February 18, 2011

చిల్లర నాయకులు..!!


నోరు విప్పితే గబ్బు...మాట్లాడితే మాయమాటలు...జనాల అమాయకత్వంతో ఆటలు...ప్రజల మనోభావాల మాటున కపట రాజకీయాలు....ఆశయాల సాధన పేరుతో అక్రమ సంపాదన...ఇది గులాబీల వికృత చేష్టలు. దీనికి వారు పెట్టుకున్న మరో ముద్దు పేరు "మా సంస్కృతి". అసెంబ్లీ సాక్షిగా వీరి వికృతి హేల నిన్న హద్దులు దాటింది. గవర్నరు పై దాడిని జరిగిన తరువాత వారి చర్యను ఖండించబోతే జేపీకి జరిగిన అవమానానికి యావత్ మీడియా సాక్షిభూతంగా నిలిచింది. వారి చర్యలను ఆపబోయిన మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ఈ చర్యను యావత్ మీడియా తమ కెమేరాలలో బదిస్తూ చోద్యం చూస్తూ ఉంటే మరికొందరు జర్నలిస్టులు నవ్వుకుంటూ ఆ వికృత హేలను ఆనందించడం స్పష్టంగా కనబడింది. మట్టిగొట్టుకుపోతున్న విలువలకు అసెంబ్లీ వేదిక కావడం మరో దురదృష్టం. ఈ చర్యను ప్రభుత్వం ఖండించి ఊరుకుంటుందా? దాడిచేసిన వారినే కాదు దాడికి ప్రోత్సహించిన వ్యక్తులను జీవిత కాలం పాటు ఎన్నికలలో పోటికి అనర్హులుగా ప్రకటించాలి. వారిని దోషులుగా ప్రకటించి శిక్ష విధించాలి. సహాయ నిరాకణలో పాల్గొని సుస్పేండైతే ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక రాష్ట్రంలో ప్రమోషన్లు ఇస్తామని ప్రకటించిన చిల్లర నాయకుల మాటలకు భ్రమపడితే జరిగేది బిక్షాటనే. బూతద్దంపెట్టి వెదికినా వీరిలో విలువలు పాటించే వ్యక్తి ఒక్కరైనా కనబడతారా అన్నది అనుమానమే. ఇప్పటివరకూ చక్కటి వాక్పటిమతో హుందాగా ప్రవర్తించిన రేవంత్ రెడ్డి లాటి యువ నాయకుడు కూడా వీరిలో చేరడం దురదృష్టకరం. కుళ్ళిన శవాలకోసం రాబందులు సృష్టించబోయే వికృత ప్రళయానికీ ఇది ఒక సంకేతమా? వీరి చేతికి అధికార పగాలు ఇస్తే జరగబోయేది వినాశనమే గానీ మరొకటి కాదు. జేపీ గారికి నా సంపూర్న మద్దతు తెలుపుతున్నాను. జేపిపై దాడి చేసి గులాబీలు వారి చితికి వారే నిప్పు పెట్టుకున్నారు.


February 16, 2011

శూర్పణకకి సీతపై అసూయ సహజమే!!




దశరధమహారాజు ఒకానొక సమయంలో కైకకి ఇచ్చిన వాగ్దానాన్ని మన్నించమని శోకమందిరంలో ఉన్న కైక కోరుతుంది. వాగ్దానం ప్రకారం కైక కోరికలు దశరధుడు మన్నించాలి. భరతుడికి పట్టాభిషేకం చేయడం ఒకటైతే మరోటి శ్రీరాముడిని అడవులకు పంపివేయడం. ఆమె మాట ప్రకారం సీతారాములు అడవికి బయలుదేరుతారు. వారితోబాటోబాటు లక్ష్మణుడు కూడా బయలుదేరుతాడు. నార దుస్తులతో వారు అడవికి బయలుదేరుతారు. నారబట్టలు కట్టుకోవడం సీతాదేవికీ రాకపొతే శ్రీరాముడు ఆమెకు సహాయపడతాడని రాసి ఉంది.అంటే భార్య భర్తలు ఎలా ఒకరికొకరు సహయాం చేసుకోవాలో తెలియచేయడానికి వ్రాసిన విషయం. అలాగే వారి ప్రేమ అలౌకికమైనది. ఒకరంటే మరొకరికీ ఉండే ప్రెమ అభిమానం, రాముడిపట్ల సీతకుండే భక్తి తత్వం, సీతా రాముల అంద చందాలు చూసి రావణుడి చెల్లెలు శూర్పణకకి కన్నుకుడుతుంది. ఎలాగైన రాముడిని మనువాడాలని ఎన్నొ ప్రయత్నాలు చేస్తుంది. ఆ అసూయే సీతపట్ల ద్వేషభావం పెరగడానికి కారణం. వారిద్దరినీ ఎలాగైనా వేరుచేయాలన్న ప్రయత్నంలో లక్ష్మణుడి చేతిలో భంగపడి రావణుడిని రెచ్చగొడుతుంది. వారిద్దరూ వెరైతే రాముడు తనకు దక్కుతాడని ఒక పిచ్చి నమ్మకం. దానివల్లే సీతాపహరణం, రామ రావణుడి యుద్ధం అందరికీ తెలిసిందే.

కానీ ఇక్కడ ఎవ్వరికీ తెలియనీ విషయం ఆనాటి శూర్పణక ఆంధ్ర దేశంలో మళ్ళీ జనియించి ఈనాడు సీతా రాములపై బ్లాగుల్లో దుష్ప్రచారం చేయడం. అందగాడైన రాముడు ఆమెకు దక్కకపోవడం ఆమెలో నిసృహకి కారణం ఒకటైతే, సీతవల్ల తన అన్నగారైన రావణుడు చనిపోవడం మరో కారణం. కాబట్టి రాక్షస జాతికి చెందిన ఆమెకు సీతారాములతో వైరం రావణుడిపట్ల ప్రేమ సహజం. ఆనాటి శృంగభంగాన్ని మర్చిపోలేక సీతని మా అన్న ఏదో చేసాడని, వారిద్దరిదీ నిజమైన ప్రేమ కాదని, రాముడికి సీతపై ప్రేమ లేదని అందువల్లే వదిలివేశాడని పిచ్చిరాతలు రాసుకుంటూ ఆనాతి శూర్పణక ఈనాడు తృప్తి పొందుతోంది. కాబట్టి రామయణాన్ని అభిమానించే వారెవ్వరూ ఆ రాతలను పట్టించుకోనక్కర్లేదన్నది నా అభిప్రాయం.



February 7, 2011

క్లారిటీ అనేది మన అభిప్రాయంలో ఉండాలి మిత్రమా!!



బ్లాగులో రాతలు తీటలాంటిదే. మనం గొప్ప అనుకున్న అభిప్రాయాన్ని మనం రాసుకుంటే తీరిక ఉండి బ్లాగులొకి తొంగిచూసినోడు నచ్చితే "ఆహ!" అంటాడు లేకపొతే "యాహ!" అంటాడు. మన అభిప్రాయాలు కొద్దిగ అతిగా, తిక్కతిక్కగా అనిపిస్తే, ఎదుటివాళ్ళని రెచ్చగొట్టేల ఉంటే చదివినవాడు మనల్ని గిచ్చడానికి ప్రయత్నిస్తాడు. ఇది మాటలవరకే ఐతే పర్వాలేదు, శృతిమించి వ్యక్తిగత ధూషణలకు వెళ్ళడం మాత్రం అర్ధం లేనిని, భరించలేనిది. సత్తయ్య మంచివాడు అంటే తెలిసినవాళ్ళు అవును అనుకుంటారు, తెలియనివాళ్ళు అవునేమో అనుకుంటారు. కానీ జగమెరిగిన "మీడియా" చెడ్డది అందులో పనిచేసేవాళ్ళు చాలా మంచోళ్ళు అంటేనే తంటా మొదలవుతుంది. మంచోళ్ళు అందరూ కలిసి మీడియాని బాగుచేయచ్చు కదా అన్న ప్రశ్న తలెత్తుతుంది. ఇక్కడ వెలుబుచ్చుతున్న అభిప్రాయమేమిటంటే "మీడియా"లో ఉన్న పెట్టుబడిదార్లు దొం.నా.కో లు పనిచేస్తున్న జర్నలిస్టులంతా మంచోళ్ళు అని. ఇక్కడ విషయం ఎక్కడికెళ్ళిందంటే ఆంధ్రా తెలంగాణా అంశానికి దారితీసింది. మీడియాలో పెట్టుబడిదారులలో చాలామంది ఆంధ్రావాళ్ళే. కాబట్టి ఆంధ్రావాళ్ళని విలన్‌లని చేస్తూ ఇక్కడి జర్నలిస్టులను హీరోలను చేసే ప్రయత్నం ఒకటైతే, హోల్ మొత్తం మీద పెట్టుబడిదారులను ఒకవర్గం చేసి వాళ్ళు చెడ్డోళ్ళు అనేసి "జర్నలిస్టు" అంటేనే చానా మంచోడు అనడం రెండో మాట. కానీ ఒక సామాన్యుడి దృష్టిలో మీడియా అంటే మీడియా. కాబట్టి పైన రెండు స్టేట్‌మెంట్లు తప్పే. దొంగతనం చేసినవాడు జర్నలిస్టైనా వాడిని కూడా దొం.నా.కొ అనగలిగి జర్నలిస్టులలోనూ దొంగలున్నారు అని చెప్పగలిగే సత్తా ఉండాలి. అప్పుడే మన రాతల్లో నిజాయితీని ప్రజలు (బ్లాగు చదివినవాళ్ళు) గుర్తిస్తారు. ఇక ఎవరో అనామకుడు పిచ్చిరాతలు రాస్తే దానికి మీ సొంతపేరుతో ఫోన్ నంబర్లు ఉంచి మీడియా మీద రాతలు రాయండి మీకు తెలుస్తుంది అనడం, మాఫియాగా వర్నించడం ఎవరిని భయకంపితుల్ని చేయడానికో మరి. అందరూ ఒకతానులో గుడ్డలే. ఎవ్వరూ తక్కువ తినలేదు. ఎవరికి అందినంత వాళ్ళు దోచుకుంటారన్నది జగమెరిగిన సత్యం. మీ పోరాటం అన్యాయంమీదైతే జర్నలిస్టుల్లోనూ దొంగలున్నారు అని ప్రకటించి వారిని కూడా బైటపెట్టే ప్రయత్నం చేస్తే ప్రజలు విశ్వవిస్తారు.

ఒకరి అభిప్రాయాలు నచ్చక్పొతే వ్యతిరేకించవచ్చుగానీ వ్యక్తిగత ధూషణలు చేయడం మాత్రం ఎవ్వరూ హర్షించరు. వాటిని మనమందరమూ ఖండించాలి.



November 28, 2010

ఖరీదైన కూలీ !!

మా అపార్ట్‌మెంట్లో సెక్రటరీ ఒక నిర్నయం తీసుకున్నాడు. ఫ్లాట్లలో ఉండే కార్లను ఇకనుండీ వాచ్‌మెన్ తుడవడని. ఎందుకంటే కార్లు తుడవడంవల్ల ఎక్కువ సమయం దానికే పోతే అసలు పనులు చేయడానికి వాచ్‌మెన్ కి సమయం చాలట్లేదని. ఏమి చేస్తాము? ఎవరినైన మరొకరిని వెతికిపెట్టమని వాచ్‌మెన్‌కె అప్పచెప్పాను. ఒకరోజు ఉదయాన్నే వాచ్‌మెన్ ఒక వ్యక్తిని వెంటబెట్టుకొచ్చాడు. సార్ ఇయన కార్లు శుబ్రం చేస్తాడుట. కార్లు ఉదయాన్నే శుబ్రం కూడా చేశాడు. అన్నాడు. అతనితో అన్నాను "సరే నెలకు ఎంత ఇమ్మాంటావు?" అని. "నెలకు కాదు, ఈ ఒక్కరోజే తుడుస్తాను. ఇవ్వాళ తుదిచినందుకు పది లక్షలు ఇవ్వాలి" అన్నాడు మెడలోని కండువా సర్దుకుంటూ. నా చెవులను నమ్మలేక "ఎంత అన్నావు?" అన్నాను. "అక్షరాల పది లక్షలు" అన్నాడు. నా కారు విలువే ఐదు లక్షలు ఉండదు. దానిని ఒకసారి తుడిచినందుకు పది లక్షలా? మా వాచ్‌మెన్ కేసి అయోమయంగా చూశేను. వాచ్‌మెన్ అన్నాడు" అవును సారు ఆయన గొప్పనాయకుడు. అదేదొ పనికోసం చందాలు వసూలు చేస్తున్నడంట". "ఐతే మాత్రం కారు తుడిస్తే పదిలక్షలా? కావాలంటే వంద రూపాయలిస్తాను" అన్నాను. దానికి అతను కొపంగా" ఇక్కడ తిరగాలంటే పది లక్షలు ఇవ్వాల్సిందే" అంటూ వెనుతిరగబోయేడు. ఈ సంభాణ వెనకనుండీ వింటున్న మా ఆవిడ ఖంగారుగా నాతో" ఆయనతో గొడవెందుకండీ మీరు అప్పుచేసి ఇవ్వగలిగినంత ఇస్తానని చెప్పండి" అన్నది. నేను ఆయన వెంట నడుస్తూ నా బాంక్ బాలెన్స్ క్రెడిట్ కార్డులు అన్నీ చూపించి నా తాహతు ఆయను తెలియచెప్పి ఒక అంకె చెప్పాను. ఆయన అన్యమనస్కంగా ఒప్పుకొని నేని ఇచ్చిన చెక్కు తీసుకొని వెళ్ళాడు. కాబట్టి మిత్రులెవరైనా కొత్త పనివారిని పెట్టుకొనేముందు కాస్త తెలుసుకొనె మసలుకోండి. వచ్చింది మరెవరో కాదు..తెలంగాణా పులకేశి!!

August 31, 2010

ఆయన వీసినా? వీళ్ళు లెక్చరర్లా?

ఉస్మానియా యూనివర్సిటీలో వాల్యూయెషన్ కి వచ్చిన లెక్చరర్లను విద్యార్ధులు చెప్పులతో కొట్టడం చానల్స్‌లో అందరూ చూసే ఉంటారు. ఇంగిత జ్గ్యానం ఉన్నవాళ్ళెవరైనా దీనిని ఖండిస్తారు. వాళ్ళ దుశ్చర్య టివీలో స్పష్టంగా కనిపిస్తోంది. విద్యార్ధ్యులు దాడి చేయలేదని కేవలం బెదిరించారని తెలంగాణా పులకేసి చెప్పుకొచ్చాడు. వారికి కనీస ఇంగిత జ్గ్యానం లేదని అందరికీ తెలిసిందే. కానీ సదరు వీసీకి కూడా మెదడు అరికాలినుండీ మోకాలుకు చేరిపోయిందదని అనిపిస్తోంది. ఎందుకంటే జరిగిన దానిని తప్పు అని చెప్పే దమ్ము లేకపోయినా, వారిపై చర్య తీసుకునెందుకు మనసు రాకపోయినా పర్వాలేదు, కానీ దీనిని మీడియా దుశ్చర్య అని మీడియా అనవసర ప్రచారం చేసిందని చెప్పడం సిగ్గుమాలిన తనం. తెలంగాణా గొడవల్లో కూడా మీడియా అదే పాత్రను పోషించింది. సదరు వీసీని ఎవరైనా చెప్పులతో సత్కరించి ఉంటే వీరికి అభిమానం అంటే ఏమిటో తెలిసి ఉండేది. పైగా విద్యార్ధులకు నష్టం జరగకుండా వీరు చూస్తారుట. అంటే దీని అర్ధం ఆంధ్రా ప్రాంతం నుండీ వచ్చిన లెక్చరర్లు వీరికి నష్టం కలుగ చేశారనా వీరి ఉద్దేశ్యం? తోటి లెక్చరర్లను చెప్పులతో కొడితే సానుభూతి తెలపవల్సింది పోయి విద్యార్ధులపై కేసులనెత్తి వేయాలని అక్కడి లెక్చరర్లు ఆందోళన చేశారట. వీళ్ళు లెక్చరర్లా? వీళ్ళ బతుకులు చెడ! వీసి పదవికి, లెక్చరర్ మాటకి తలవంపులు తీసుకు వచ్చారు. ఇంతకన్న వెధవలు ఉండరేమో? చదువుకున్నవాళ్ళే ఇలా చస్తే, చదువు లేనివాళ్ళు మరింత మూర్ఖంగా ప్రవర్తించడం పెద్దవిషయం కాదేమో? ఇది కేవలం కాష్టాని రగిలించడానికి చేసిన ప్రయత్నమేగానీ మరోటి కాదని అనిపిస్తోంది. దానిలో కిరాయి విద్యార్ధులతోబాటు లెక్చరర్లు చేరడమే మారుతున్న విలువలకు నిదర్శనం.

August 26, 2010

బ్లాగర్లూ జర జాగ్రత్త !!

తెలుగు భాషాభివృద్ధికోసం బ్లాగర్లంతా "తెలుగు బాట" కార్యక్రమం చేబట్టడం నిజంగా అభినందించాల్సిన విషయం. గిడుగు రామ్మూర్తిగారి జన్మదినం నాడు ఈ కార్యక్రమాన్ని చేబట్టడం మరింత ఆనందించాల్సిన విషయం. నాక్కూడా ఆరోజు బ్లాగర్లందరితోనూ పాల్గొని నేనేగాకుండా మరింతమందిని తీసుకురావాలని ఉంది. కానీ కొంతమంది వక్రదృష్టి దీనిమీద పడుతుందేమో అనే సందేహం కలుగుతోంది. మొదటిది తెలుగుభాష అంటే "తెలంగాణా తెలుగా?" లేక "ఆంధ్రా తెలుగా?" అనేది మొదటి సందేహం. మరి ఏ తెలుగుభాషో తెలియకుండా నేనెలా పాల్గొనేది? రెండూ ఒక్కటే అని మీరంటే నాకేమాత్రం అభ్యంతరం లేదుసుమండీ! కానీ అంతా ఒక్కటే అంటే మరి మా తెలంగాణా పులకేసి ఒప్పుకుంటాడా? కార్యక్రమాన్ని సజావుగా సాగనిస్తాడా? పైగా కార్యక్రమం మొదలుపెట్టేది తెలుగు తల్లి విగ్రహం నుండి. అదే తెలంగాణా తల్లి విగ్రహంనుండి ఐతే మా పులకేసికి అభ్యంతరం ఉండదేమో బ్లాగర్లంతా ఆలోచించాలి. దీనికి ఒక రాజకీయ రంగు పులిమి ఇదికూడా సమైక్యవాదుల కుట్ర, తెలుగు భాష ముసుగులో వీరంతా తెలంగాణా వ్యతిరేకంగా ఉద్యమం చేబడుతున్నారంటూ దాడిచేస్తేమాత్రం నా భాద్యత లేదు. కాబట్టి బ్లాగర్లంతా తగుజాగ్రత్తలతో "తెలుగు బాట"లో పాలొనాలని నా విన్నపం.

June 9, 2010

మీడియా, జర్నలిస్టులు వేరు వేరుట !!


దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకోవడం అనేది ఒకప్పటి మాట. చానల్స్ చానల్స్ ఊళ్ళు పంచుకోవడం అనేది ఇప్పటి మాట. దొంగల ఆగడాలు కొంతవరకు పోలీసులు అరికడతారు. ప్రభుత్వ ఆగడాలను ప్రతిపక్షాలు అరిచి అడ్డుకుంటాయి. కాని మీడియా ఆగడాలను ఆపడం ఎవరి తరము కాలేదు. కానీ ప్రజల అదృష్టం కొద్దీ వారి ఆగడాలు వారే బైట పెడుతున్నారు. ఆ మధ్య రెండు చానల్స్ ఒకరిపై ఒకరు ప్రత్యక్ష వాదోపవాదనలు చేసుకుంటూ ఒకరు చేసిన ఆగడాలను మరొకరు బైటపెడుతూ మీడియా ముసుగు తొలగించి ప్రజలముందు నగ్నంగా ఆవిష్కరించారు. మీడియా అంటే ప్రజలలో ఉన్న భ్రమలు తొలగేటట్టు చేసారు. కాని ఇలాటి సంఘటనలు కొంతమంది మీడియా మితృలకు బ్లాగు మిత్రులకు కూడా మింగుడు పడలేదు. తరువాత జర్నలిస్టుల మధ్య జరిగిన వాదనలు కూడా దొంగలు దొంగలు ఒకరినొకరు బైటపెట్టుకుంటే ఎలా, ఇది మంచి విధానం కాదు అన్న పద్ధతిలో జరిగాయి. ఇప్పుడు బ్లాగుల్లో మీడియా అంటే ఒకటి కాదన్నట్టు ఉంటున్న వారి వాదనలు ఆశ్చర్యం కలగ చేస్తోంది. జర్నలిజంలో యాజమాన్యం ఒక వర్గముట. వాళ్ళు పెట్టుబడిదారులుట. పేపర్లు నడిపేది డబ్బున్న మారాజులేగానీ ధర్మరాజులు కాదని ఇప్పటివరకు వీరికి తెలియదా? ఒక్కక్క జర్నలిస్టుకు అక్షారాలా ముప్ఫైవేలనుండీ యాభైవేలవరకూ జీతభత్యాలు చెల్లించాలంటే అది డబ్బున్నా మారాజులవల్లే అవుతుంది. ఇక జర్నలిస్టులలో రెండో వర్గం యాజమాన్యం కొమ్ము కాసే వర్గమట. వీరు కూడా అసలైన జర్నలిస్టులు కాదుట. పెట్టుబడి పెట్టే యజమాన్యం తమకనుకూలమైనవారికే పగ్గాలు అప్పచెపుతుందని తెలియని అమాయకులా వీరు? తమను ఎండకడుతూ తమకు వ్యతిరేకంగా పనిచేసే ఏ వ్యక్తినీ ఏ సంస్థా భరించదని వీరికి తెలియదా? మీడియా అనేది ఒక వ్యాపార సంస్థే అని ఎప్పుడో నిర్నయించబడింది. దానికి ప్రత్యేక హోదా అవసరం లేదు. అటువంటప్పుడు ఈ నీతి సూత్రాలెందుకు? ఉద్యోగం కావాలంటే యాజమాన్యం చెప్పింది చేయాలి. అది మీడియా అయినా మరేదైనా ఒక్కటే. జీవితం అంటే ఏమిటో పూర్తిగా తెలియని దశలో ఒకరు తమ బ్లాగుల్లో రాసుకున్న రాతలను గొప్ప స్వేచ్చా భావాలు అంటూ అకాశానికెత్తి పొగిడితే జరిగే మేలు ఏమీ ఉండదు. ఆమెకు మరికొంత నష్టమే తప్ప. వీరు రాసే ప్రతీ రాతల్లోనూ జర్నలిస్టుల తప్పు ఏమి లేదనడం, దానికి బాధ్యత యాజమాన్యానిదో, లేక వారి కొమ్ము కాసే భజనపరులదో అనడం హాస్యాస్పదం. మీరంతా ఒకే తానులో గుడ్డలే అనడంలో ఎవ్వరికీ ఏమాత్రం సందేహం ఉండదు. మనం రాసే రాతలను జనం పూర్తిగా విశ్వశిస్తారు అనుకోవడం కూడా ఒక భ్రమే. అన్యాయం ఎక్కడ జరిగినా ఖండించాలి. దానికి వారు వీరు అనే తారతమ్యాలు ఉండకూడదు. వాళ్ళు జర్నలిస్టులైనా మరెవరైనా. స్వచ్చత అనేది మనుషుల్లో ఉండాలి, అది కేవలం వృత్తిలోనే వస్తుంది అనుకోవడం గొప్ప పొరబాటు. జనం దృష్టిలో మీడియా అంటే మీడియానే. యాజమాన్యం, భజనపరులు, స్వేచ్చాభావాలుగల జర్నలిస్టులు అంటూ ఉండరు. ఇలాటి వర్గాలు అన్ని సంస్థల్లోను ఉంటాయి. కాబట్టి తప్పును తప్పుగా చెప్పాలి, పక్కవారిపైనెట్టి నేను స్వచ్చమైనవాడిని అంటే జనం ఒక్కసారే నమ్ముతారు.

ఇక స్వామీజీల విషయానికి వస్తే ప్రజల నమ్మకాన్ని కొంతమంది స్వాములు సొమ్ము చేసుకుంటున్నారన్నది నిర్వివాదాంశం. కొంత ధర్మ ప్రచారం జరిగినా సంపాదనే వారి లక్ష్యం. వారి సాంపాదనలో రాజకీయ నాయకులు,మీడియా కూడా వాటాలు పొందుతారన్నది కొంత నిజం. నాకు తెలిసి ఒక పెద్ద స్వామిజీ తాను అవతారమెత్తిన కొత్తల్లో ప్రచారం కోసం, కవరేజీకి వెళ్ళిన జర్నలిస్టులకు బంగారపు గొలుసులు, ఉంగారాలు ఇచ్చేవాడని ఒక పెద్దాయన చెప్పేడు. నేను కలిసిన ఒక డబ్బున్న భక్తురాలు (ఆమె లెక్చరర్) తనకు నెల నెలా వచ్చే ఇంటి అద్దెల ఆదాయమంతా తన భర్తకు కూడా తెలియకుండా సదరు స్వామీజీకి పంపుతానని చెప్పారు.ఆదాయా మర్గాలు పెరిగేచోట మీడియా దృష్టి పెట్టడం సహజమే కదా. ఏంతైనా మీడియా స్వామీజీలకంటే పవర్‌ఫుల్ కదా!!