినేత పేరు ఉందిగాబట్టి సుమోటాగా తీసుకొని వారిపై కేసుపెట్టాలి్‌గానీ టీవీ-5 పై కేసుపెట్టడం అన్యాయం అంటూ చెప్పుకొచ్చాడు. ఇలాంటి భజనపరులను చేర్చుకొని మద్దతును కూడగట్టుకోవడం కన్నా చేసిన తప్పును ఒప్పుకొని ఇలాటి పొరపాట్లు చేయమని ఒప్పుకొని బైటపడితే వారికి మంచిది. ఇంత గొడవ జరుగుతున్నా మిగిలిన న్యూస్ చానల్స్ చక్కగా పాటలు, వంటలు ప్రసారం చేసుకుంటున్నాయి.టీవీ-5 కూడా వారి వాణిజ్య ప్రకటనలు యదాతధంగా ప్రసారం చేసుకొంటోంది. అంతా మీడియా మయం. ఉష్!!


January 8, 2010

చానల్స్‌పై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం


ప్రభుత్వం చానల్స్ యొక్క విశృంఖలత్వం మీద బాణం ఎక్కుపెట్టింది. టీవీ-5 ఎగ్జిగ్యుటివ్ ఎడిటర్ బ్రమ్మానంద రెడ్డి, ఇన్‌పుట్ ఎడిటర్ వెంకట కృష్ణలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టుల పర్వం సాగుతున్నప్పుడు సిబ్బంది అడ్డుకున్నా పోలీసులు వారిని తీసుకెళ్ళారు. అరెస్టులు జరుగబోతున్నాయని వారికి ఉదయమే తెలుసు. వారికి దన్నుగా జర్నలిస్టుల సంఘాలు తమ సంఘీభావాన్ని తెలుపుతూనే ఉన్నాయి. తమ బాధ లోక బాధగా జర్నలిస్టుల ఆక్రోశాలు మొదలౌతాయి. వారి అరెస్టులు పత్రికా స్వేచ్చపై దాడిగా అభివర్ణించడం, పత్రికల నోరు ప్రభుతం నొక్కేస్తోందని వాపోవడం, కలానికి సంకెళ్ళు, ఫోర్త్ ఎస్టేట్ కూల్చివేత అంటూ రేపు పేపర్లో రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. వారి చివరి బెదిరింపు ప్రభుత్వ కార్యక్రమాల కవరేజ్ బహిష్కరణ. మంత్రులు, ముఖ్యమంత్రులు నిర్వహించే కార్యక్రమాలను బహిష్కరిస్తూ వారి నిరసన తెలియచేయవచ్చు. వారిపై వ్యక్తిగత దాడులను హర్షించకపోయినా వారి విశృంఖల ప్రసారాలను ప్రజలు భరించే స్థితిలో లేరన్నది నిజం. స్వీయ నియంత్రణతో ప్రజామోదమైన కార్యక్రమాలు చేయాలని ముక్త కంఠంతో ప్రజలంతా కోరుకుంటున్నారని ఇప్పటికైనా వారు తెలుసుకుంటే అందరికీ మంచిది.

ఇది జర్నలిజమా?..వీళ్ళు జర్నలిస్టులా?...సిగ్గు సిగ్గు..!!


రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయాలని న్యూస్ చానల్స్ కంకణం కట్టుకున్నాయా? అవుననే అనిపిస్తోంది. నిన్నటివరకు తెలంగాణా విషయంలో అగ్గి రాజేసి న్యూస్ కాచుకున్న చానల్ ఇప్పుడు ప్రజలపై మరోలా విరుచుకుపడింది. ప్రజా నాయకుడు వైయెస్సార్ హత్య చేయబడ్డారంటూ ఒక కధనాన్ని ప్రజల్లోకి వదిలింది. పధకాన్ని పన్నింది రిలయన్స్ అధినేతా అంటూ ఒక ప్రశ్నతో కూడిన సమాధాన్ని వదిలింది. దాని పరిణామం రిలయన్స్ ఆస్థులపై దాడులు, లక్షలలో ఆస్థి నష్టం. ఎక్కడో పనికిమాలిన రాతలను పట్టుకొని ఇటువంటి కధనాలు అల్లడం, అది నిజమా అంటూ ప్రజలను ప్రశ్నించడం, ఇది జర్నలిజమా? వీళ్ళు జర్నలిస్టులా? ఒకప్పుడు డిటెక్టివ్ సాహిత్యమనేది ఉండేది. అలాగే బూతు సాహిత్యం కూడా. వీటిని చదివేవాళ్ళని అందరూ అసహ్యయించుకునేవాళ్ళు. ఇవి కిళ్ళీ బడ్డీలలో ఎవ్వరికీ కనిపించకుండా కేవలం ప్రత్యేకంగా అడిగినవారికే ఇచ్చేవారు. ఆ రాతలు రాసే రచయితలందరూ ఈరోజు జర్నలిస్టులు అయ్యారేమో అనిపిస్తోంది. కేవలం టీఆర్పీ రేటింగులకోసం వీరు ఎంత గడ్డికరవడానికైనా తెగిస్తారని తెలుస్తోంది. ఒక చానల్ గవర్నర్ కధనాన్ని ప్రసారం చేసి ముందువరుసలోకి వచ్చేసిందెమోనని తాము కూడా ఒక సెన్సేషన్ సృష్టించాలని కంకణం కట్టుకొని చేసే పనులు. వీటి ప్రభావం ప్రజలపైన ఎలా ఉంటుంది అనే ఇంగిత జ్గ్నానం కూడా లేకుండా తదుపరి పరిణామాలు ఊహించకుండా, భాద్యతా రహితంగా చానల్స్ ఎలా ప్రవర్తిస్తున్నాయో ఇది ఒక ఉదాహరణ. పైగా వీరి నింద దేశ ఆర్ధిక వ్యవస్థలో పునాదిలాంటి వ్యక్తి. వేలకోట్ల పెట్టుబడులతో లక్షలమందికి జీవనోపాధి కల్పిస్తున్న సంస్థలకు అధిపతి. అటువటి సంస్థలు ఒక్కసారి మూతబడితే వారిపై ఆధారపడ్డవారి సంగతి? అలాటి కధనం నిజమైనా కూడా ఎంత భాద్యతతో మెలగాలి? పైగా వైయెస్సర్ బంధువులను ఫోన్‌లో పిలిచి ఈ విష్యంపై మీరేమి చేబోతున్నరని రెచ్చగొట్టే ప్రశ్నలు. వీరు చెప్పిన కధనం నిజమో కాదో వీరికే తెలియదు, కాని వీరి కధనంపై ప్రజలు వెంఠనే ఏదొవిధంగా ప్రతిస్పందించాలి. అది చూసి వీళ్ళు సంతోషపడాలి. రిలయన్స్ అధినేతలు, రాష్ట్ర ప్రభుత్వం కూడా వీరిపై కేసులు పెట్టబోతున్నాయి. కేసులు పెట్టాలి. వీరిని కోర్టులో నిలబెట్టాలి. గాలి వార్తలు, నీలి వార్తలు ప్రసారం చేసేవాళ్ళకి బుద్ధి వచ్చేలా శిక్షించాలి.

January 6, 2010

జే.పీ పిచ్చ పిచ్చగా నచ్చేశాడు....!!


మొత్తం మీద అనుకున్నట్టుగానే అయింది. ఏదొ జరిగిపోతుందని పేపరోళ్ళు, చానల్స్ జనాన్ని ఎంతో సస్పెన్స్‌లో ఉంచి టీఆర్పీ రేటింగ్ పెంచుకున్నాయి. ఏనుగు పిత్తితే ప్రళయం వచ్చేస్తుందని పారిపోబోతే తుస్సుమన్నదట. అలాగుంది ఢిల్లీ మీటింగ్. మీటింగులో నిర్నయించినది మళ్ళీ మళ్ళీ కలవాలని. అదీ సంగతి. తెలంగాణా ప్రస్తావనే లేకుండా టీచర్ పిల్లలని అడిగినట్టు అడిగి వారు చెప్పింది విని సరే వెళ్ళండి అన్నారు. కానీ చిదంబరం ఏమి మంత్రం వేశారోగానీ రాష్ట్రంలో మాత్రం సత్వరమే శాంతి నెలకొనాలని అందరిచేతా ఒక ప్రఖటన చేయించారు. మీటింగ్ అయినతరువాత సదరు నాయకులు చెప్పిన విషయాలు నలుగురు గుడ్డివాళ్ళు ఏనుగును గురించి వర్నించినట్లు పొంతన లేకుండా చెప్పారు. చిరంజీవి మంచి వాతావరణంలో మీటింగ్ జరిగిందని చెపితే, కాంగ్రెస్ నాయకులు (సమైక్య ఆంధ్రా) పెదవి విరవగా టీఆరెస్ నాయకులు ఇది మొదటి అడుగు అంటూ చెప్పుకొచ్చారు. కానీ మీటింగ్ అయ్యాకా ప్రణబ్ చెప్పిన మాటల "తెలంగాణా ఏర్పాటు అంత సులువు కాదు, అది ఇప్పటికిప్పుడు తేలే విషయం కాదు, కేసీఅర్ ఆరోగ్య రీత్యా అప్పటి పరిస్తితుల్లో ఆ ప్రకటన చేయవలసి వచ్చింది" అని. మొత్తం మీద తెలంగాణా విషయం కొంతకాలం అటకెక్కినట్టే. ఆ విషయం చెప్పడానికి కొన్ని చానల్స్‌కి గానీ టీఆరెస్‌కి గానీ మొఖం చెల్లలేదు. కేసీఅర్ కనీసం కెమేరాలవంక కూడా చూడకుండా వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆయన ఏ ప్రకటన చేయాలా అని ఆలోచిస్తూ ఉండిఉండవచ్చు.

తెలంగాణా విషయంలో మొదటినుండీ ఎటువంటి తడబాటూ లేకుండా విశాల భావాలతో ఒక సైనికుడిలా తనవంతు కృషిని అవిరాళంగా చేసిన ఒకే ఒక్కడు జయప్రకాష్ నారాయణ్. నిజమైన సైనికుడిలా ఒకే ఒక్కడు ఢిల్లీ పెద్దలను కలిసి వారికి వాస్తవాలను వివరించి ఒక అవగాహనను కల్పించారు. సీమాంధ్ర నాయకులు ప్రజల వాణికి ఒక అదనపు ఆయుధంగా మరేరు. మొత్తం మీద సామరస్య వాతావరణానికి అనువైన పరిస్తితి కొద్దిగా కనిపిస్తోంది. దీనికి కారణం ఎంఐఎం రాష్ట్రపతి పాలన విధించాలని కోరడం. రాష్ట్రపతి పాలన విధిస్తే ప్రస్తుతానికి ఉన్న కొద్దిపాటి ఆశ కూడా టీఅరెస్‌కి ఉండదు. అందువల్లే ఈ మౌన ముద్ర.

జేపీ చైప్పిన మరో బంగారు మాట "ఒక పదిహేను రోజులు ఈ చాన్నళ్ళను మూసివెస్తే బాగుండు" ననిపిస్తోంది. ఆ క్షణం కోసమే ప్రజలంతా ఎదురుచూస్తున్నారు.

January 4, 2010

ప్రస్తుతానికి ప్రత్యేక తెలంగాణా హుళక్కే!!


రాష్ట్ర రాజకీయాల వేదిక హైదరాబాదునుండీ ఢిల్లీకి మారింది. ఇటు తెలంగాణా నాయకులు అటు సీమాంధ్రా నాయకులు వివిధ పక్షాలతో సంప్రదింపులు జరుపుతూ ఢిల్లీ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నారు. ప్రత్యేక తెలంగాణా గొంతుకలు సన్నబడుతూ ఉంటే సమైక్యవాదం బలం పుంజుకుంటూ ఉంది. మరోవైపు రాష్ట్రంలో ఇటు తెలంగాణా ఉద్యమకారులు అటు సీమాంధ్ర ఉద్యమకారులు బందులకు రైల్ రోకోలకు పిలుపునిచ్చారు. దక్షిణ మద్య రైల్వే చాల రైళ్ళను నిలుపు చేస్తోంది. ఆర్టీసీ తమ బస్సులకు పూర్తి విశ్రాంతినివ్వడానికి నిర్నయించింది. లేని ఉత్కంఠతను పెంచే ప్రయత్నం చానల్స్ చేస్తూనే ఉన్నాయి. చర్చలతో ఏకాభి ప్రాయాన్ని సాధించాలని భావిస్తున్న కాంగ్రెస్‌లోనే ఏకాభిప్రాయం మృగ్యంగా తోస్తోంది.బర్దన్ తెలంగాణాకు తమ మద్దతును తెలియచేగా ప్రభుత్వం మరోవైపు భాగస్వామ్య పక్షాలనుండీ వస్తున్న వ్యతిరేకతల మధ్య భారతీయ జనతా పార్టీ తెలంగాణా పట్ల తమ వ్యతిరేకతను కాకపోయినా తమ అనుకూలతను మాత్రం తెలపట్లేదు. దేశవ్యప్తంగా రాష్ట్ర విభజన పట్ల వ్యతిరేకతనే కేంద్రం చవిచూస్తోంది. బెంగాల్ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య చిదంబరంపై నిప్పులు చెరిగారు. తెలంగాణాపై చిదంబరం ప్రకటనను తూర్పారబెట్టారు. సీమాధ్రా ప్రతినిధుల వాదనలు బలం పుంజుకున్నట్టు వారి మాటలే చెపుతున్నాయి. దానిని నిజం చేస్తూ తెలంగాణాపై నిర్నయానికి గడువు లేదని ఇవి కేవలం సంప్రదింపులుమాత్రమే అంటూ కాంగ్రెస్ ప్రకటించింది. మరోవైపు తెలంగాణా ఉద్యమానికి మావొయిస్టుల సహకారం, సానుభూతి మేలుకన్న కీడే చెసేలా కనిపిస్తోంది. ప్రత్యేక తెలంగాణాకు ఇటు రాష్ట్రంలోనూ అటు కేంద్రంలోనూ అనుకూలవాతావరణం లేదన్నది సుస్పష్టం. ప్రస్తుతం కాంగ్రెస్ కాలయాపన చేసి సమస్యను దాటవేయాలనే చూస్తోంది. కాబట్టి ప్రస్తుతానికి ప్రత్యేక తెలంగాణా లేనట్టే.

January 3, 2010

రాష్ట్రంలో రాష్త్రపతి పాలన తప్పదా?


నిన్న కొంతమండి పాత్రికేయ మితృలతో చిన్నపాటి గెట్-టుగదర్ జరిగింది. పిచ్చాపాటి నడుస్తూఉంటే ఒక సీనియర్ పాత్రికేయునికీ ఫోన్ వచ్చింది. అతడు "యాభై ఏళ్ళనుండి కలిసి ఉన్నాము. దానివల్ల మంచే జరిగిందని నేను నమ్ముతున్నాను. కాబట్టి నేను సమైక్య ఆంధ్రాయే కావాలంటాను" అని చెప్పాడు. దానితో నాకు కొంత ఉత్సుకత కలిగి దెనిగురించి మీ అభిప్రాయం చెపుతున్నారు అని అడిగాను. "ఒక పొలిటికల్ పార్టీ కొంతమందినుండీ అభిప్రాయ సేకరణ చేస్తోంది , దానికి నన్ను అడిగితే నేను నా ఉద్దేశ్యం చెప్పాను" అన్నాడు. అతడు తెలంగాణాకు చెందిన వ్యక్తే. ఐనా అతడి సమాధానం నాకు ఆశ్చ్యరం కలిగించింది. "అదేమిటి మిడియా లో అందరూ తెలంగాణాకు సపోర్ట్ చేస్తున్నారుగా?" అని అడిగితే "అందరూ కాదు " అన్నాడు. "మరి చానల్స్ అన్నీ కేసీఅర్ చుట్టూ తిరిగుతూ మంచి కవరేజ్ ఇస్తున్నాయి కద" అన్నాను. " అవునుగానీ అది ఒక భయంతో" అన్నారు. "మరి చాలామంది పాత్రికేయులు బహిరంగంగానే తమ మద్దతు తెలియచేస్తున్నారు కదా" అన్నాను. "దానికి కూడా ఒక కారణం ఉంది. పేపర్లన్నీ ఆంధ్రావాళ్ళవే. అదే వారి కోపానికి కారణం" అన్నాడు నవ్వుతూ. "మరి వారివద్ద పనిచేయడం ఇష్టం లేనప్పుడు మానియేవచ్చుకదా?" అని అడిగాను. "నేను అదే అడుగుతాను, అందుకే నా మాటలు వారికి నచ్చవు" అన్నారు ఆయన. "అంతే కాదు దేవులపల్లి అమర్‌ను కూడా ప్రెస్ అకాడమీ చైర్మన్ గా చేసింది వైఎస్సార్. అకాడమీ చైర్మన్ గా ఉంటూ ప్రత్యేక తెలంగాణకు మద్దతు తెలిపినప్పుడు అతనిని కూడా చైర్మన్‌గా రెజైన్ చేసి తెలంగాణా కోసం ఫైట్ చేయమని చెప్పాను. కాని పదవులని ఎవరు వదులుకుంటారు?' అన్నారు ఆయన. ఆ సీనియర్ పాత్రికేయుని పేరు చెప్పడం సబబు కాదని చెప్పట్లేదు. పాత్రికేయ సంఘాలలో మంచి పదవులే నిర్వహించారు ఆయన.

ఇక విద్యార్ధి గర్జన విషయానికి వస్తే జన సమీకరణ బాగానే చేసినా సభ నిర్వాహాణలో అనుభవ రాహిత్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. కోర్టు వారు ఆదేశించినట్టు విద్యార్దులే కాకుండా ముసలి విద్యార్ధులు కూడా సభలో పాల్గొన్నారు. నాకెందుకో ఉద్యమం కేసీఅర్ చేతిలోనుండీ నక్సలైట్ల చేతుల్లొకి పోయిందనే మాటలు నిజమేననిపించింది. దానికి కారణం నక్సలైట్ సానుభూతి పరులు వేదికపై సింహభాగం ఆక్రమించడం. విద్యార్ధులు రోశయ్య గారికి చంద్ర బాబుకి అల్టీమేటం ఇచ్చారు. తెలంగాణాను వ్యతిరేకించే పార్టీల కార్యాలయాలు కూలగొడతామని వాళ్ళు హెచ్చరించారు. పండుగలకు ఆంధ్రా వెళ్ళే ముప్ఫై లక్షల ఆంధ్రా వాళ్ళను తిరిగి రానివ్వమని హెచ్చరించారు. హైదరాబాదులో ఉండే ఆంధ్రావాళ్ళు చాలా కొద్దిమందేనని కేసీఅర్ గారు ఒక సందర్భంలో చెప్పారు. మరి వీరి సంఖ్య ఎంత ఉంటుందో సమయానుకూలంగా వారే చెప్పాలి. ఏది ఎద్మైనా విద్యార్దుల హెచ్చరికలు రాష్ట్రాన్ని మరింత ప్రమాదకర పరిస్తితిలోకి తీసుకెళ్ళడం ఖాయం.

ఇక ఐదవ తారీకు వస్తోంది. ఇటు తెలంగాణా అటు సీమాంధ్రా నాయకులు తమ వాదనలకు పదును పెట్టుకుంటున్నారు. ఇక్కడి ప్రజలు అక్కడి ప్రజలు ఉద్యమంలో తలమునకలైఉన్నారు. ఇక కాంగ్రెస్ ఏమి చేస్తుందో వేచి చూడాలి. అందరినీ కూర్చోబెట్టి బుజ్జగింపు కార్యక్రమం చేపట్టవచ్చు. తెలంగాణాకు అనుకూలంగా తమ ఎంఎల్ఏలపై కొంత వత్తిడి తేవచ్చు. అసెంబ్లీలో తీర్మానానికి వొప్పించవచ్చు. కానీ హైకమాండ్ మాటను ఎంఎల్ఏలు ఎంతవరకు వింటారు అనేది సందేహమే. అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెడితే తీర్మానం వీగిపోయే అవకాశాలు ఎక్కువ. కాబట్టి టీఅరెస్ కూడా దానికి సమ్మతించకపోవచ్చు. మధ్యస్తంగా హైదరబాదుకు కొంత వెసులుబాటు కల్పిస్తే తప్ప ఈ పీటముడి విడదు. నేరుగా పార్లమెంటులో తీర్మానం ప్రవేశపెట్టేటంత ధైర్యం కాంగ్రెస్ ప్రభుత్వం చేయదు. కాబట్టి ఐదవ తారీకు తరువాత ఎక్కడి సమస్య అక్కడే ఉండడానికే అవకాశాలు ఎక్కువ. దీనివల్ల తెలంగాణాలో పరిస్తితుతులు మరింత విషమించి రాష్ట్రపతి పాలనకు దారితేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి.


January 1, 2010

జనారణ్యంలో మానవ మృగాలు


వార్తలు చూద్దామని టీవీ పెడితే తెలంగాణా ఉద్యమకారుల ఊరేగింపును చూపిస్తున్నారు. అందరూ కొన్ని స్లోగన్లు ఇస్తున్నారు. వారు చెప్పే స్లోగన్ "తెలంగాణకడ్డొస్తే అడ్డంగా నరికేస్తాం" అంటూ చాలా రౌద్రంగా అరుస్తున్నారు. వారిలో అణగారిన వర్గానికి నాయకుడిగా చెపుతున్న మందమైన నాయకులు కూడా ఉన్నారు. వారు ఇచ్చే స్లోగన్‌కూడా "తెలంగాణకడ్డొస్తే అడ్డంగా నరికేస్తాం". ఎవరిని నరుకుతారు? సమైక్య ఆంధ్రాయే కావాలంటున్న ఆంధ్రా ప్రజలనా? లేక సమైక్య ఆంధ్రా కావాలనే ప్రజా ప్రతినిధులనా? ఇప్పటికే ప్రజలమధ్య భావొద్వేగాలు రెచ్చగొట్టి వారిని నిలువునా చీల్చారు. ఇక ఎదుటపడితే నరుక్కునే స్థాయికి నెమ్మదిగా చేర్చడమే ధ్యేయంగా పావులు కదుపుతున్నట్టుగా ఉంది. దానికి ప్రారంభంగా నిన్న రాత్రి నాకు తెలిసిన ఒక యువకుడిని నూతన సంవత్సర వేడుకలు చేసుకొని మరికొంత మందితో తిరిగి వస్తూ ఉంటే ఎల్‌బీ్‌నగర్ పరిసరాలలొ ఒక గుంపు దాడి చేసింది. కేవలం అతదు ఆంధ్రాకు చెందినవాడు కావడమేనట. తోటివారు వారిస్తున్నా కర్రలతో తలపగులగొట్టారు. అతడి తల్లిదండ్రులు ఆంధ్రావాళ్ళే అయినా అతడు పుట్టింది పెరిగిందీ హైదరాబాదులోనే. అతడి తల్లిదండ్రులు ఆంధ్రావారు కావడం అతడి తప్పా? అపస్మారక స్థితిలో అతడిని హాస్పటల్‌కు చేరిస్తే ఏడుకుట్లు పడగా ప్రమాదమునుండీ తృటిలో బైటపడ్డాడు. వీళ్ళు మనుషులా లేక మృగాలా? వీళ్ళు నాయకులా లేక పిశాచాలా? రాష్ట్రాన్ని పీనుగుల పెంటగా మార్చి వీరి అధికార దాహాన్ని తీర్చుకోవడమే పరమావధా? వీరిలో నెమ్మదిగా మానవత్వం నశించి దానవులుగా మారుతున్నారు. ఇంతవరకూ కేవలం ఆస్థులపైనే దాడి చేస్తున్న వీరు ఇకపై మనుషులపైనే దాడిని కొనసాగించదలిచారా? ఉద్యమాన్ని మరింత ఉదృతం చేయడం అంటే ఇదేనా? హైదరాబాదు దానవులకు నిలయంగా మారనుందా? ఆంధ్రాప్రజల రక్షణకు ఢోకా లేదంటున్న తెలంగాణా నాయకుల మాటలు కేవలం గాలిమాటలేనా? వీరి చర్యలకు మానవత్వం సిగ్గుతో తలవంచుకుంటుంది. త్వరలోనే పిశాచాలు రాజ్యమేలడానికి ఇది నాందిగాబోలు.