December 30, 2009

తెలంగాణా పులకేసికి "బందుమిత్ర" బిరుదునివ్వాలి!!


ప్రస్తుతం తెలంగాణాలో బందుల పర్వం కొనసాగుతోంది. తెలంగాణాపై సష్టమైన ప్రకటన వెలువడేదాకా ఈ పర్వం కొనసా.....గుతుందని నాయక గణం అంటోంది. బందులో ప్రజలు, వ్యాపారవేత్తలు, విద్యాసంస్థలు, ఉద్యోగులు, స్వచ్చందంగా పాల్గొంటున్నారని సదరు నాయకులు చెపుతున్నారు. స్వచ్చందముగ అంటే భయముతో అని అర్ధం చేసుకోవాలిగాబోలు. విద్యాసంస్థలపైనా, చిన్నపిల్లలతోవెడుతున్న స్కూల్ బస్సులపైన కూడా ముష్కరులు కొన్ని రోజులముందే దాడి చేయడంతో విద్యాసంస్థలు మూసివేయక తప్పని పరిస్తితి. అందుకే వారు స్వచ్చందముగా బందులో పాల్గొన్నారు. ఎన్నొ వ్యాపార సంస్థలపైన కూడా దాడిచేసి దోచుకున్న సంఘటనలు కూడా జరిగాయి. అందుకే వారుకూడా స్వచ్చందముగా దుకాణాలు మూసి స్వచ్చందముగా బందులో పాల్గొన్నారు. ఇక ప్రభుత్వముకూడా స్వచ్చందముగా బందులో పాల్గుంటోంది. ఎందుకంటే ఆర్టీసీ నష్టాలు భరించే స్థితిలో లేదు లాభాల మాట దేముడెరుగు, సంస్థ ఆస్తులే హరించిపోతున్నాయి కాబట్టి వారుకూడా స్వచ్చందముగా బందులో పాల్గొన్నట్టే. ఇక రైల్వేలు కూడా తమ రైళ్ళను నిలుపు చేసి తెలంగాణాకు అనుకూలంగా బందులో పాల్గొన్నయని భావించవచ్చు.

కానీ ఇన్ని సంఘటనలు జరుగుతున్నా టీవీ చానల్స్ మూగనోముతో కేవలం స్క్రోలింగ్‌లతో సరిబెట్టుకోవలసిన పరిస్తితి వచ్చింది. పాపం హైకోర్టు వారి మైకు, కెమేరాలను కొంత అదుపులో ఉంచమని ఆదేశించడమే దీనికి కారణం.అంతేకాకుండా వారి ప్రసారాలపై కొంత నిఘా ఉంచమని పోలీసులకు కూడా అదేశాలు ఇచ్చింది. లేకపొతే వారంతా వీరావేశంతో "జజ్జనకరి జనారే" అంటూ చిందులేసేవారు.

ఇన్ని విపరీతాలకి కారణమైన మన పులకేసిగారికి ఈ సందర్భములో ఒక బిరిదునిచ్చి సత్కరించాలని నా కోరిక. దానికి నేను రెండు పేర్లను ఎంపిక చేసాను. మొదటిది "బందుమిత్ర" రెండోది "బందోపాధ్యాయ". వీటిల్లో ఎక్కువ మంది ఎంపిక చేసిన పేరును వారికి బిరుదుగా ప్రదానం చేయవచ్చు.

ఇక తెలంగాణా విషయానికి వస్తే (అమాయక) విద్యార్ధులు, ప్రజలు విభజనవల్ల తమకు ఉద్యోగాలు వస్తాయని తమ బ్రతుకులు మెరుగవుతాయని భావిస్తూ ఉద్యమాలు చేస్తున్నారు. ఓయూలో మెస్‌లు మూసివేసినప్పుడు తమకు భొజన ఏర్పాటు చెయమని విద్యార్ధులు రాజకీయ నాయకులను అడిగారని ఒక బ్లాగులో చదివాను. ఇలాటి సంఘటనలు ఎవరినైనా కదిలిస్తాయి. కానీ ఒక విషయం, ప్రభుత్వ ఉద్యోగాలు ఆంధ్రావారిని పిలిచి ఇచ్చెయ్యలేదు. పోటీ పరీక్షలలో ఎంపికైనవాళ్ళకే ఇచ్చారు. ఒకవేళ తాము మిగిలినవారితో పోటీపడలేమనుకున్నప్పుడు దానికొక పరిష్కార మార్గాన్ని చూడవలసిన అవసరం ఉంది. ప్రజలు నిజంగా తాము వెనుకపడ్డామని భావిస్తున్నప్పుడు కూడా నిజానిజాలు తెలుసుకొని పరిష్కరించవలసిన బాధ్యత ప్రభుత్వానిదే. ఇరుపక్షాలకు నష్టం లేనివిధంగా సమస్యను పరిష్కరించాలి. వృద్ధ జంబూకాలకు వేదికగా మారిన జేయేసీ దృష్టి రాబోయే పదవులపైనే ఉంది అన్నది సుస్పష్టం. కూర్చుంటే లేవలేని ఒక నాయకుడు అయితే గియితే వచ్చే తెలంగాణాకు ముఖ్యమంత్రి పదవి తనకు ఇస్తామని ఎవరో మాటిచ్చారట ఆయన తిరస్కరించారుట. వీరి మాటల్లో ప్రజాభావాలకన్న పార్టీ భావాలే వ్నిపిస్తున్నాయి. రాజకీయ నాయకుల ప్రాతినిద్యం లేని నిజమైన ప్రజాప్రముఖులను కూర్చొబెట్టి సమస్యను పరిష్కరించగలిగితే బాగుండును. కానీ అలా జరగడానికి అవకాశం ఉందా?

December 24, 2009

తెలంగాణా పులకేసికి మరో పూనకం


మాటలు మర్చేవారిని రాజకీయ నాయకులతో ఎందుకు పోలుస్తారో నాకిప్పుడు అర్ధమైంది. తెలంగాణాపై మొదటిసారి చిదంబరం ప్రకటన చేసినప్పుడు అధీష్టానం అదేశాలకు పార్టీలోని ఎమెల్యేలు ఎంపీలందరూ కట్టుబడిఉండాలని తెలంగాణా కాంగ్రెస్‌కు చెందిన నేతలందరూ సీమ ఆంధ్ర నాయకులకు విజ్గ్నప్తి చేసారు. కానీ రెండోసారి చిదంబరం ప్రకటన వెలువడినతరువాత అదే ఎమెల్యేలు, ఎంపీలు రాజినామలు సమర్పించి టీఆరెస్‌తొ చేతులు కలిపారు. మరి దీనినే "తనది కాకపొతే తాడిమట్టకు ఎదురు డేకమని" అనడం అన్నమాట.

ఇక ఆంధ్రాలో బంకర్లు నిర్మించవలసిన ఆవశ్యకత కనబడుతోంది. ఎందుకంటే పులకేసి అణువిస్పోటం జరుగుతుందని హెచ్చరించారు కదా అందుకు. చిదంబరం ప్రకటన చేసిన తరువాత పులకేసిని రెండోసారి ఉద్యమం మొదలుపెడుతూ ప్రజలకు కొన్ని సూచనలు చేసారు. ఉద్యమమకారులంతా శాంతియుతంగా ఉండాలని. వారిమాటలను ఉద్యమకారులు "తెలంగాణకడ్డొస్తే అడ్డంగా నరికేస్తాం" అని అరుచుకుంటూ నలభై బస్సులను నాశనం చేసి నాలుగు బస్సులు తగులబెట్టి ఆచరించి చూపారు. తెలంగాణాలోని నాయకులంతా రాజీనామాలు చెయ్యాలని పులకేసి వినమ్రంగా కోరారు. అందుకే రాజీనామా చేయని నాగం జనార్ధన రెడ్డిపైన మరికొందరిపైనా ఉద్యమకారులు పిడిగుద్దులు కురిపించారు. ఉద్యమం చేస్తున్నంతసేపూ వారెవరైనా విద్యార్ధులే. ఒకవేళ ఖర్మకాలి దొరికిపొతే వారు విద్యార్ధులుగానీ టీఆరెస్ కార్యకర్తలుగానీ కారు. అరాచక శక్తులు. ఇంకాచెప్పాలంటే ఆంధ్రోళ్ళు అయిఉండవచ్చు. కాబట్టి విద్యార్ధులకు ఈ విషయంలో కొంత జాగ్రత్త అవసరం.

ఇక మీడియాకు మళ్ళీ పండగ వాతావరణం వచ్చింది. సీమ ఆంధ్రా ప్రాంతాలలోని ఉద్యమాలు ఇష్టం లేకున్నా చుపించవలసి వచ్చినందుకు చాలా బాధ పడ్డారు. మళ్ళీ తెలంగాణా ఉద్యమం ఊపందుకున్నందుకు వారు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఏ ఒక్క బస్సు దహనంగానీ నాశనంగానీ వారి కనుసన్నలు దాటి పోకుండా వారు ప్రసారం చేయగలుగుతున్నారు. నాగం జనార్ధనరెడ్డిపై దాడిని మళ్ళి మళ్ళి చూపిస్తూ మిగిలినవారిని బెదరగొట్టడమే వారి ధ్యేయంగా కనబడుతోంది. ఓ.యూ.లో కవరేజి నిమిత్తం వెళ్ళిన విలేకరి ఆంధ్రా వాడనిచెప్పి అతనిపై దాడి చేసారు.


మరో పక్క ప్రజలు భీతావహులు కావడమే కాకుండా బందులవల్ల రాష్ట్రంలో మూతబడుతున్న ప్రభుత్వ ప్రయివేటు సంస్థలు తేరుకోలేకుండా ఉన్నాయి. ప్రభుత్వ సంస్థలు కొంత పర్వాలేదు. కానీ ప్రయివేటు సంస్థలు? సరియైన ఆర్డర్లు రాక, వచ్చిన ఆర్డర్లను చేయలేక సంస్థలు మూతబడే అవకాశం ఉంది. ఈ అరాచక పరిస్తితి రాష్ట్రానికి తలమానికంగా తయారైన సాఫ్ట్వేర్ సంస్థలను చుట్టుముడితే రాష్ట్రంలో దాదాపు మూడు లక్షలమంది ప్రత్యక్షంగానూ రెందు లక్షలమంది పరోక్షంగానూ నిరుద్యోగులయ్యే ప్రమాదముందని నిపుణులు చెపుతున్నారు. మరి ఈ విషయంపై పులకేసిని ప్రశ్నిస్తే వారు చార్మినార్ లేదా గోల్కొండల దగ్గిర దుప్పటి పరుచుకోమనిగానీ తెలంగాణా చరిత్ర చెప్పుకుంటూ గైడ్‌గ పనిచేసుకోమనిగానీ చెపుతారేమో?

ఏది ఏమైనా రాష్ట్రంలోని పరిస్తితులు రాష్ట్రపతి పాలనకు దారి తీస్తున్నాయని చెప్పకనే చెపుతున్నాయి.

December 22, 2009

లగడపాటి ప్రెస్ మీట్‌లో మీడియా మిత్రుల అసహనం



అత్యంత నాటకీయంగా జరిగిన లగడపాటి అదృశ్యం ఆయన నింస్‌లో ప్రత్యక్షం కావడంతో ముగిసింది. నింస్‌లో ఆయన ఒకరోజు దొంగ దీక్ష (లగడపాటే అన్నారు) ముగించుకొని హైదరాబాదులోని ప్రెస్ క్లబ్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. తెలంగాణాకు సంభందించి ఏదో ప్రకటన చేస్తారనుకొని ప్రత్యక్ష ప్రసారాలు ఏర్పాటు చేసుకున్న చానల్ మిత్రులందరూ ఆయన చెప్పిన విషయాలు విని చాలా అసహనానికి గురయ్యారు. తనకు పంధొమ్మిదో తేది రాత్రి కోర్టు ఆదేశాలపై శరీరానికి కావల్సిన పోషకాలను (ఐవీ) ఎక్కించారని నైతికంగా తన దీక్ష భగ్నం ఐనట్టుగా భావించానని కానీ తనను హైదరాబాదు రానీకుండా కొంతమంది అడ్డుకోవడం వల్లే పట్టుదలతో హైదరాబాదు వచ్చి నింస్‌లొ చికిత్స తీసుకున్నట్టు చెప్పారు. తాను ఐదు రోజుల ఏడు గంటలు నిజాయితీగా దీక్ష చేశానని మిగిలిన రెండు రోజులు దొంగ దీక్షేనని ఐవీలు తీసుకుంటూ ఎన్ని రోజులైనా దీక్షలు చేయవచ్చని కానీ ఇలాటి దొంగ దీక్షలగురించి ప్రజలకు మీడియాకు తెలియచెప్పడానికే చేశానని పరోక్షంగా కేసీఅర్ చేసిన దీక్షను ఉటంకిస్తూ చెప్పారు.

కేసీఅర్ ప్రస్తావన వచ్చినప్పుడు మీడియా మిత్రులు చాలా అసహనానికి గురయ్యారు. వారు వెంఠనే లగడపాటి ప్రసంగానికి అడ్డుతగులుతూ ప్రశ్నలు సంధించడం మొదలుపెట్టినప్పుడు. లగడపాటి ఇది నేను పిలిచిన ప్రెస్ కాన్‌ఫరెన్స్ కాబట్టి తాను చెప్పింది వినాలని ఇతర (కేసీఅర్) వ్యక్తులకు గంటలకొద్దీ సమయం కేటాయించి తనకు కొద్దిసేపు సమయం కేటాయించలేనివారు వెళ్ళిపోవచ్చని, తాను ఎవరిని భయపెట్టి తీసుకురాలేదని ఇష్టంలేని వారు వెంఠనే వెళ్ళిపోవచ్చని నిర్మొహమాటంగా అన్నాకాగానీ విలేకరులు సద్దుమణగలేదు.

చానల్స్ అన్నిటికన్న టివీ-9 నుండి మురళీ కృష్ణ కాస్త అతి చేయడం స్పష్టంగా కనిపించింది. లగడపాటి నింస్‌లో చేరడానికి వచ్చినప్పుడు అక్కడినుండీ ప్రత్యక్ష ప్రసారం వివరాలు అందిస్తూ లగడపాటికి లోపల చికిత్స చేస్తున్నారని "లగడపాటికి నింస్‌లో ఏలా చికిత్స చేస్తారో ముఖ్యమంత్రి మీడియాకు చెప్పాలి" అంటూ డిమాండ్ చేశాడు. ఇది ఒక రకంగా అతడు తన పరిధిని దాటి చేసిన వ్యాఖ్యానం. లగడపాటికి నింస్‌లో చికిత్స ఎందువల్ల నిరాకరించాలో అతడు చెప్పగలడా? ముఖ్యమంత్రి మీడియాకింద పనిచేసే వ్యక్తి కాదు. మైకు చేతిలో ఉందికదానని నోటికొచ్చినట్టు మాట్లాడటం సరికాదు. బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నప్పుడు వ్యక్తిగత అభిప్రాయం పక్కనబెట్టి బాధ్యతగా మెలగాలి. మనము చెప్పింది జనము వినక చస్తారా అని అనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది.

December 20, 2009

తెలంగాణా పులకేసితో ప్రత్యక్ష ప్రసారం


తెలంగాణా పులకేసి గారితో టీవీ-99 నిన్న ప్రత్యక్ష ప్రసారం చేసింది. తెలంగాణా దేశం ఏర్పడిందని ఆ దేశమున ఉండగోరే ప్రజలు ఏ విధమున ఉండాలో కొన్ని నియమాలు సూచనప్రాయమగా పులకేసిగారు తెలియచేశారు. తెలంగాణా సంస్కృతిని ప్రజలందరూ గౌరవించాలని చెప్పారు. కానిఎడల ప్రజలు తెలంగాణా బహిష్కరణ జరుగుతుందని పులకేసి తెలియచేశారు. కాబట్టి ప్రజలందరూ తెలంగాణా మాండలికంలోనే మాట్లాడటం నేర్చుకోవాలి. దంచుడు, సచ్చుడు, భాగో, కుక్కలు, ద్రోహులు, విద్రోహం, ఆంధ్రోళ్ళు లాంటి పదాలు ప్రతీ వాక్యంలోనూ ఉండే విధంగా జాగ్రత్త పడాలి. ఆంధ్రోళ్ళను ప్రతి మాటలొనూ దోపిడీదారులని తిడుతూ ఉండాలి. బతుకమ్మ ఆడటం నేర్చుకోవాలి. జొన్న సంకటి మాత్రమే తినాలి. ముఖ్యంగా తెలంగాణా చరిత్ర తెలిసి ఉండాలి. ఇవన్నీ చేస్తే మీరు తెలంగాణా పౌరులుగా ఉండడానికి అర్హత సంపాదించినట్టే. పులకేసిగారు మరో విషయం కూడా చెప్పారు ఉపాధి అవకాశాలకన్న కూడా సంస్కృతికే ప్రాధాన్యమని. హైటెక్ సిటీ కన్నా చార్మినార్, గోల్కొండ లకే ప్రాధాన్యమని. మరి ప్రజలకు ఉపాధి అవకాశాలు ఎలా కల్పిస్తారో? చార్మినార్, గోల్కొండల దగ్గర ప్రజలను అడుక్కుతినమంటారా? కొంతమంది అమాయకులు అమెరికా, బొంబాయి లాటి సుదూర ప్రాంతాలనుండి వీరిని ఫోన్‌లో కొన్ని ప్రశ్నలు అడిగేరు. సమాధానాలు చెప్పలేని పులకేసి వారిని ఆంధ్రా పొగరుతో మాట్లాడవద్దని తిట్టిపోశారు. వీరి రెండుమాటల ధొరిణి ప్రతీమాటలోనూ కనిపించింది. అభివృద్ధి, ఉద్యోగ అవకాశాలకు తమ దేశ ప్రజలు నోచుకోవడంలేదంటూనే అమెరికాలో స్థిరపడిన వారిలో అరవై శాతంమంది తెలంగాణావారేనని చెప్పుకొచ్చారు. తమదేశంలో ఎంతోమంది ఇంజనీర్లు, ప్రోగ్రామర్లు ఉన్నారని వారిసాయంతో దేశాభివృద్ధి చేస్తామని అన్నారు. ఆంధ్రోళ్ళు దొంగలు దోపిడిదారులనే వీరు కాకినాడవారితో వియ్యం పొందామని అన్నారు. తమ సంస్కృతి గొప్పదని ఇతరులని గౌరవిస్తామని చెప్పుకొనే వీరు కాంగ్రెస్ వాళ్ళని కుక్కలుగా సంభొదించిన విషయంగానీ బాబును నీతి జాతీ లేని మనిషి అన్నది కూడా తానేనన్న విషయం పులకేసి మర్చిపోయారు. మొత్తంమీద ఆంధ్రోళ్ళమీద నిలువెల్ల ద్వేషాన్ని పురిగొల్పుతున్న ఈ పులకేసి తెలంగాణాను ప్రత్యేక దేశంగా చేసి ఆధిపత్యం చేయాలనే కాంక్ష నిలువెల్లా కనిపించింది. ఈ కార్యక్రమం చూసాకా నాకొక్కటే అనిపించింది తెలంగాణాను ప్రత్యేక రాష్ట్రంగా కాక ప్రత్యేక దేశంగా చేసి దానికి ఈ పులకేసిని చక్రవర్తిగా ప్రకటించి వీలైతే ఆ ముక్కను దేశంనుండీ దూరంగా జరిపేస్తే బాగుంటుందని. టీవీ-99 లాంటి చెత్త చానల్స్ ఏక పక్షంగా చేస్తున్న ప్రసారాలకు వీలైనంతవరకు దూరంగా ఉండడం చాలా శ్రేయస్కరం.

December 16, 2009

రోశయ్యగారి బుజ్జగింపులు ఆంధ్ర మంటలను చల్లార్చవు

రోశయ్యగారు మొత్తానికి మంత్రివర్గాన్ని బుజ్జగించి ఒకచోట కూర్చోబెట్టగలిగారు. మంత్రివర్గంలో విబేధాలు లేవు అన్న సూచన రాష్ట్ర ప్రజలకు తెలియచేయడానికట. మంత్రివర్యులు గీతారెడ్డి చక్కగా ముస్తాబై మంత్రివర్గ బేఠీ జరిగిందని ఇక పరిపాలనపై దృష్టి సారిస్తుందని ఇక ఎలాంటి సమస్యలు లేవన్న బిల్డప్ ఇచ్చారు. కాని నిప్పుని దుప్పట్లో దాచి ఉంచితే దుప్పటి కాలడం ఖాయం. ఈ బుజ్జగింపు కేవలం ప్రధాని చేసే ప్రకటన వరకే. ఇరువర్గాలను సంత్రుప్తి పరచడం అనేది జరిగే పని కాదు. హైదరాబాదును రెండు రాష్ట్రాలకు ఉమ్మడిగా ప్రకటిచడంగానీ కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించి బుజ్జగించడానికి కొంతవరకు అస్కారం ఉంది. ఇక చిరంజివి కూడా సమైక్య ఆంధ్రా నినాదంతో బైటికి వచ్చారు. ప్రజల అభిష్టానికి ఎవరైనా తల ఒగ్గక తప్పదు. పార్లమెంటులో జగన్ తెలుగుదేశం నాయకులతో చేతులు కలిపి సమైక్య ఆంధ్ర ప్లకార్డు చూపించినందుకు ఆయనపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని తెలంగాణా ఎంపీలు అక్రోసిస్తున్నారు. జగన్ చేతులు కలిపింది సాక్షాత్తూ పార్లమెంట్ సభ్యులతోనేగానీ విదేశీ శక్తులతో కాదు. ఇక జై ఆంధ్రా ఉద్యమానికి వ్యతిరేకంగా శాయశక్తులా ప్రయత్నిస్తున్నది ఎలక్ట్రానిక్ మీడియాలోని కొన్ని వార్తా చానల్స్.తెలంగాణా నాయకుల ప్రసంగాలకు ఇస్తున్న సమయముగానీ ప్రాముఖ్యము గానీ ఆంధ్రా ఉద్యమ నాయకులకు ఇవ్వడంలేదన్నది సుస్పష్టం. చిరంజీ జై ఆంధ్రా అన్నందుకు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ కన్న తెలంగాణలో పీఆర్పీ చీలిపోతున్నది అన్నదానిని పెద్ద పెద్ద అక్షరాలతో చూపిస్తున్నారు. పీఆర్పీకి తెలంగాణాలో ఉన్నది కేవలం రెండు సీట్లు. గుడ్డికన్ను మూసినా తెరిచినా ఒక్కటేనని వీరికి తెలియదా? చర్చలలోగానీ న్యూస్ ఇవ్వడంలోగానీ వారి వక్రబుద్ధి బైట పెట్టుకుంటున్నారు. కేసీఅర్ దీక్ష చేస్తున్న పదకొండు రోజులు స్క్రీన్‌పై సగం ఆయన ఫొటో ప్రసారం చేసారు.మరి ఆంధ్రా యూనివర్సిటీ, విజయవాడలలో ఎంతోమంది దీక్షలు చేస్తూ ఎంతోమంది అస్వస్తులవుతున్నారు. ఆంధ్రలో అగ్నిగుండాలు రగులుతూంటే అందాలభామల పోటీలను గంటలకొద్దీ చుపిస్తున్న ఈ చానల్స్ యొక్క యాజమాన్యాలు మేల్కొనాలి. ఇలాంటి చానల్స్‌ను ఆంధ్రా రాయలసీమ ప్రాంతాలలో నిషేధించి కేబుల్ ఆపరేటర్లు ఆ చానల్ ప్రసారాలను నిలిపివేస్తే టీఅర్పీ రేటింగ్స్ తగ్గి ఆదాయం రాక చానల్స్ మూసుకోవలసిన పరిస్తితి వస్తుంది. కాబట్టి వార్తా ప్రసారాలలో ప్రజా వాణికి ప్రాధాన్యం ఇవ్వాలి. సమస్య ఏదో ఒకనాడు పరిష్కరించబడుతుంది. కానీ మీరు ఎప్పటికీ ప్రజలమధ్య ఉంటారన్న విషయం గుర్తుంచుకోవాలి.

December 12, 2009

హరి రామ జోగయ్యా నువ్వు మూసుకోవయ్యా...


హరి రామ జోగయ్య అంటే చాలు అస్తిరత్వానికి మారుపేరని ఆంధ్రాలో అందరికి తెలుసు. ఎనభై ఏళ్ళ వయసులో కూడా పార్టీలు మారుతూ వారి చపల బుద్ధిని చాటుకున్నారు. వీరికి కులగజ్జి కూడా ఎక్కువే. అందుకే చిరంజీవి పార్టీ పెడుతున్నాడనగానే వారు కాంగ్రెస్ను విమర్శించడం మొదలుపెట్టీ మరుక్షణం పీఅర్పీలో చేరేరు. చిరంజీవి పాలకొల్లులో ఓడిపోవడంలో వీరి పేరు ప్రఖ్యాతులు కూడా పనిచేశాయి. వీరు పాదం మోపగానే పీఅర్పీకూడా అప్రతిష్ట మూటగట్టుకుంది. అటువంటి ఈ మహా నాయకుడు ఆంధ్ర రాయలసీమ ప్రజల సమైక్య నినాదాన్ని తుమ్మితే ఊడిపోయే ముక్కుతో పోల్చారు. ఇంత వయస్సు వచ్చినా వీరికి ఆ దేముడు స్థిరత్వాన్నే కాదు గ్జ్యానాన్ని కూడా ఇవ్వలేదు. వేలాది ప్రజలు వందలాది నాయకుల మనోభావాలకు అద్దం పడుతున్న ఉద్యమం వీరి కంటికి కనిపించలేదంటే వీరు గుడ్డివారుకూడా అయిఉండవచ్చు. వీరు కొన్ని తీర్మానాలు చేసారు. విశాఖ రాజధాని చేయాలిట, గుంటూర్‌లొ హైకోర్టు పెట్టాలిట ఇంకా ఎవేవో చెప్పారు. మరి వీరికి ఎవరు ఉద్యమ నాయకత్వం ఇచ్చారో లేక ఎవరు సలహా అడిగారో? వీరి పిచ్చి ప్రేలాపలన్లు మరింత ముదరకముందే అక్కడి ఉద్యమకారులు విరిని ఏదైనా ఒక మానసిక చికిత్సాలయంలో చేర్పించాలని నా మనవి.

జై సమైక్య ఆంధ్రా...! !

రోశయ్యా ఇదేమిటయ్యా?

అయ్యా రోశయ్యగారూ...సమైక్య ఆంధ్రా నినాదంతో కోస్తా రాయలసీమ ప్రాంతాలు మారుమోగిపోతున్నాయి. మీ సొంత పార్టీ ఎంఎల్ఏలు డబ్భై ఐదు మంది రాజీనామాలు చేశారు. మరో ఇరవై మంది మంత్రులుకూడా రాజీనామాలు చేయడానికి సిద్దపడుతున్నారు. మరి మీ సంగతేమిటి? తమిళనాడు, కర్నాటక గుంటనక్కలు రాష్ట్రాన్ని మీకు తెలియకుండానే ముక్కలు చేయాలని చూస్తున్నాయి. ఆపాటి ప్రాంతీయ అభిమానం మీకు లేదా? ఎవరి స్వార్ధం వాళ్ళు చూసుకుంటున్న ఈ సమయంలో సమైక్యతకోసం ఆంధ్ర రాయలసీమ ప్రజల పోరాటం సబబు కాదా? మీరు ఎంతో కాలంగా రాజకీయలలో ఆరితేరిన వ్యక్తి. ప్రజల మనొభావాలు మీకు అర్ధం కాలేదా? మీరూ ఒక ఆంధ్రుడే, తరువాతే ముఖ్యమంత్రి. మీ పదవికి మీ పెద్దరికానికి మీ పార్టీపెద్దలే గౌరవం ఇవ్వనప్పుడు మీరు మీ ప్రతినిధుల స్వరాన్ని నిర్భయంగా ఢిల్లి కి తెలియచేయండి. మంత్రివర్యులు రాజీనామాలు చేస్తే మీ పదవి నుండీ మీరెలాగూ తొలగక తప్పదు. అది జరిగేలోగా మెజారిటీ ప్రజల మనోభావాన్ని ఢిల్లీ పెద్దలకు తెలియజేసి సగర్వంగా మీ రాజీనామాను కూడా తెలియచేస్తే ఢిల్లీ దిగిరాక తప్పదు. అప్పుడు ఆంధ్రా ప్రజలు మిమ్మల్ని ఎప్పటికీ మరువరు.

జై సమైక్య ఆంధ్రా !!


December 11, 2009

జై సమైక్య ఆంధ్రా నినాదంతో డిల్లీ పీఠం కదలాలి !!

ప్రశాంతంగా ఉండే ఆంధ్రాలో ఇంత చలనం కలిగించిన సంఘటన దాదాపు లేదనే చెప్పాలి. ఆంధ్రా రాయలసీమ ప్రజల సమైక్య నినాదం వింటూ ఉంటే నేను చదువుకున్న స్వాతంత్ర్య పోరాట సంఘటనలు గుర్తుకువచ్చాయి. సమైక్య నినాదం తొ వారి అరుపులు ఇంపుగా వినిపిస్తున్నాయి. వారి అరుపుల్లో నాకైతే దేశభక్తే కనిపిస్తోంది.కేసీఅర్ పదకొండురొజుల్లో సౄష్టించిన పరిస్తితి ఆంధ్రులు గంటలో సృష్టించారు. మహాత్ముల ప్రతిమలకు తెలంగాణాలో జరిగిన అవమానాలను పాలాభిషేకం చేసి తుడిచివేశారు. విద్యార్దులను ఎవ్వరూ మభ్యపెట్టలేదు, కార్మికులను ఉద్యమం చేయండని కోరలేదు, నాయకులను చంపుతామని బెదిరించలేదు అందరూ సమైక్య ఆంధ్ర దేశంకోసం అడుగు వేసారు. దానికి ప్రారంభం విజయవాడలో రాజ్‌గోపాల్‌తొ ప్రారంభమైనా సీమ నాయకులు ముందువరుసలో ఉన్నారు. పదవులను తృణప్రాయంగా త్యజించారు. పిచ్చి ప్రేలాపనలు లేవు. హెచ్చరికలు లేవు. అందరిదీ ఒక్కటే నినాదం సమైక్య ఆంధ్రా.

ెలంగాణా వేర్పాటులో ఎన్నో రాజకీయ కోణాలు. కనీసం రాష్ట్ర ముఖ్యమంత్రికి సైతం తెలియకుండా తెలంగాణా ప్రకటన రాష్ట్రప్రజలను, ప్రజలచే ఎన్నొకోబడిన ప్రతినిధులను అవమానపరచడమే. చిదంబరం చెప్పిన సాకు "ఆంధ్ర ప్రజల పాలనలో తెలంగాణాకు న్యాయం జరగలేదు, అందుకే ప్రత్యేక తెలంగాణా". చిదంబరానికి తెలుసా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తరువాత ఎక్కువ కాలం అధికారంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని? మరి కాంగ్రెస్ పార్టీ ఏమి చేసింది? ఆ అప్రతిష్ట వారిదేనని తెలియదా? ఒక ప్రాంతం అభివృద్ధి కాకపొతే ప్రత్యేక పేకేజ్ ఇవ్వచ్చు. వందకోట్లు కాకపొతే వెయ్యి కోట్లు ఇవ్వచ్చు. అంతేకాని రాష్ట్రాన్ని ముక్కలు చేస్తారా?


ఎంఎల్‌యేలు కాదు ఎంపీలు కూడా రాజీనామాలు చేయాలి. అధీష్టానం చెప్పిందే వేదం అంటూ కూర్చుంటే ప్రజల ఆగ్రహాన్ని చవి చూడకతప్పదు. కేంద్ర ప్రభుత్వం విభజనపై పునరాలోచించకపొతే ప్రభుత్వం ఒక్కరోజు మనుగడలో ఉండడానికి వీలు లేని పరిస్తితి కల్పించాలి. పంటలు పండించేది మనం, టాక్సులు కట్టేది మనం. ఆ ఫలాన్ని రాష్ట్ర ప్రజలందరూ అనుభవించారు. ఒక్క మాటతో మన రాష్ట్రంలోనే మనం పరదేశీలం అవ్వడం ఏ ఆంధ్రుడు ఒప్పుకోడు. ఈ ఉద్యమం కొనసాగాలి. వారి చేసిన తాప్పు వారు తెలుసుకొనే దాకా కొనసాగాలి.

జై సమైక్య ఆంధ్రా!!

December 9, 2009

జై తెలంగాణా అనకపోతే చంపేస్తారా?

కేసీఆర్ (ఆమరణ)దీక్ష పదకొండవ రోజుకు చేరింది. ఆయనను గ్లూకోస్ మీద దాక్టర్లు బ్రతికిస్తున్నారు. ఆయన ఇప్పుడు విద్యార్ధులు వారి పార్టీవాళ్ళూ ఇంటివారూ ఎవరు చెప్పుతున్నా దీక్ష విరమించడానికి నిరాకరిస్తున్నారుట. కారణం ఒక్కటే అయిఉంటుంది దీక్ష విరమిస్తే ఉద్యమంలో తన పాత్ర కేవలం ఉత్సవ విగ్రహమే అవుతుందని. కానీ ఇది కోరి ప్రాణాలమీదకు తెచ్చుకోవడమే.

ఇక తెలంగాణా ప్రజా వేదిక అనుకుంటా తెలంగాణాలో పదవులలో ఉన్న నాయకులంతా రాజీనామాలు చేయాలి లేకపొతే వారి ప్రాణాలకు తమ హామీ లేదని ప్రకటించారు. పైగా విద్యార్ధులు చూస్తూ ఊరుకోరని ముక్తాయింపు. రాజీనామాలు చేయకపొతే చంపేస్తారా? ఇది కోరి తగువులు పెట్టుకోవడమే. దానికి మంత్రివర్యులు దానం నాగేందర్ కటువుగానే సమాధానం ఇచ్చారు. ఆయన వెలుబుచ్చిన అభిప్రాయమే హైదరాబాదులో స్థిరపడిన ప్రజలందరి అభిప్రాయముకూడా. ఎందుకంటే పబ్బం గడుపుకోవడానికి ముందు సరే అని ఒకవేళ తెలంగాణా ఏర్పడితే హైదరాబాదులో స్థిరపడిన తెలంగాణేతరులను ఇక్కడ బ్రతకనిస్తారనే హామీ లేదు. కాబట్టి ఒకవేళ తెలంగాణా ఏర్పడితే హైదరాబాదును యూనియన్ టెరిటరీగా ప్రకటించడం సమంజసమే.

టీవీ-5 తొ మాట్లాడుతూ జేఏసీ నాయకుడు రవి ఉద్యమంలో కొందరి బయట వారుండవచ్చని చెపుతున్నప్పుడు వరవరరావు అతడు అమాయకుడు అతనికి ఏమి తెలియదు అని వెనకేసుకొచ్చడు. మరి ఏమి తెలియని విద్యార్ధులను ఉద్యమంలోకి లాగడం ఎందుకు? ఎంతోమంది విద్యార్ధులపై లఠీలు విరిగాయి. ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. కేసీఅర్ జీవితాన్ని చూసిన వ్యక్తి. బ్రతికినంత కాలం ఎలాగూ బ్రతకడు. కానీ అతనికోసం జీవితం అంటే తెలియని వయసులోనే విద్యార్ధులు సమిధలవుతున్నారే. వారిని ఈ ఉద్యమానికి పురుగొల్పినదెవరు? రాజకీయనాయకులు కాదా? ఇంతవరకూ ఒక్క రాజకీయనాయకుడైనా కనీసం లాఠీ రుచి చూసాడా? మరి విద్యార్ధులే ఎందుకు బలవ్వాలి?

గద్దరన్నా నాదో ప్రశ్న. బుల్లెట్ట్లను సైతం ఒంట్లో దాచుకున్న ఉద్యమ కారుడివి నువ్వు. కాలానికి ఎదురు ఈదలేక నువ్వే ఎంతమారిపోయావో చూసుకున్నావా? నూలుపంచె స్థానంలో నల్లని టెరీకాట్ పాంటు వేశావు. నల్లని కంబళిబదులు తెల్లని పొలియస్టర్ చొక్కాని టక్ చేశావు. పొడవైన గెడ్డాన్ని నున్నగా చేశావు. తెల్లని పొడవైన జుట్టును కట్టిరించి నల్లని రంగు వేశావు. ఇంకా కాలం తీరిన సిద్ధంతాలని విద్యార్ధులపై ఎందుకు రుద్దుతావన్నా? అసెంబ్లీ ముట్టడి అంటూ విద్యార్ధులు ఎగబడుతున్నారు. నీకుగానీ ఏ రాజకీయనాయకుడికి కానీ ఏమవ్వదని తెలుసు. కానీ ఎందరు అమాయక విద్యార్ధులు తూటాలకు బలవ్వుతారోనని భయమేస్తొందన్నా. విద్యార్ధుల శవాల మెట్లపై అధికారం హస్తగతం చేసుకోవాలనుకొనే నాయకులను చూస్తూ ఉంటే భయమేస్తోందన్నా. వారి మానాన వారిని ప్రశాంతంగా బ్రతకనీయండన్నా.

December 6, 2009

తెలంగాణా ఉద్యమ విజయావకాశాలు

కేసీఅర్ దీక్ష ప్రారంభించి వారం రోజులు కావస్తోంది. ఈ వారం రొజులలో ఎన్నో నాటకీయ పరిణామాలు జరిగాయి. ప్రభుత్వ రక్షణలో ఉన్న ఆయనకు ఒక రకంగా రెండు ఫలితాలు దక్కాయి. మొదటికి ఆయన వైద్యుల సంరక్షణలో ఉండడం రెందోది ఆయన ఆరోగ్యంగా (సెలైన్ తొ) దీక్ష కొనసాగించడం. ఇక నాకెందుకో తెలంగాణా ఉద్యమకారులలో వాస్తవిక దృక్పదం ఉన్నవాళ్ళు కనిపించలేదు ఒకే ఒక్క జయశంకర్ తప్ప. రాష్ట్ర ప్రభుత్వానికిగాని అటు కేంద్ర ప్రభుత్వానికిగానీ ప్రత్యేక రాష్ట్రంపై ఎలాంటి అభిప్రాయం లేదు. అటువంటి పరిస్తుతులలో "కూడా రావద్దు అంటే ఎత్తుకోమని ఏడ్చినట్టు" అసలు ప్రత్యేక రాష్ట్రమంటేనే పడని ప్రభుత్వం ఇప్పటికిప్పుడు నిరాహారదీక్షలో కూర్చొని నిర్నయం తీసుకోమంటే కోరి ప్రాణాలమీదకి తెచ్చుకోవడమే. ఇప్పటికే కేసీఆర్ ఖాతాలో పది వికెట్లు పడ్డాయి. చివరి వికెట్టు కేసీఅర్‌ది కాకుండాచూసుకోవలసిన బాధ్యత ఉద్యమకారులదే. ప్రత్యేక రాష్ట్రం కోసం ఆత్మహత్యలు చేసుకున్నవారందరికీ తలో పదిలక్షలు ఇవ్వాలని టీఆరెస్ డెమాండ్ చేస్తోంది. వారి మాటలు నిజంగా రాజకీయంగా హాస్యాస్పదంగా ఉన్నాయి. చివరకి వాస్తవికతను ఒప్పుకొన్నది ఒక్క జయశంకర్ మాత్రమే. "ప్రత్యేక రాష్ట్ర అంశం కేవలం ముఖ్యమంత్రి చేతుల్లో లేదు. కనీసం ఆయన అసెంబ్లీలో ఒక తీర్మానం చేయచ్చు కదా " అంటున్నారు. అమ్మయ్య కనిసం వీరైనా విషయం తెలుసుకున్నారు అనిపించింది. మరి మిగిలినవారికి ఈ విషయం తెలియకనా? కాదు అదే డ్రామా. కేసీఅర్ డ్రామా. ప్రభుత్వం స్పష్టమైనా హామీ ఇస్తే దీక్ష విరమిస్తారుట. దీక్ష విరమిస్తేనే చర్చలకు పిలుస్తానని ముఖ్యమంత్రి అంటున్నారు. మరి విత్తుముందా లేక చెట్టు ముందా? మరింత జాప్యం చేస్తే మరో వికెట్టు ఖాయం అని చెప్పొచ్చు. కానీ తెలంగాణా ఇప్పటికిప్పుడు తేలే అంశం కాదన్నది సుస్పష్టం. మరి ఈ ఉద్యమం? కొన్నిరోజులు సా..సా...గి ఒక హామీతో సంతృప్తి చెందాల్సిందే!!

December 3, 2009

సమైక్యవాదం బూతుమాట అయిన వేళ...

మొత్తానికి కేసీఆర్ ను హైదరబాదు పట్టుకొచ్చారు.మరి ప్రభుత్వం ఆయన ఆరోగ్య రీత్య తీసుకొచ్చిందో, మానవహక్కుల సంఘం మాటలవల్లో లేక కేసీఆర్ పంతంవల్ల తీసుకొచ్చిందో గాని ఆయన ఉద్యమ విద్యార్ధుల మధ్యకు వచ్చి పడ్డాడు. ఖమ్మంలో తనకు ప్రాణహాని ఉన్నదన్న వాదన కేవలం ఒక సాకు మాత్రమేనని అందరికి తెలిసిందే. నాకు మాత్రం కేసీఆర్ పరిసిస్తితి చూస్తే జాలి వేస్తోంది. ముందు నుయ్యి వెనుకు గొయ్యి అన్నట్టు తయారయ్యింది. ఒకరోజు నిరాహారదీక్షతొ మంటలు ఎగదోసి చోద్యం చూద్దమనుకున్న కేసీఆర్ కు చుక్కెదురెయ్యింది.దీక్ష విరమించగానే విద్యార్ధుల ఆగ్రహంతొ ఖంగు తిన్న కేసీఆర్ దీక్షను కొనసాగించక తప్పలేదు. మానేస్తే విద్యార్ధులతో తంటా ముందుకెడితె ప్రాణాలకు సంకటం. వీటి మధ్య ఊగుతూ కొద్దిసేపు డాక్టర్లకు సహకరిస్తూ కొద్దిసేపు తిరస్కరిస్తూ ప్రాణాలని ఉగ్గబెట్టుకు బ్రతుకుతున్నాడు.

ఇక ఉద్యమం చాలావరకు కేసీఅర్‌ను దాటి విద్యార్ధుల చేతులలోకి వెళ్ళిందనిపిస్తోంది. విద్యార్ధులు కూడా త్యాగాలు మాని నెమ్మదిగా బలి తీసుకొనే స్థాయికి చేరుతున్నారు. ఆస్తులపై దాడులు, రోడ్డుపై ప్రయాణించే వారిపై దాడులతో రాక్షస రూపాన్ని సంతరించుకుటున్నారు. చదువుకున్న వీరు కూడా ఆంధ్ర బూచినే సాకుగా చెప్పడం దానికి ఉదాహరణ. తెలంగాణా ప్రాంతాల వెనుకబాటుకు కారణం ఆంధ్రా ప్రజలా? ఆంధ్రాలో వెనుకబాటుతనం లేదా? ఆంధ్రాలో ఉపాధికోసం ప్రజలు వలసలు వెళ్ళడం ఇరవై అయిదు ముప్ఫై సంవత్సరాల క్రితమే మొదలయింది. పొట్ట చేతబట్టుకొనె గల్ఫ్ దేశాలు వెళ్ళి మూటలు మోసి, టాయిలెట్లు కడిగి పైస పైస కూడగట్టి వారి సంసారాలని ఒక స్థాయికి తెచ్చుకున్నారు. మరి ఇక్కడి ప్రజలకు ఒళ్ళుఒంచి పనిచేసే అలవాటు లేదా? అక్కడికి వెళ్ళిన యౌవకులు ఎంతో మంది ప్రమాదాలకు లోనై మరణించారు కూడా. ఇక ఇక్కడ పచ్చళ్ళు వ్యాపార్లు పెత్తనం చేస్తున్నారని ఒక వాదన. వారివల్ల కొన్ని వేల మందికి జీవనాధారం కలుగుతోందనే విషయం స్పురణకు రాలేదా? మా దేశంలో పెట్టుబడులు పెట్టండని విదేశస్తులనే మనవాళ్ళు దేవురిస్తున్నారుకదా? పచ్చళ్ళ వ్యాపారులు అంతకన్నా తీసిపోయారా? వీరు చేస్తున్న పోరాటం వారు ఎన్నుకున్న నాయకులపై చేసిఉంటే తెలంగాణా ఎప్పుడో బాగుపడి ఉండేది.స్వార్ధపరుల అధికార దాహం కోసం రగిలించిన కాష్టం ఇది. దీనివల్ల ప్రజలలో కూడా బేధాలు మొదలవుతున్నాయి. సమైక్యవాదం పేరెత్తితే చాలు మనుషులని చంపేసే పరిస్తితి దాపురిస్తోంది. అర్హతలున్నవారికి విదేశాలలోసైతం ఉద్యాలొస్తున్నయి కదా? తెలంగాణా విద్యార్ధులు విదేశాలలో ఎంతోమంది ఉద్యోగం చేస్తున్నారుకదా? తెలంగాణావారని వారిని వెనుకబెట్టలేదుకదా? మరి అర్హత లేనప్పుడు ప్రత్యేక రాష్త్రం వచ్చినా వారికి ఏ ప్రభుత్వం ఉద్యోగం ఇస్తుందో కేసీఆరే చెప్పాలి. వెనుకబాటుతనం, దోపిడీ, వ్యతిరేకవాదం, కుట్రలు అంటూ ఆంధ్రా ప్రజలను దూషించక్ఖర్లేదు. మీ ఏడుపు మీరు ఏడవండి...మా ఏడుపు మేము ఏడుస్తాము అంటున్నరు ఆంధ్రప్రజలు. కొంతవరకు ఇది నిజమే అనిపిస్తోంది.

December 1, 2009

ఎం.ఎల్.సీ. నాగేశ్వర్ జెంటిల్ మేన్?

మీలొ ఎంతమంది ఈ రొజు ఉదయం టీవీ-5 లొ జరిగిన " తెలంగాణా ప్రస్తుత పరిస్తితి" పై చర్చ చూసారో? దానిలో రాజకీయ విశ్లేషకులు, విద్యావేత్త, ఎం ఎల్ సీ అయిన నాగేశ్వర్, ఆంధ్ర మేధావుల తరపున శ్రీనివాస్ మరొకరు కార్యక్రమంలో పాల్గొన్నారు. నాగేశ్వర్ ఉద్యమంలో విద్యార్ధులపై పోలీసుల దాడిని నిరశించారు. యూనివర్సిటీలోకి పోలీసులు ప్రవేసించే అవసరం లేదని అంటూ ఇంతవరకు యూనివర్సిటీ చరిత్రలో విద్యార్ధులు బాంబులతో దాడి ఎప్పుడూ చేయలేదని అది మరొకరి పనే అయిఉండవచ్చని అన్నారు. అంతవరకూ బాగానే ఉంది. తరువాత ఆంధ్ర మేధవుల తరపున శ్రీనివాస్ మాట్లాడుతూ ఒక పేపర్ లో వచ్చిన వార్తను ఉటంకిస్తూ పన్నెండు సంవత్సారాల పిల్లలు తెలంగాణా కోసం ఆత్మ హత్యలు చేసుకుంటామని అంటున్నారని వారికి కనీసం ఉద్యమం అంటే తెలీయదు తెలంగాణా అంటే తెలీయదు అలాంటి వారిని రాజకీయ నాయకులు బలి పసువులు చేస్తున్నారని చెప్పబోతూ ఉంటే నాగేశ్వర్ ప్రవర్తన చాలా ఆశ్చర్యం కలిగించింది. ఆత్మహత్యలను నేను ఖండించాను కదా మీరెలా మళ్ళీ మళ్ళీ ప్రశ్నిస్తారు అంటూ ఒక్కసారిగా రెచ్చిపోయారు. మీరు నన్ను అడుగుతారా? మేము ఆత్మహత్యలను సమర్ధించామా? నేను పార్టీలకు తప్పు చేస్తే తప్పు అని మంచి చేస్తె మంచిదని చెప్పాను. ఎన్నో చానల్స్ కి విశ్లేషణ చేసాను. నన్ను అడుగుతావా నేను వెళ్ళి పోతాను అంటూ చిందులు మొదలు పెట్టాడు. నిజానికి శ్రీనివాస్ ఆ ప్రశ్నను రాజకీయపార్టీలకు ముఖ్యంగా టీఆరెస్ ను ఉద్దేశించి అడగ బోతున్నాడు. పేపర్‌లో క్లిప్పింగ్ చూడనీయకుండా ఆ విషయాన్ని చెప్పనీయకుండా నాగేశ్వర్ ఆడిన డ్రామా నాకైతే అసహ్యం వేసింది. నేను మిమ్మల్ని అడగలేదు అంటూ శ్రీనివస్ పదే పదే చెప్పినా ఆయన వీరంగం సృష్టించారు.చివరికి ఆ అంశన్ని వదిలిపెట్టి చర్చ ముగించారు. నాగేశ్వర్ అంటే నాకు ఇప్పటివరకు ఒక మంచి అభిప్రాయం ఉండేది. కానీ ఆయన కూడా ఫక్తు రాజకీయ నాయకుడు. నేను తెలంగాణా వాదినని ఒప్పుకొని వారి తరపున వాదించినా ఫర్వాలేదు కానీ మధ్యవర్తిగా రావడానికి అర్హుడు కాదు.