July 3, 2009

మా(టీవి) తుఝే సలాం!

గురువారం రాత్రి తొమ్మిది గంటలకు మా టీవీ చూసిన ప్రేక్షకులందరూ తప్పకుండా భావోద్వేగానికి గురై ఉంటారని భావిస్తున్నాను.రేలారే కార్యక్రమం చూసేక ఇది నాకు కలిగిన భావన. " పల్లే కన్నీరూ పెడుతూందో కనిపించని కుట్రల" అంటూ ప్రముఖ జానపద గాయకుడు వెంకన్న చిందేస్తూ పాడిన పాట ప్రేక్షకుల గుండెను గొంతులోకి తెచ్చింది. నరాల్లో రక్త ప్రవాహం పెరిగి ఒక ఉద్వేగానికి గురై ఉంటారు. గ్లోబలైజైషన్ వల్ల కుల వృత్తులు చేసుకునెవాళ్ళు ఏవిధంగా జీవనం కోల్పోయి ఎలా అనాధలయ్యరో, పల్లెలు ఏవిధంగా బోసిపోయాయో పాడి వినిపిస్తూ ఉంటే ప్రముఖ పాటల రచయితలు సుద్దాల అశోక్ తేజ, చంద్ర బోసులు కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. జానపద గీతాలంటే ప్రజలలో మరోసారి క్రేజ్ కలిగించిన ఈ కార్యక్రమం నిజంగా ఒక ఆణిముత్యం. ప్రైవేట్ చానల్స్ మధ్య ఉన్న ఇంత పోటిలో కూడా కొన్ని విలువలకు కట్టుబడి సంస్కృతికి సంభంధించిన కార్యక్రమాలను విజయవంథంగా ప్రజల మధ్యకు తీసుకు వెడుతున్న మా తుఝే సలాం!!

4 comments:

Vani said...

i agree with you. It was really good. If anyone recorded it, please post on YouTube.

మాలా కుమార్ said...

avunu aa programe chaalaa baaguntondi.

ఏక లింగం said...

ఈ పాట రచయిత గోరటి వెంకన్న. దీనిని "కుబుసం" అనే సినిమాలో వాడుకున్నారు. youtube విడియో ఇక్కడ చూడండి.
http://www.youtube.com/watch?v=jBp884js_UQ

Bhaskar said...

Ee pata choosinappudu/vinnappudu prathi sari kallu neellu thirugutai..maa baallyam Cherukupalli/Ponnur lo gurthukochi.

Venkanna gaariki paadabhinandanalu.