November 30, 2009

స్విమ్మింగ్ గోదావరి విత్ డాగ్ టైల్

అర్ధమైందా మీకు? అంటే కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదడమన్న మాట. సర్వశ్రీ కేసీఆర్ గారు తమ ఆమరణ దీక్షను పండ్ల రసం తాగి విజయవంతముగా విరమించారు. ఇది కూడా కేసీఆర్ స్క్రీన్ ప్లే లో భాగమే అయిఉండవచ్చు. వారిని ఇప్పటివరకు వెనకేసుకొచ్చిన వారందరికీ ఇది ఒక షాకింగ్ న్యూసే. ఉద్యమంలో మీరు త్యాగం చేయండి అంటూ తాను తమాషా చూడడానికే నిశ్చయించుకున్నారు. అవసరమైతే ఉరికంబం ఎక్కుతానని ప్రకటించి కొందరి అమాయకుల ప్రాణాలను గాలిలో కలిపేసారు. ఉవ్వెత్తున ఎగసిన ఉద్యమ జ్వాలలో కొందరి అమాయక ప్రాణాలు గాలిలో కలసిపోయాక కొందరి నెత్తురు చిందించాకా వారికి ఙ్యానోదయం అయింది. ప్రజాస్వామ్య పద్దతిలో పోరాటం చేయాలని నిర్నయించారుట. ఎందరో విద్యార్ధులు వీరి మాటలకు ఉద్వేగంచెంది రెండు రోజులుగా జైళ్ళలో మగ్గుతున్నారు. చాలా మంది విద్యార్ధులు ఉద్యమ బాట పడతామని ప్రతిగ్జ చేసేరు. వీరిని జైల్లో పెట్టినందుకు ఆత్మ హత్య ప్రయత్నాలు చేసారు. ప్రజాస్వామ్య బద్ధంగా తెలంగాణా సాధించుకు రమ్మని ఎన్నికల్లో గెలిపిస్తే మరి వారు ఇప్పటివరకు వారు చేసిందేమిటో? ప్రజాస్వామ్య బద్ధంగా చేయబోయేదేమిటో వారే చెప్పాలి. ఎందుకంటే వారి స్టైలే వేరు. అమాయక విద్యార్ధులు వారి మాయ మాటల వలలో పడకుండా ఎవరైనా కాపాడగలరా?

వంది మాగధులు కొత్తగా చెప్పేది ఏమిటంటే కేసీఆర్ విద్యార్ధులలో ఉద్యమ స్పూర్తి నింపారని. దానికి అయిన ఖర్చు కొందరి ప్రాణాలు కోట్లలో ఆస్తి నష్టం

November 29, 2009

త్యాగాలు చెయ్యండి నేను తమాషా చూస్తా ! !

అంతా అనుకున్నట్టుగానే జరుగుతోంది. స్క్రేన్ ప్లే ప్రకారం కధ నడుస్తోంది. అరెస్టు చేయగానే అంతకన్న సేఫ్ ప్లేస్ దొరకదన్నట్టు కేసీఆర్ వెళ్ళిపోయాడు. అమ్మయ్య ఆమరణ దీక్ష కూడా తప్పింది అనుకొని ఉంటాడు. తరువాత ఆ బాధ్యత హరీష్ రావు తీసుకున్నాడు. కేసీఆర్ ని అరెస్ట్ చేస్తే ప్రజలు ఊరుకోరుట. ప్రజలు సరే మరి ఈయన ఏమి చేస్తాడుట? ప్రభుత్వం కేసీఆర్ ని మరల తీసుకొచ్చి వేదిక వద్ద దింపి ఆయనను దీక్షలో కూర్చొబెట్టాలిట. మైకు ముందు హరీష్ చెప్పే మాటలు నాకైతె భలే నవ్వు తెప్పించాయి. మధ్యలో నాగం జనార్ధన రెడ్డి గారు కేసీఆర్ ని అరెస్టు చేయడం అప్రజాస్వామ్యం అంటూ కేకలు. వీరి కప్పదాటు నిర్నయాలకి ప్రజలు చీ కొట్టినా సిగ్గు రాలేదు. ఇటువంటి పరిస్తుతులలో సులువుగా భావొద్వేగానికి గురయ్యేది విద్యార్ధులే. ఉద్రిక్త వాతవరణం ఉన్నప్పుడు పోలీసు కాపలా సర్వసాధారణం. వారిలో ఒకరు పోలీసుపై రాయి విసరడంతో యూనివర్సిటీ కేంపస్ లో ఒక పోలీసుకు మొఖం పగిలి రక్తం కారడం స్పస్టంగా కనబడింది. వాళ్ళు అసలే పోలీసులు వాళ్ళు ఊరుకుంటారా? దొరికిన వాడిని దొరికినట్టు విరగ గొట్టేరు. ఎల్బీ నగర్‌లో ఒక విద్యార్ధి పెట్రోల్ పోసుకుంటే టీఆరెస్ కార్యకర్తలే నిప్పు పెట్టారుట. వాళ్ళు కార్యకర్తలో లేక నర రూప రాక్షసులో తెలీదు. ఐనా మన దేశంలో పార్టీ కార్యకర్త అంటే వారి స్థాయి ఏమిటో ప్రతి ఒక్కరికి తెలుసు. అదృష్టం కొద్దీ అతడు కొద్దిపాటి గాయాలటో బైటపడ్డట్టు అనిపించింది. ఒకవేళ అతడికి ఏమైన ఐఉంటే అతని తల్లికి కలిగే గర్భశోకాన్ని కేసీఆర్ పోగొట్టగలడా? తెలంగాణా ఏర్పడినా అతని జీవితాన్ని తిరిగి ఇవ్వగలడా? ఇటువంటి త్యాగాలు ముందు టీఆరెస్ నాయకులు చేసి తరువాత ఆచరించమని చెపితే బాగుండేది. అది కేసీఆర్ తొ ప్రారంభిస్తే మరీ బాగు.

నేనే పోలీస్‌నైతే ముందుగా కవరేజ్ కొచ్చి పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడిగే చెత్త న్యూస్ చానెల్ విలేకరుల వీపు పగలగొట్టేవాడిని. మరి కేసీఆర్ ని అరెస్టు చేసారు కదా మీరేమి చేస్తారు అంటూ అగ్గిపుల్ల ప్రశ్నలు వేసి వారు చెప్పే ఎగవేత మాటలు మరల మరల ప్రసారం చేయడం. అది విని అమాయక విద్యార్ధులు రెచ్చిపోవడం. ఇంకా నంగి నంగి మాటలలో మాటలు కూడా మాట్లాడలేని విద్యార్ధులు ఉద్రేకంగా చెప్పే మాటలు పట్టుకొని ఇక్కడ వాతవరణం చాలా ఉద్రిక్తంగా ఉందని సొల్లు కబర్లు చెప్పడం. ఈ రాజకీయ జగన్నాటకంలో ఎంతమంది బలవుతారో ?

November 27, 2009

నే సచ్చిపోతా...నన్నాపకండి ! !

చాలా సినీమాల్లో మనం చూసాము వేణుమాధవ్ కోపంగా నే సచ్చిపోతా నన్నాపకండి అని గింజుకుంటూ ఉంటే వెనుకాల స్నేహితులు పట్టుకొని ఆపుతూ ఉంటారు. విసిగిపోయిన స్నేహితులు సరే సచ్చిపో అని వదిలేస్తే సరే మీరు చెప్పినాక నేనెందుకు చస్తాను అంటూ వాయిదా వేస్తాడు. నిన్న న్యూస్ పేపర్ చూస్తూ ఉంటే నాకెందుకో షడన్‌గా అది గుర్తుకు వచ్చింది. తెలంగాణా సాధన కోసం మధువును కూడా త్యాగం చేసిన కేసీఅర్ నిన్నటినుండి అప్పగింతల కార్యక్రమం మొదలు పెట్టారు. ముందు ఇంటివారి వీర తిలకం అందుకున్నారు. తరువాత తెలంగాణా భవన్‌లో అప్పగింతలు చివరికి ప్రెస్ వారికి కూడా మళ్ళీ కలుస్తానో లేదో అంటూ సెలవు తీసుకున్నారు. 29న జరగబోయే నాటకానికి రిహార్సల్స్ మొదలయ్యాయని చెప్పకనే చెప్పారు. వారు స్వయంగా వధ్యశిలకు వెడుతున్న ఆవులా అనుకున్నా ఇదంతా ఫక్తు నాటకీయ పరిణామలా ఉంది. మధ్యలో వారిని వారు పొట్టి శ్రీరాములు తో కూడా పోల్చుకున్నారు. వారి ముందస్తు ఏర్పాట్లన్నీ ప్రభుత్వం తమ మరణ దీక్షను ఆపుతుందో లేదో అనే అనుమానంతో కావచ్చు. నాకెందుకో ప్రభుత్వం కేసీఅర్ దీక్షను నిరవధికంగా కొనసాగనివ్వాలని కోరుకుంటున్నాను. ముందుగానే వారిని అరెస్టు చేస్తారని కేసీఅర్ కి తెలుసు. కొంత రసాభాసతో అది ముగుస్తుందని నాకు మీకు వారికి కూడా తెలుసు. ఐనా కూడా వారు తమ నాటకాన్ని విజయవంతం చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఇక్కడ ప్రత్యేక తెలంగాణా అవసరమా కాదా అన్నది సమస్య కాదు, ప్రజల ఆశయాలకు తగ్గ నాయకుడా కాదా అన్నది ప్రధాన సమస్య. అది కేసీఅర్ తొ ఎన్నటికి కాదు అన్నది నగ్న సత్యం.