October 20, 2017

కడుపుమంటకు కారణాలు!!

ఊరందరిదీ ఒక దారైతె ఉలిపిరికట్టది మరో దారి అన్నది సామెత అని విన్నట్టు జ్గ్యాపకం. అందరిలా మనమూ ఉంటే ఎలా అని అనిపించినప్పుడు..మనల్ని ఎవరూ గుర్తించట్లేదు అనిపించినప్పుడు...జివితం లో కొత్తదనం కావాలి అనిపించినప్పుడు...జివితం మరీ సాదాసీదాగా పోతోంది అనిపించినప్పుడు... ఏదో ఒక చిలిపి చేయాలి అని అనిపించినప్పుడు....కడుపు మండినప్పుడు... తలలో నిషా ఎక్కినప్పుడు....పక్కవాడి పెరుగుదల మన మనసుని చిద్రం చేస్తున్నప్పుడు...మనమీద మనకే విసుగుపుట్టినప్పుడు... కళ్ళు మండి కడుపు మండి మెదడు చిట్లినప్పుడు...ఎవరో ఒకరిని దుమ్మెత్తి పొస్తే కాస్త మనసుకి శాంతి కలుగుతుంది. అది కూడ సెలబ్రటీనో లేక ఒక  కులాన్నొ దుమ్మెత్తి పొస్తే ఉండే ఆ కిక్కే వేరు. చేతి  దురద తగ్గేదక రాసెయ్యాలి, నోటి దూల తీరేదాకా వాగాలి. కంఠ సోష తగ్గేదాకా నిందలు వేయాలి. ఇక చూస్కో  సోషల్ మీడియాలో బోలెడు పబ్లిసిటీ, లత్కోర్ చానల్లో బోలెడు చర్చలు, పనికీమాలిన పేపరోళ్ళ పబ్లిసిటీ. మొబైల్స్‌లో,  వాట్సప్‌లలో,  రోడ్లమీద, కార్లమీద, ఆఖరికీ టాయిలెట్లలో కూడా బోలెడు పబ్లిసిటీ. నా భావ స్వేచ్చను హరించే హక్కు ఎవ్వరికీ లేదు. నన్ను కాదంటే నీలో ఏదో దురహంకారం ఉన్నట్టే. నీ ఛాందసవాదంతో నన్ను ఆపలేవు. ఇరోజు రాష్ట్రమంతా కాదు కాదు దేశమంతా నాగురించే చర్చ. నేను అనుకున్నది సాధించా. నేను అనుకున్నది సాధించా !!   రేపొమాపో ఏకో ఒక పార్టీ నన్ను తమలోకి  ఆహ్వానిస్తుంది. ఏందుకంటే నేను ఈరోజు వార్తల్లో వ్యక్తిని. నా చర్మం మందం. నా నాలుక మందం. నా బుద్ధి మందం. నా కళ్ళు చూడలేవు. నా మెదడు ఆలోచించదు. కుళ్లిపోయి కంపుకొడుతున్న భావ ప్రపంచంలో పొర్లాడడం నాకు ఆహ్లాదకరం. ఇదే నా ప్రపంచం!!           

February 25, 2014

కేసీఅర్‌ని చూస్తే ముచ్చటేస్తొంది!!

కాంగ్రెస్ అనుకున్నది సాధించింది.తెలంగాణాకు జైకొట్టి సీమాంధ్రుల నోట్లో మన్ను కొట్టింది. సరే వారి కోరికమేరకు విభజన చెసినా సీమాంధ్రుల భయాలకు తగిన ధైర్య వచనాలు కూడా చెప్పకుండా తోసిరాజు అనడం కేవలం ఒక్క సోనియాకే చెల్లింది. నాకు కేసీఅర్‌ని చూస్తే ముచటేస్తోంది. పార్టీ్‌కోసం తెలంగాణాకోసం సోనియాను ముప్పుతిప్పలు పెడుతూ తనకోర్కెలన్నీ తీర్చుకుంటున్న కేసీఅర్‌ని చూస్తే ముచ్చటేస్తొంది.   2014 సంవత్సరానికి ఉత్తమ ప్రజా నాయకుడు ఎవరు అని పోటీ పెడితే ఖచ్హితంగాం కేసీఆర్ అని తెలంగాణా ప్రజలే కాదు సీమాంధ్ర ప్రజలు కూడా వోటు వేస్తారు. ఉత్తమ ప్రజా వ్యతిరేక నాయకుడు ఎవరా అని పోటీ పెడితే సీమాంధ్రలో చాలా మంది తన్నుకు చావాలి ఆ స్థానం కోసం. వీళ్ళ మొహాలు మండ.. వీళ్ళు ప్రజా నాయకులా? సిగ్గు శరం అనేవి వీళ్ళలో ఒక్కరికైనా ఇసుమైంతైనా లేవు. విభజనకు అడ్డుపడలేకపోయినా కనీసం సీమాంధ్రాకు కావలసిన వసతులు తెచ్చుకోవడంలో కూడా వీరు ఘోరంగా విఫలమయ్యారు. వ్యక్తిత్వం లేని అనామకులు, పార్టీకి బానిసలు, పదవికి ఈసులు. వచ్చిన అరాకొరా ప్రయోజనాలు కేవలం బీజేపీవల్ల వచ్చాయి. అదికూడా వెంకయ్య నాయుడువల్ల అనే చెప్పుకోవచ్చు. బీజేపీకూడా సీమాంధ్రులను వెన్నుపోటు పొడిచిందనే చెప్పాలి. సుష్మా గారికి చిన్నమ్మగా పిలుపించుకోవాల్నే ముచ్చట వల్లే వారు ఎటువంటి షరతులు లేకుండా తెలంగాణాకు సై అనడం అద్వాణీని కూడా కలవరపరచింది. ఇదంతా సీమాంధ్రుల ప్రారబ్ధం. పార్టీలను అమ్ముకుంటూ, నోటికి నరం, ఒంట్లొ రక్తం, బుర్రలో గ్జ్యానం  లేని నాయకులను ఎన్నుకోవడంవల్ల జరిగిన విపరీతం. శ్రీకాకుళం పల్లెల్లో పెట్టిన 124 సెక్షన్ చెబుతుంది, ఈ నాయలుకు మనల్ని ఏంత కలవరపరిచారో. అక్కడి అల్లరులు చెబుతాయి మనల్ని ఈ నాయకులు ఏంత వంచించారో.   కానీ సీమాంధ్రులు కష్టపడేవారు. ఇదొక్కటి చాలు  మనల్ని మనం నిర్మించుకోవడానికి. ఇప్పుడైనా నోటుకోసం వోటు కాకుండా మన భవిష్యత్ కోసం వోటు వేద్దము. మనకోసం పనిచేయనివారి నడ్డి పగలగొడదాం. పదండి ముందుకు...!! జై ఆంధ్ర....జై తెలంగాణా !!    
       

June 15, 2012

హమ్మయ్య గెలిపించేశాం...ఓ పనైపోయింది!!



ఎలచ్చన్లు అయిపోయాయి...... అనుకున్నదే..ఎర్రిబాగులోళ్ళమంతా గన్‌బాబుని గెలిపుంచుకున్నాము. గన్‌బాబు ఇప్పుడు ప్రజాహోమంలోంచి నూతనంగా జనించిన  సత్శీలుడు. వారి తప్పులనీ ప్రజా "గుండం"లో కాలి ఒప్పులయ్యాయని అవి అస్సలు తప్పులేకావని సదరు పార్టీ వక్తలు చెప్పుకుంటు ఉంటే విని అవునని తలూపడం తప్ప ఎవ్వరూ చేయగలిగింది లేదు. ఇక కాబోయే ముఖ్యమంత్రి వారేనని కూడా ప్రకటించారు. ఇది దేవుడి విజయమని అమ్మగారు చెపితే ఇది కేవలం అన్నగారి విజయమని సోదరి సద్దిచెప్పారు. ఇక ఈ విజయంతో కోర్టులో తప్పులన్నీ ఒప్పులుగా మారిపోతాయని, ఇక గన్‌బాబు బైటకి రావడమే మిగిలిందని ముగించారు. ఇవన్నీ పక్కనబెడితే ప్రబుత్వం పైన అపనమ్మకమే ప్రజలు వారిని పక్కనబెట్టారని చెప్పక తప్పదు. మీరు వందల కోట్లు కాదు వేలకోట్లు తిన్నా పర్వాలేదు కానీ మాకు తాగడానికి గుక్కడు నీళ్ళిస్తే చాలని, చచ్చిపోతుంటే మాకోసం ఒక నాలుగుచక్రాల ప్రభుత్వ వాహనం వస్తే చాలని, ఒకపూట తినడానికి నాలుగు గింజలు చాలని, ప్రస్థుత ప్రభుత్వం అది కూడా చేయట్లేదని ఎలుగెత్తి చెప్పేరు. మరి వారి మాటలు ప్రభుత్వ పెద్దలకు అర్ధమవుతాయా? కానీ గన్‌బాబు గెలిపించుకున్నవారితో లుకలుకలనుండి బైటపడడానికి ప్రభుత్వ పెద్దలతో ఒప్పందానికి వచ్చి,వారితో చేతులు కలిపితే...మళ్ళీ మనం ఎర్రిబాగులోళ్ళమే!!     



June 1, 2012

ఎక్కడో అక్కడ పడనివాడుంటాడా?


"లక్ష కి పడకపోవచ్చు, కోటికి పడకపోవచ్చు, కానీ వందకోట్లు ఇస్తానంటే పడనివాడుంటాడా?" ఇదో సినిమాలోని డైలాగు. సీబీఐ కోర్ట్ జడ్జి పట్టాభిగారి విషయంలో ఇదే జరిగి ఉంటుందా? ఆయన లాకర్లలో దొరికిన డబ్బు కూడా కొంత అనుమానాల్ని దృవీకరిస్తోంది. సుడిగాలి బ్రదర్స్ ( గన్ & గాలి) హస్తవాసి అంత మంచిది కాదని స్పష్టమౌతోంది. వారి చేతిలోంచి ప్రసాదాలు పొందినవాళ్ళెవ్వరూ కూడా సుఖంగా లేరు. చాలామంది జైలుపాలయారు. కొత్తగా మరో వికెట్, అనుకోని వికెట్. తాచెడ్డ కోతి వనమెల్ల చెరిచిందని... వీళ్ళు మింగడమే కాకుండా జనాల్ని ప్రలోభ పెడుతూ వారిని కూడా ఇరకాటంలో పెడుతూ పార్టీల పరువు, కోర్టుల పరువుకూడా తీస్తున్నారు. ఇప్పటికే ఐయేస్ ఆఫీసర్లంటే చులకన భావం వచ్చేసింది. ఇక జడ్జీలకు ఆ పరిస్తితి వస్తే మారింత ప్రమాదకరం. కాబట్టి వీళ్ళని వీఐపీలగా గాక అత్యంత ప్రలోభ పరచలగల వ్యక్తులుగా గుర్తించి  వీరి చాయలకు ఎవ్వరూ రాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తే ఎలా ఉంటుంది? 

May 29, 2012

ఎర్రిబాగులోళ్ళు !!





సీబీఐ ఒక యువకుడిని, కాబోయే ముఖ్యమంతిని అరెస్ట్ చేయించింది. ఏంత అన్యాయం? కక్షగట్టి ఒక తండ్రిలేని పిల్లవాణ్ణి కటకాలపాలు చేస్తారా? ఒక ఆశయంతో  బుద్ధిగా ఎన్నికల్లో పోటిచేసి ముఖ్యమంత్రి అవ్వాలని కలలు కంటున్న ఒక యువకిడిని చెరసాలపాలు చేస్తారా? వారి తండ్రి సెజ్‌ల పేరుతో రైతుల భూముల లాక్కుంటే మాత్రం, వేల కోట్లు సంపాదించుకుంటే మాత్రం అలా జైలుపాలు చేయడం సహించం. జైలులో ప్రత్యేక సదుపాయాలు కల్పించినా, హంసతూలికా తల్పంపై శయనించే ఆయన, అలా ఒంటరిగా జైలు బారాక్‌లో ఒంటరిగా ఉండడం హృదయవిదారకంగా ఉంది. మా మన్సులు సున్నితమని ఎవరు తెలుసుకుంటారు? ఆయనకు ఒక్కరోజు జైలు శిక్ష అంటే మాకు జీవిత శిక్ష. మా ప్రాణాలు తృణప్రాయంగా ఆయనకోసం వదులుకుంటాం. ఆయన వేలకోట్లు కాదు లక్షల కోట్లు సంపదించుకున్నా మేము పట్టించుకోం. ఆయన సుఖంగా ఉండాలి. మేము బాగుపడకపోయినా, మా జీవితాలు బుగ్గిపాలైనా వారిని కష్టబెట్టడం మేం సహించం. మేము ఎల్లవేళలా కష్టాల్లో ఉండాలి, వారు వచ్చి మమ్మల్ని ఓదార్చాలి. వారిని అరెస్ట్ చేస్తే కొన్ని పేపర్‌వాళ్ళకెందుకు అంత సంబరం? ఆయన కష్టాల్లో ఉంటే అయ్యో అనాల్సింది పోయి రాత్రి నిద్దుర పోలేదు , ఉదయాన్నే బ్రెడ్ తిని పాలు తాగారంటూ చానల్స్‌లో వార్తలెందుకు? నయ్యం అంతటితో ఆగేరు. ఎవరు ఎవర్ని దోచుకున్నా మాకు బాధ ఉండదు కానీ వాళ్లు కష్టాలపాలు కావడం మేము సహించం. మేము సున్నిత హృదయులం. వారు బాగుండాలి.  మా ఓటు తప్పకుండా వారికే!!     


    

May 24, 2012

బుర్ర పగిలిపోతోంది బాబోయ్!!

కొంత కాలంగా తెలుగు న్యూస్ చానల్స్ అంటే విసుగొచ్చింది. పేపర్ మాత్రమే చూసేవాళ్ళం. ఇప్పుడు న్యూస్ పేపర్ అన్నా విసుగొస్తొంది. జగన్ అరెస్ట్ అవుతాడా? ఎప్పుడవుతాడు? ఆయన ఆస్తుల్ని జప్తు చేస్తారా? ఆయనకు  అన్ని ఆస్తిపాస్తులు ఎలా వాచ్చాయి? ఈ ప్రశ్నలకు సమాధానం ప్రభుత్వానికి తెలియదా? ఆస్తులని కూడబెట్టడం వైయెస్సార్ ఉన్నప్పటినుండీ ఉన్నదని ప్రభుత్వంలోని పెద్దలకు తెలియదా? అంతా తెలుసు. అది అందరికి తెలుసు. ఇలాంటివాళ్ళు కాంగ్రెస్‌లో మరెవ్వరూ లేరా?    వారు పోగేసుకుంటూ చుట్టుపక్కలవారందరికీ కొద్ది కొద్దిగా విదిల్చిన సంగతి మాత్రమే  సీబీఐ కొద్ది కొద్దిగా బయట పెట్టగలుగుతోంది. మరి వైఎస్సార్ బ్రతికే ఉండిఉంటే కాంగ్రెస్ ఈ అక్రమాలని బయట పెట్టగలిగేదా? జగన్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ ఉంటే సీబీఐ విచారణకు అనుమతించేదా?  వైఎస్సార్ ద్వారా కాంగ్రెస్ పార్టీకి వచ్చిన పార్టీ నిధులెన్ని? పనిలో పనిగా సీబీఐ ఇదికూడా విచారించగలిగితే బాగుంటుంది. అక్రమాలని బయట పెట్టడం హర్షించవలసిన విషయమే. కానీ అది రాజకీయ కారణాలవల్ల జరగడం మ్మత్రమే బాగాలేదు. దేశంలో ఇప్పటికే దోపిడీలు పెరిగిపోయాయి. ఒకక్క సందర్భంలో ఒకక్క పార్టీ తల దించుకుంటునే ఉంది. దానికి తోడు న్యూస్ పేపర్ల మధ్య వైరం విసుగు తెప్పిస్తోంది. వ్యక్తిగత వైరంతొ అసలు విషయం దారి తప్పుతోందేమో అనిపిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ అంటే అక్రమాల పుట్ట అన్న అభిప్రాయం ప్రజలలొ కలుగుతోంది. అన్నా హజారే కార్యక్రమాలకు వస్తున్న ప్రజా స్పందనే దీనికి రుజువు. కర్నాటకలో జరుగుతున్న సంఘటనలు బీజేపీ పైన ఉన్న భ్రమలు కూడా తొలగిస్తున్నాయి. ఒక చదువుకున్న వ్యక్తి, రాజకీయనాయకు కానివాడు ప్రధాని ఐయితే మంచి జరుగుతుందని అనుకున్న ప్రజల ఊహలు తారుమారయ్యాయి. మరి ఏమి ఏమి చెయ్యలి? న్యూస్ పేపర్లు చదవడం కూడా మనెయ్యాలా? చెడు వినకు, చెడు చదవకు. అప్పుడు లోకం ప్రశాంతంగా కనబడుతుందేమో!! ఫేస్‌బుక్‌లో పోస్టింగ్స్ చూసుకుంటూ ఫొటోలు అప్డేట్ చేసుకుంటూ కాలం గడిపేస్తే మంచిదా?  

September 23, 2011

వీళ్ళిద్దరు!!

సకల జనుల సమ్మె బాగానే సా..గుతోంది. జనాన్ని మూకుమ్మడిగ ఎలా ముంచచ్చో పులకేసికి తెలిసినంతబాగా మరెవ్వరికీ తెలియదు. ఎవరి చేత్తో వారికే వాతలు పెట్టుకోవడం చక్కగా నేర్పిస్తున్నాడు. వీరికితోడు నత్తి సత్తిబాబు, ఎల్కేజీ టీచర్. ఇకపై మిలటెంటు కార్యక్రమాలు మొదలు పెట్టాలిట. పైగా గాంధీజి కూడా మిలటెంట్ కార్యక్రమాలు చేశారని చెప్పుకొచ్చారు. అంటే తనని తాను గాంధిజితో పోల్చుకుంటున్నాడేమో? ఖర్మ. మొత్తం మీద చాలావర్గాల్ని సమ్మెలో భాగస్తులని చేశారు. మొదటగా టీచర్లని చెప్పుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగుల్లో మొట్టమొదటి ఏబ్రాసులు వీళ్ళే(ప్రాంతీయ బేధం లేకుండా). అత్యంత తక్కువ సమయం పని చేస్తూ మొత్తం కాలానికి జీతం తీసుకొనే ఒక వర్గం. ఒకప్పుడు ఉపాధ్యాయుడు అంటే ఒక గౌరవం, భయం ఉండేది. ఇప్పుడు కేవలం చులకన, అసహ్యం(క్షమించాలి తప్పదు). ఇక తరువాత రెవెన్యూ తదితర విభాగాల ఉద్యోగాలు. వీరిలో ఎంతమంది బల్లకింద చేతులు పెట్టకుండా పని చేస్తారంటారు? ఎన్ని కధలు వినలేదు, ఎన్ని సినిమాలు చూడలేదు. అందులో సెక్రటేరియట్. వీరి నాయకుడు ప్రభుత్వాన్ని వందసార్లు ఉరి తీయాలని అన్నారు. పిల్లి గుడ్డిదైతే అన్న సామేత గుర్తుకొచ్చింది. మిగిలిన వారిలో ఒకటో తారీకుకి జీతాలు రాకపోతే ఎంతమంది తాట్టుకోగలరో తెలియనిది కాదు. ఇక అసహ్యకరంగా పురోహితులు, డాక్టర్లు సమ్మె చేయడం. వీళ్ళకి ఏమి పోయికాలం వచ్చింది. సర్వే జనాహ్ సుఖినో భవన్‌తు అని ఆకంక్షించే వర్గం దేవుడి ధూప దీప నైవేద్యాలు మానేసి క్రికెట్ ఆడడం!! అది ఖచ్చితంగా విపరీత పోకడలే. పోయేకాలం దాపురించినవాడికి మంచి చెడు తెలియదు అన్నట్టు ఉంది వీరి తీరు. భగవంతుడి తరువాత అంతటి స్థానం డాక్టర్లది. ముక్కుకి మసి రాసుకొని ఎప్పుడు సమ్మె చేద్దామని ఎదురుచూసే సిబ్బంది హైదరాబాదు ప్రభుత్వ డాక్టర్లు. డ్యూటీలు ఎగ్గొట్టి సొంత ప్రాక్టీసు చేసుకోడానికి మంచి తరుణం. మొత్తం మోద వీళ్ళందరూ యుద్ధం ప్రకటించింది తెలంగాణా ప్రజలమీద. వాతలు పెడుతున్నది తెలంగాణా ప్రజల వంటిమీద. ప్రత్యక్ష నరకాన్ని అనుభవిస్తున్నది తెలంగాణా ప్రజలే. ప్రత్యేక రాష్ట్రం వస్తే భూతల స్వర్గమే అంటూ అందరినీ నమ్మించిచ ఘనత పులకేసిదే. నిజమేగాబోలు అనుకొని ప్రజలు ఇన్ని కష్టాలు పడుతున్నారు. ఎలా ముగుస్తుందో మరి?